Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
Jeetender
హైదరాబాద్ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- జాతులు వేరైనా మనసు ఒక్కటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే నిలయం సర్వ మతాల సమ్మేళన నిదర్శనం తెలంగాణ జాతులు వేరైనా.. మనసులు ఒక్కటే మతాలు వేరైనా.. మానవత్వం ఒక్కటే విభిన్న జాతులు, సంస్కృతులకు నిలయం సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనం తెలంగాణ కాజీపేట దర్గాలో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి పాల్లొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు1
- కల్తీ ఆహారానికి చెక్ పెట్టిన ఉప్పల్ SOT... పీర్జాధిగూడ గల్ఫ్ బేకరిపై దాడి విశ్వసనీయ సమాచారంతో SOT ఉప్పల్ జోన్ బృందం పీర్జాదిగూడలోని గల్ఫ్ బేకరీపై దాడి నిర్వహించింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ముడి పదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఫ్లేవర్, జామ్, సాస్ మరియు కేకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తే కఠిన చర్యలు తప్పవు.2
- అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*2
- స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని చాటేందుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఐదు రోజుల పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములై భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.1