Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది రిపబ్లిక్ డే వేడుకల కోసం పాఠశాల సిబ్బంది విద్యార్థినీలతో ఆటోలో టెంట్ హౌస్ నుంచి కుర్చీలను విద్యార్థినుల సహాయంతో తరలించారు విద్యార్థినిలు పాఠశాల లో ఆటోలో నుండి కుర్చీలు దించుతున్న సమయంలో ఆటో డ్రైవర్ ఆటోను ఒక్కసారిగా స్టార్ట్ చేసి తీసుకొని పోవడంతో కుర్చీ తీసుకొని బయట పెడుతున్న సంగీత అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని కిందపడి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందింది సంగీత మదునూర్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన బాలికగా పాఠశాల సిబ్బంది తెలిపారు
Narmala Swapna
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది రిపబ్లిక్ డే వేడుకల కోసం పాఠశాల సిబ్బంది విద్యార్థినీలతో ఆటోలో టెంట్ హౌస్ నుంచి కుర్చీలను విద్యార్థినుల సహాయంతో తరలించారు విద్యార్థినిలు పాఠశాల లో ఆటోలో నుండి కుర్చీలు దించుతున్న సమయంలో ఆటో డ్రైవర్ ఆటోను ఒక్కసారిగా స్టార్ట్ చేసి తీసుకొని పోవడంతో కుర్చీ తీసుకొని బయట పెడుతున్న సంగీత అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని కిందపడి తీవ్ర గాయాలు అయ్యాయి ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందింది సంగీత మదునూర్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన బాలికగా పాఠశాల సిబ్బంది తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం: పోచారం బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.1
- మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను అందజేశారు.ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3 ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ వారు హుస్సేన్ గారికి పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,మాజీ కౌన్సిలర్లు వంజరి. జయరాజ్, సోహెల్,ఆర్కే శ్రీనివాస్,జ్యోతి కృష్ణ,నాయకులు సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్,సాదిక్,సునీల్, సంతోష్,ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్,ఓమర్ ఫరూక్,మధు, అమీర్,కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాదు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు సరైన సౌకర్యాలు లేవని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పూర్తిగా దుర్గంధముగా మారిందని, పైప్ లైన్ లీకేజీ తో దుర్వాసన వెదజల్లుతోందని అన్నారు. ఆసుపత్రిలో సైతం సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు.1
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం1
- హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..1
- కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు గణతంత్ర 77 దినోత్సవం సందర్భంగా బాల్కొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సింగరేణి కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఆయన, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.1
- జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు -జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ -పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా] నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, NCC పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏ.వో షాదబ్ హకిమ్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమబంధిత కార్యాలయాల సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ....భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు. జిల్లాలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర విభాగాల్లో సాధించిన పురోగతి పై ఆయన విభాగాల వారీగా ఉపన్యాసించారు. వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్–రబీ సీజన్లలో పంటల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కెట్ యార్డుల్లో MSP చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఆరోగ్యరంగంలో జిల్లాలో PHC, CHC, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుపడినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, CC రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, త్రాగునీటి సరఫరా వంటి పౌరసేవలు అమలు అవుతున్నాయని తెలియజేశారు. పట్టణాభివృద్ధిలో రోడ్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ట్యాంకుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు అమలు అవుతున్నాయని వివరించారు.4
- బాన్సువాడలో అఖిలపక్ష నాయకుల ధర్నా బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా చేపట్టారు. బోర్లం క్యాంప్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాలిలో కలిసిందని వారు మండి పడ్డారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంటకుపైగా ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి:1