ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకుడు... నర్సంపేటకు తీరని లోటు ప్రెస్ నోట్ జోహార్ పెద్దన్న... జోహార్ జోహార్! 🙏 ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకుడు... నర్సంపేటకు తీరని లోటు నర్సంపేట అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, పేదల ఆశాజ్యోతి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత ప్రజానాయకుడు పెద్దన్న శాశ్వతంగా మన మధ్య లేకపోవడం నర్సంపేట ప్రజలకు తీరని విషాదమని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారం కోసం కాదు... ప్రజల కోసం రాజకీయాలు చేసిన అరుదైన నాయకుడు పెద్దన్న అని కొనియాడారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి, అర్ధరాత్రి అయినా ప్రజల పిలుపుకు స్పందించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పేదవాడి ఇంటి తలుపు తట్టిన నాయకుడిగా, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. "మీరు వేలాది కుటుంబాల్లో చిరునవ్వులు నింపారు... ఎన్నో తల్లుల కళ్లలో కన్నీళ్లు రాకుండా చేశారు. కానీ ఈ రోజు మీ భౌతిక దేహానికి చివరి వీడ్కోలు పలుకుతున్న వేళ స్వప్న అక్కతో పాటు వేలాది మంది ప్రజలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ప్రజల ప్రేమను సంపాదించడం ప్రతి ఒక్కరి వల్ల కాదు... అది మీలాంటి మహానాయకులకే సాధ్యం." అని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ అన్నారు. "మీ వంటి జననాయకుడిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ మార్గంలో ముందుకు సాగుతాను. మీరు చూపిన బాటే మా బాట... మీరు నాటిన ప్రజాసేవా విత్తనం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. మీ ఆశయాల సాధనే మీకు మేమిచ్చే నిజమైన నివాళి." అని ఆయన స్పష్టం చేశారు. పెద్దన్న భౌతికంగా దూరమైనా, ఆయన ఆశయాలు, ప్రజల కోసం చేసిన సేవలు, చూపిన మార్గం నర్సంపేట ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. "నాయకులు ఎందరో వస్తారు... కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకులు అరుదు. అలాంటి మహానాయకుడు పెద్దన్న." జోహార్ పెద్దన్న... మీ ఆశయాలు చిరంజీవి... మీ సేవలు చిరస్మరణీయం... 🙏🌹
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకుడు... నర్సంపేటకు తీరని లోటు ప్రెస్ నోట్ జోహార్ పెద్దన్న... జోహార్ జోహార్! 🙏 ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకుడు... నర్సంపేటకు తీరని లోటు నర్సంపేట అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, పేదల ఆశాజ్యోతి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత ప్రజానాయకుడు పెద్దన్న శాశ్వతంగా మన మధ్య లేకపోవడం నర్సంపేట ప్రజలకు తీరని విషాదమని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారం కోసం కాదు... ప్రజల కోసం రాజకీయాలు చేసిన అరుదైన నాయకుడు పెద్దన్న అని కొనియాడారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి, అర్ధరాత్రి అయినా ప్రజల పిలుపుకు స్పందించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పేదవాడి ఇంటి తలుపు తట్టిన నాయకుడిగా, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా ఆయన సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. "మీరు వేలాది కుటుంబాల్లో చిరునవ్వులు నింపారు... ఎన్నో తల్లుల కళ్లలో కన్నీళ్లు రాకుండా చేశారు. కానీ ఈ రోజు మీ భౌతిక దేహానికి చివరి వీడ్కోలు పలుకుతున్న వేళ స్వప్న అక్కతో పాటు వేలాది మంది ప్రజలు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ప్రజల ప్రేమను సంపాదించడం ప్రతి ఒక్కరి వల్ల కాదు... అది మీలాంటి మహానాయకులకే సాధ్యం." అని డా. బోడ అనిల్ కుమార్ నాయక్ అన్నారు. "మీ వంటి జననాయకుడిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ మార్గంలో ముందుకు సాగుతాను. మీరు చూపిన బాటే మా బాట... మీరు నాటిన ప్రజాసేవా విత్తనం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. మీ ఆశయాల సాధనే మీకు మేమిచ్చే నిజమైన నివాళి." అని ఆయన స్పష్టం చేశారు. పెద్దన్న భౌతికంగా దూరమైనా, ఆయన ఆశయాలు, ప్రజల కోసం చేసిన సేవలు, చూపిన మార్గం నర్సంపేట ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. "నాయకులు ఎందరో వస్తారు... కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జననాయకులు అరుదు. అలాంటి మహానాయకుడు పెద్దన్న." జోహార్ పెద్దన్న... మీ ఆశయాలు చిరంజీవి... మీ సేవలు చిరస్మరణీయం... 🙏🌹
- జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.1
- పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలోని పాతర్లపాడు కూలిన కల్వర్టు తన సొంత ఖర్చులతో రహదారికి తాత్కాలిక మరమ్మతులు గ్రామ సర్పంచ్ జడల సుష్మ చేయించారు. దీనితో రెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. గ్రామస్థులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.1
- భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.1
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.1
- బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపును చుట్టుముట్టిన గోదావరి వరద..! - కాలనీలోకి చేరిన వరద నీరు.. భయాందోళనలో స్థానికులు - లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు - అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక బస్సప్ప క్యాంపులో గోదావరి వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో కాలనీ చుట్టూ వరద నీరు చేరి పలు ఇళ్లను చుట్టుముట్టింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి మరింత విషమిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.2