वारकरी कीर्तनकारांच्या केसालाही धक्का लागणार नाही ! उप मुख्यमंत्री एकनाथ शिंदे साहेब वारकरी संप्रदायाबाबत करण्यात आलेल्या आक्षेपार्ह विधानानंतर राज्यभर तीव्र प्रतिक्रिया उमटल्या असून विविध ठिकाणी तक्रारी व निवेदने दाखल करण्यात आली आहेत. या संपूर्ण प्रकरणाची माहिती मिळताच उपमुख्यमंत्री एकनाथ शिंदेनी तातडीने दखल घेत संवेदनशीलता दाखवली. शिवसेना धर्मवीर आध्यात्मिक सेनेचे प्रदेशाध्यक्ष अक्षयमहाराज भोसले यांच्या माध्यमातून उपमुख्यमंत्री शिंदे यांनी वारकरी संप्रदायातील ज्येष्ठ व मान्यवर कीर्तनकारांशी थेट संवाद साधला. या संवादाद्वारे वारकरी संप्रदायाच्या भावना समजून घेत त्यांना आश्वस्त करण्यात आले. “महाराष्ट्र ही संतांची, वारकऱ्यांची आणि छत्रपती शिवाजी महाराज यांच्या विचारांनी प्रेरित पवित्र भूमी आहे. येथे वारकरी संप्रदायात कार्य करणाऱ्या कोणत्याही व्यक्तीच्या केसालाही धक्का लागणार नाही. आपण कोणतीही चिंता करू नये. आम्ही सर्वजण आपल्या पाठीशी ठामपणे उभे आहोत. अध्यात्मिक व धार्मिक अधिष्ठान हे नेहमीच राजकीय अधिष्ठानापेक्षा श्रेष्ठ राहिले आहे आणि पुढेही तसेच राहील. ” असे आश्वासन उपमुख्यमंत्री ना.एकनाथ शिंदेनी यावेळी संवादादरम्यान दिले.
वारकरी कीर्तनकारांच्या केसालाही धक्का लागणार नाही ! उप मुख्यमंत्री एकनाथ शिंदे साहेब वारकरी संप्रदायाबाबत करण्यात आलेल्या आक्षेपार्ह विधानानंतर राज्यभर तीव्र प्रतिक्रिया उमटल्या असून विविध ठिकाणी तक्रारी व निवेदने दाखल करण्यात आली आहेत. या संपूर्ण प्रकरणाची माहिती मिळताच उपमुख्यमंत्री एकनाथ शिंदेनी तातडीने दखल घेत संवेदनशीलता दाखवली. शिवसेना धर्मवीर आध्यात्मिक सेनेचे प्रदेशाध्यक्ष अक्षयमहाराज भोसले यांच्या माध्यमातून उपमुख्यमंत्री शिंदे यांनी वारकरी संप्रदायातील ज्येष्ठ व मान्यवर कीर्तनकारांशी थेट संवाद साधला. या संवादाद्वारे वारकरी संप्रदायाच्या भावना समजून घेत त्यांना आश्वस्त करण्यात आले. “महाराष्ट्र ही संतांची, वारकऱ्यांची आणि छत्रपती शिवाजी महाराज यांच्या विचारांनी प्रेरित पवित्र भूमी आहे. येथे वारकरी संप्रदायात कार्य करणाऱ्या कोणत्याही व्यक्तीच्या केसालाही धक्का लागणार नाही. आपण कोणतीही चिंता करू नये. आम्ही सर्वजण आपल्या पाठीशी ठामपणे उभे आहोत. अध्यात्मिक व धार्मिक अधिष्ठान हे नेहमीच राजकीय अधिष्ठानापेक्षा श्रेष्ठ राहिले आहे आणि पुढेही तसेच राहील. ” असे आश्वासन उपमुख्यमंत्री ना.एकनाथ शिंदेनी यावेळी संवादादरम्यान दिले.
- *తేదీ: 25-04-2026* *జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి* పత్రికా ప్రకటన *జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం* *26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్లో నమోదు చేసుకోండి* *ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్* కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్ఎల్ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. *స్వీయ గణన విధానం:* 1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. 4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కు తప్పనిసరిగా తెలియజేయాలి. 5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది. "జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్ కోరారు. *ముఖ్యమైన తేదీలు:* - *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు - *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్ఎల్ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.1
- *పేద విద్యార్థుల ఉన్నత విద్యకై దోహదపడుతున్న ఫీజురియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది - ABVP*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP మెదక్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకై పాంప్లెంట్ విడుదల చేసి ఉద్యమ కార్యచరణను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ABVP రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నది అని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ విద్యాసంస్థలు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ పథకం అమలుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పదే పదే అడిగినప్పటికీ కౌంటర్ దాఖలు చేయని కారణంగా "ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది." ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిర్ణయానికి కారణం అయింది అని అన్నారు లక్షలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, లా, మెడిసిన్ లాంటి కోర్సులు చదివి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారంటే దానికి కారణం "ఫీజు రీయింబర్స్మెంట్ పథకం" అని, ప్రతీ యేట 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ఆధార పడి చదువుకుంటున్నారు అని ఆయా కోర్సులలో ప్రభుత్వ హామీ మేరకే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని అడ్మిషన్లు పొందారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ తీరుతో విద్యార్థిలోకం అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది అని వాపోయారు 10000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకపోవడమే కాకుండా, ఇప్పుడు మొత్తమే ఈ స్కీం కి "మంగళం"పాడాలని ప్రభుత్వం చూస్తున్నది అని అన్నారు ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజురియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడానికి కృషిచేసి విద్యార్థుల లోకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ భాను కార్యకర్తలు సాయికిరణ్,శివదత్త ,భాస్కర్, వర్షిత్,దర్శన్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు1
- కర్నూలు జిల్లా వెల్దుర్తి లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం లోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్న బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు ఉదయం నుంచి పెట్రోల్ కోసం ఎన్నో బంకులు చుట్టూ తిరుగామని అయినా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజల్ ఎక్కడా దొరకడం లేదని పరిస్థితిని వెంటనే చక్కనిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు.1
- కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.1
- పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్)లో చేరదలచిన వారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజానన్ బిడ్కర్ గారిని లేదా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ గారిని సంప్రదించగలరు. మొబైల్ నంబర్లు: 9890476595, 7680092628.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- Post by Vishwamber Rao1
- *అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్లకు 13 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఎంపిక* : ఉన్నత చదువులు అభ్యసించాలనే పట్టుదల ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు కల్పిస్తున్న అవకాశాలు, వివిధ సంస్థలు అందించే ఉపకార వేతనాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. విజయ్ కుమార్ పేర్కొన్నారు. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లకు కళాశాలకు చెందిన 13 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన ఒక్కో విద్యార్థినికి ఏటా రూ.30,000 చొప్పున మూడేళ్ల పాటు ఈ ప్రోత్సాహకం అందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు డిగ్రీ ప్రవేశాల కోసం ప్రభుత్వం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో, విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యతగా అన్ని వసతులు ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను ఎంచుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన న్యాక్ గుర్తింపు తో పాటుగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఏకైక ప్రభుత్వ కళాశాల ఇదని ఆయన స్పష్టం చేశారు. అటానమస్ హోదా వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగవంతమైన పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు.ఇటువంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత స్కాలర్షిప్లు కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే ఎక్కువగా అందుబాటులో ఉంటాయని వివరించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం మరియు క్రీడా ప్రాంగణం వంటి అన్ని వసతులతో కళాశాల విరాజిల్లుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక గొప్ప వేదిక. అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ను పొందిన విద్యార్థుల వలె, మిగిలిన వారు కూడా ఇక్కడ చేరి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.కిష్టయ్య అధ్యాపక బృందం మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన సమ్మె మూడు రోజులకు చేరుకొనడంతో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడంతో స్పందించిన ప్రభుత్వం చర్చ కార్మిక చేస్త చర్చలు జరిపి సఫలం చేశారు ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం విధుల్లో చేరి సంబరాలు జరుపుకున్నారు టపాసులు పేల్చారు జేఏసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు1