logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Promise made ✅ Promise delivered ✅ As promised, the Modi government has stood firmly with students against paper leaks and exam fraud. With the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, India has taken a decisive step towards a fair, transparent and credible examination system.

17 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Urban, Telangana•
17 hrs ago

Promise made ✅ Promise delivered ✅ As promised, the Modi government has stood firmly with students against paper leaks and exam fraud. With the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, India has taken a decisive step towards a fair, transparent and credible examination system.

More news from తెలంగాణ and nearby areas
  • గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్..... సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650 జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ నగేష్, బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పాల్గొన్నారు. సమాజంలో కుల వివక్షను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గురు రవి దాస్ బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు.
    1
    గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్.....
సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650 జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ నగేష్, బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పాల్గొన్నారు. సమాజంలో కుల వివక్షను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గురు రవి దాస్ బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 min ago
  • ఎన్నికల సమరానికి టీఆర్పీ సై.. తొలి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన! రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గానికి పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనగామ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
    1
    ఎన్నికల సమరానికి టీఆర్పీ సై.. తొలి బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన!
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా జనగామ నియోజకవర్గానికి పార్టీ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో తొలి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కల్నల్ బిక్షపతి ముదిరాజ్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బిక్షపతి ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. జనగామ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, తెలంగాణ రాజ్యాధికార సాధన కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    16 hrs ago
  • మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు.
* ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ.
మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    16 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలి: ఎస్ఐ మహేందర్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ లో ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
    1
    సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలి: ఎస్ఐ మహేందర్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌక్ లో ట్రాఫిక్ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..* *వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జులై 31 :- *మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.* *బోథ్ సిఐ డి గురుస్వామి* బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు. ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    *ఇంటి పనివాడే దొంగతనానికి సూత్రధారి..*

*వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్.*
*పత్రికా ప్రకటన*
ఆదిలాబాద్ జిల్లా
జులై 31 :-
*మొత్తం 1.4 కేజీల తులాల వెండి ఆభరణాలు,15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.*
*బోథ్ సిఐ డి గురుస్వామి* 
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బోథ్ సీఐ డి గురుస్వామి తెలిపారు.
ఈ నెల 29న బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 186/2026, సెక్షన్ 331(4), 305 BNS కింద కేసు నమోదైంది. కేసు వివరాల ప్రకారం, సోనాల మండలం సూర్యనగర్ (సఖేరా) గ్రామానికి చెందిన ధరావత్ వినోద్ కుమార్ ఈ నెల 26న తన తల్లిని తీసుకురావడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫరాస్‌గావ్ గ్రామానికి వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మరియు నగదును ట్రంకు పెట్టెలో భద్రపరచి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
ఈ విషయాన్ని ఇంటి పనివాడైన *అర్జున్ ఆడే (A2) తనకు పరిచయం ఉన్న **రథోడ్ గణేష్ (A1)**కు తెలిపాడు. తమకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఇద్దరూ కలిసి దొంగతనానికి పథకం రచించారు. అదే రోజు రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రథోడ్ గణేష్ ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉన్న 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.2,000 నగదును అపహరించగా, అర్జున్ ఆడే ఇంటి బయట కాపలా కాశాడు. అనంతరం దొంగిలించిన సొత్తును తమ మధ్య పంచుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన బోథ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు. కేసు నమోదైన విషయం తెలుసుకుని చోరీ సొత్తుతో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 1.4 కేజీల వెండి ఆభరణాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని బోథ్ పోలీస్ స్టేషన్ సీఐ డి గురుస్వామి సూచించారు.
దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వి పురుషోత్తం, పోలీసు సిబ్బంది మదన్, హఫీజ్, రాహుల్, సంతోష్ లను అభినందించారు. 
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.