Shuru
Apke Nagar Ki App…
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.
SREEYAN
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మె కారణంగా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాద దీపం............. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్ రావు దేశ్పాండే ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులతో పాటు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు.1
- ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ఐలు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళా పోలీసుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తిభావంతో గణనాథుడిని సాగనంపారు.4
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- తెలంగాణ దొంగలు YouTube ఛానల్, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన BRSV కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వీడియోలు ప్రచారం చేస్తున్నారని, ఆ ఛానల్లను బ్లాక్ చేసి వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు1
- శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడి కుంభకోణం:MLA సుధీర్ రెడ్డి శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక ఎంపీ కుంభకోణం బహదూర్గూడాలో 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అందులో 300 ఎకరాల భూ యజమానులను, నీకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇప్పిస్తా, అందులో సగం నాకు ఇవ్వాలని కొందరు దళారులు దందా చేస్తున్నారు ఆ దళారుల వెనుక ఒక ఎంపీ, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నాడని మాకు తెలిసింది – బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి1
- సంగారెడ్డి జిల్లా పెద్దకంచెర్ల ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థులు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రమాదం చోటుచేసుకోగా, పలువురు విద్యార్థులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థులు వెల్లడించారు. నిమజ్జనం సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో భయాందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ ప్రమాదం 6:30 ప్రాంతంలో జరిగిందని విద్యార్థులు తెలిపారు.1