logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*క్యాన్సర్ బాధితురాలికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత* *మానవత్వం చాటుకున్న,మైడికొండ శౌరి...* ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదుల బండ గ్రామానికి చెందిన కుమారి గుర్రాల శ్రావణి (30) గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాదితో బాధ పడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే క్రమంలో హైద్రాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రి నందు ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి. బంధువుల వద్ద తెలిసిన పరిచయస్థుల వద్ద అప్పులు తెచ్చి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడి, శ్రావణి తండ్రి చనిపోవటంతో తల్లి కూలీ పని చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న దీనపరిస్థితి. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన యూనిటీ ఆఫ్ మాల జిల్లా ప్రధాన కార్యదర్శి, అవుట మధు విశ్రాంత నీటిపారుదల శాఖ టెక్నికల్ ఆఫీసర్, యూనిటీ ఆఫ్ మాల స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడికొండ శౌరికి వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన శ్రావణి వైద్య ఖర్చుల నిమిత్తమై రూ 5 వేల రూపాయల నగదును ఆదివారం వారి యొక్క గృహం లో అందజేశారు. పట్టుదలతో క్యాన్సర్ రోగాన్ని జయించాలని మనో ధైర్యాన్ని కల్పించారు. భవిష్యత్తు లో మరింత ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి అవుట మధు, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు చిలబత్తిని కనకయ్య, తెలంగాణ ప్రశంసా పత్ర గ్రహీత తెలగమళ్ల గోవిందు, యూనిటీ ఆఫ్ మాల నేలకొండపల్లి మండల నాయకులు దార సందీప్ పాల్గొన్నారు.

on 3 August
user_Shivaji Prees Repoter
Shivaji Prees Repoter
Nelakondapalli, Khammam•
on 3 August
8a002fbf-c7e9-4cd6-9088-ccc2a535470f

*క్యాన్సర్ బాధితురాలికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేత* *మానవత్వం చాటుకున్న,మైడికొండ శౌరి...* ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదుల బండ గ్రామానికి చెందిన కుమారి గుర్రాల శ్రావణి (30) గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాదితో బాధ పడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే క్రమంలో హైద్రాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రి నందు ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి. బంధువుల వద్ద తెలిసిన పరిచయస్థుల వద్ద అప్పులు తెచ్చి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడి, శ్రావణి తండ్రి చనిపోవటంతో తల్లి కూలీ పని చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న దీనపరిస్థితి. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన యూనిటీ ఆఫ్ మాల జిల్లా ప్రధాన కార్యదర్శి, అవుట మధు విశ్రాంత నీటిపారుదల శాఖ టెక్నికల్ ఆఫీసర్, యూనిటీ ఆఫ్ మాల స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడికొండ శౌరికి వివరించారు. తక్షణమే స్పందించిన ఆయన శ్రావణి వైద్య ఖర్చుల నిమిత్తమై రూ 5 వేల రూపాయల నగదును ఆదివారం వారి యొక్క గృహం లో అందజేశారు. పట్టుదలతో క్యాన్సర్ రోగాన్ని జయించాలని మనో ధైర్యాన్ని కల్పించారు. భవిష్యత్తు లో మరింత ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి అవుట మధు, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు చిలబత్తిని కనకయ్య, తెలంగాణ ప్రశంసా పత్ర గ్రహీత తెలగమళ్ల గోవిందు, యూనిటీ ఆఫ్ మాల నేలకొండపల్లి మండల నాయకులు దార సందీప్ పాల్గొన్నారు.

More news from Spsr Nellore and nearby areas
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    19 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    19 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    22 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Gudur, Tirupati•
    1 hr ago
  • *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
    4
    *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* 
డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు.
కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    8 hrs ago
  • *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* - సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న శివాన్ ఎర్రంనాయుడు - వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
    1
    *ఆదిత్యుని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*
- సూర్య దేవుని ఆశీస్సులు తీసుకున్న  శివాన్ ఎర్రంనాయుడు
- వైకుంఠ ఏకాదశి, రథసప్తమి ఏర్పాట్లపై ఆరా తీసిన రామ్మోహన్ నాయుడు. 
డిసెంబర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు.. తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడు తో కలసి ఆదివారం నాడు శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని అదేశించారు. 
అరసవల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడూ ఆ ఆదిత్యుని తలచుకున్నా.. విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.