logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజ్ఞతను, లోకేష్ పనితీరును విమర్శించే హక్కు జగన్ ఎప్పుడో కోల్పోయారని ఆయన స్పష్టం చేశారు. జగన్ పాలనలో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, అలాగే ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేదని హేమంత్ కుమార్ ఆరోపించారు. గ్రూప్ వన్, గ్రూప్ 2 పరీక్షలలో సైతం అవకతవకలు జరిగాయని విమర్శించారు. జగన్ ఉపాధ్యాయులను బాత్రూములు, లిక్కర్, చికెన్, మటన్ దుకాణాల వద్ద సూపర్వైజర్లుగా నియమించారని ఆయన పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా చంద్రబాబు అన్నం పెడితే, జగన్ దానిని తీసివేసి ప్రజల నోటి దగ్గర కూడును కొట్టేశారని, అందుకే ప్రజలు ఆయనను వద్దు అనుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్ తో కూడా చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అద్భుత అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ కృత్రిమ ఉద్యమాలను సృష్టించారని హేమంత్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి చంద్రబాబుపై వ్యతిరేకత తీసుకురావడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పరిపాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని జేఏసీ అధ్యక్షుడు అన్నారు. ఎన్నడూ కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించలేదని, చీకటి ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన ఆరోపించారు. దీని ఫలితంగా జగన్ చివరకు 11 సీట్లకే పరిమితం అయ్యారని హేమంత్ కుమార్ పేర్కొన్నారు.

17 hrs ago
user_N.S.R.Guptha
N.S.R.Guptha
గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
cb612754-644a-4073-9022-c563b28a5211

ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజ్ఞతను, లోకేష్ పనితీరును విమర్శించే హక్కు జగన్ ఎప్పుడో కోల్పోయారని ఆయన స్పష్టం చేశారు. జగన్ పాలనలో ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, అలాగే ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేదని హేమంత్ కుమార్ ఆరోపించారు. గ్రూప్ వన్, గ్రూప్ 2 పరీక్షలలో సైతం అవకతవకలు జరిగాయని విమర్శించారు. జగన్ ఉపాధ్యాయులను బాత్రూములు, లిక్కర్, చికెన్, మటన్ దుకాణాల వద్ద సూపర్వైజర్లుగా నియమించారని ఆయన పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా చంద్రబాబు అన్నం పెడితే, జగన్ దానిని తీసివేసి ప్రజల నోటి దగ్గర కూడును కొట్టేశారని, అందుకే ప్రజలు ఆయనను వద్దు అనుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్ తో కూడా చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అద్భుత అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ కృత్రిమ ఉద్యమాలను సృష్టించారని హేమంత్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి చంద్రబాబుపై వ్యతిరేకత తీసుకురావడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పరిపాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని జేఏసీ అధ్యక్షుడు అన్నారు. ఎన్నడూ కేంద్రానికి రాష్ట్ర పరిస్థితిని వివరించలేదని, చీకటి ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన ఆరోపించారు. దీని ఫలితంగా జగన్ చివరకు 11 సీట్లకే పరిమితం అయ్యారని హేమంత్ కుమార్ పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 'గుణపాం పార్టీ'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి, వారికి గుణపం దించిన పార్టీ 'గుణపాం పార్టీ' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం కింద వైసీపీ శ్రేణులతో కలిసి జగదాంబ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, కూటమి నేతల అక్రమాలు, అవినీతిని ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో 'గుణపాం పార్టీ'కి ప్రజలే చరమగీతం పాడతారని, బుద్ధి చెబుతారని వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు గుణపం దించినందున, ప్రజలే ఈ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
    1
    మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 'గుణపాం పార్టీ'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి, వారికి గుణపం దించిన పార్టీ 'గుణపాం పార్టీ' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం కింద వైసీపీ శ్రేణులతో కలిసి జగదాంబ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, కూటమి నేతల అక్రమాలు, అవినీతిని ఎండగట్టారు.

వచ్చే ఎన్నికల్లో 'గుణపాం పార్టీ'కి ప్రజలే చరమగీతం పాడతారని, బుద్ధి చెబుతారని వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు గుణపం దించినందున, ప్రజలే ఈ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
    user_N.S.R.Guptha
    N.S.R.Guptha
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • జూన్ 12న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేక అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమ మద్యం తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, మంగళగిరి ఆదేశాలు మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సూచనల మేరకు, పార్వతీపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ దాడులు చేపట్టారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో గుణుపూర్ పోలీసుల సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో పార్వతీపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్టీఎఫ్ పార్వతీపురం, ఎన్‌ఫోర్స్‌మెంట్ విజయనగరం బృందాలు పాలుపంచుకున్నాయి. ఈ దాడుల సందర్భంగా అధికారులు 4,000 లీటర్ల బెల్లం ఊట (ఎఫ్‌జే వాష్), 50 లీటర్ల నాటు సారా, 100 కిలోల అమ్మోనియా, మరియు 1,000 కిలోల నల్ల బెల్లాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. దీంతో అక్రమ మద్యం తయారీ ముఠాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. అక్రమ మద్యం నిర్మూలన కోసం ఇలాంటి అంతర్రాష్ట్ర సంయుక్త దాడులను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ స్పష్టం చేశారు. ఈ చర్యలు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో అక్రమ మద్యం ముఠాలకు గట్టి దెబ్బగా నిలిచి, అక్రమ మద్యం నిర్మూలనకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
    2
    జూన్ 12న నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేక అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమ మద్యం తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, మంగళగిరి ఆదేశాలు మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సూచనల మేరకు, పార్వతీపురం అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ దాడులు చేపట్టారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో గుణుపూర్ పోలీసుల సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌లో పార్వతీపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్టీఎఫ్ పార్వతీపురం, ఎన్‌ఫోర్స్‌మెంట్ విజయనగరం బృందాలు పాలుపంచుకున్నాయి.

ఈ దాడుల సందర్భంగా అధికారులు 4,000 లీటర్ల బెల్లం ఊట (ఎఫ్‌జే వాష్), 50 లీటర్ల నాటు సారా, 100 కిలోల అమ్మోనియా, మరియు 1,000 కిలోల నల్ల బెల్లాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. దీంతో అక్రమ మద్యం తయారీ ముఠాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

అక్రమ మద్యం నిర్మూలన కోసం ఇలాంటి అంతర్రాష్ట్ర సంయుక్త దాడులను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ స్పష్టం చేశారు. ఈ చర్యలు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో అక్రమ మద్యం ముఠాలకు గట్టి దెబ్బగా నిలిచి, అక్రమ మద్యం నిర్మూలనకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం, చీకుమద్దుల పంచాయితీ పరిధిలోని ముసిరిపాడు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గ్రామ ప్రజలు ఈ సమస్యను హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుకు తెలియజేయగా, ఆయన అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి దృష్టికి తీసుకెళ్లి బోర్ వెల్ మంజూరు చేయించారు. ఈ బోర్ వెల్ నిర్మాణం ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ఏఈ జగదీశ్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన గ్రామ పెద్దలు కొండ తాబేలి నారాయణ రావు మరియు కొండ తాబేలి ఆనంద్ రాయుడు, తమ గ్రామానికి తాగునీటి పరిష్కారం లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముసిరిపాడు గ్రామ ప్రజల తరపున జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, హుకుంపేట వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, డిప్యుటీ ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, అలాగే మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, బోర్ వెల్‌కు విద్యుత్ మోటార్ ఏర్పాటు చేస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ బోర్ వెల్ నిర్మాణ కార్యక్రమంలో గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎంపీడీఓ సిబ్బంది బాకూరు రామ రాజు, గ్రామ పెద్దలు కొండ తాబేలి ఆనంద్ రాయుడు, వంతాల రంగారావు, వార్డు మెంబర్‌లు నాగేశ్వర్ రావు, సురేష్, గ్రామస్తులు చిట్టిబాబు, భీమన్న, రవిబాబు, మహిళలు వంతాల కాంతామ్మ, చిలకమ్మ, రోజా, జ్యోతి సహా పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముసిరిపాడులో బోర్ వెల్ నిర్మాణం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    1
    అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం, చీకుమద్దుల పంచాయితీ పరిధిలోని ముసిరిపాడు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గ్రామ ప్రజలు ఈ సమస్యను హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుకు తెలియజేయగా, ఆయన అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి దృష్టికి తీసుకెళ్లి బోర్ వెల్ మంజూరు చేయించారు. ఈ బోర్ వెల్ నిర్మాణం ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ఏఈ జగదీశ్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తయింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన గ్రామ పెద్దలు కొండ తాబేలి నారాయణ రావు మరియు కొండ తాబేలి ఆనంద్ రాయుడు, తమ గ్రామానికి తాగునీటి పరిష్కారం లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముసిరిపాడు గ్రామ ప్రజల తరపున జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, హుకుంపేట వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, డిప్యుటీ ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, అలాగే మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా, బోర్ వెల్‌కు విద్యుత్ మోటార్ ఏర్పాటు చేస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ బోర్ వెల్ నిర్మాణ కార్యక్రమంలో గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎంపీడీఓ సిబ్బంది బాకూరు రామ రాజు, గ్రామ పెద్దలు కొండ తాబేలి ఆనంద్ రాయుడు, వంతాల రంగారావు, వార్డు మెంబర్‌లు నాగేశ్వర్ రావు, సురేష్, గ్రామస్తులు చిట్టిబాబు, భీమన్న, రవిబాబు, మహిళలు వంతాల కాంతామ్మ, చిలకమ్మ, రోజా, జ్యోతి సహా పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముసిరిపాడులో బోర్ వెల్ నిర్మాణం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • శుక్రవారం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్, పట్టణ మార్కెట్లకు పైనాపిల్ విక్రయాల కోసం బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలకు తరలించేందుకు గిరిజన రైతులు సుమారు 4 వేల పైనాపిల్ పండ్లను అందించారు. ఈ సందర్భంగా పీవో పవార్ స్వప్నిల్ మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పైనాపిల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఐటీడీఏ సీతంపేట లక్ష్యం గిరిజనుల ఆదాయాన్ని పెంచడమేనని వివరించారు.
    1
    శుక్రవారం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పవార్ స్వప్నిల్, పట్టణ మార్కెట్లకు పైనాపిల్ విక్రయాల కోసం బయలుదేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, సీతంపేట ఐటీడీఏ కార్యాలయం వద్ద నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రధాన నగరాలకు తరలించేందుకు గిరిజన రైతులు సుమారు 4 వేల పైనాపిల్ పండ్లను అందించారు.

ఈ సందర్భంగా పీవో పవార్ స్వప్నిల్ మాట్లాడుతూ, ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు సహజ పద్ధతుల్లో అధిక నాణ్యత కలిగిన పైనాపిల్ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు పండిస్తున్న వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పైనాపిల్‌కు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, ఐటీడీఏ సీతంపేట లక్ష్యం గిరిజనుల ఆదాయాన్ని పెంచడమేనని వివరించారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్సీపి ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. 'చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు' అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్న వైయస్సార్సీపి శ్రేణులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి ఇంచార్జ్ ముద్రగడ గిరి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
    3
    కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైయస్సార్సీపి ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. 'చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు' అనే నినాదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకున్న వైయస్సార్సీపి శ్రేణులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్సీపి ఇంచార్జ్ ముద్రగడ గిరి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపి శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    11 hrs ago
  • స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు ఎం. జబ్బు నాయుడు డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు పలు ఇతర అంశాలపై పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించగా, భారీ సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం. జబ్బు నాయుడు ప్లాంట్‌లోని పరికరాలను మెయింటెనెన్స్ చేయాలని, కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని, మరియు అవసరమైన స్పేర్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
    1
    స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పదివేల కోట్లు విడుదల చేయాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షులు ఎం. జబ్బు నాయుడు డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు పలు ఇతర అంశాలపై పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించగా, భారీ సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం. జబ్బు నాయుడు ప్లాంట్‌లోని పరికరాలను మెయింటెనెన్స్ చేయాలని, కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని, మరియు అవసరమైన స్పేర్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
    user_N.S.R.Guptha
    N.S.R.Guptha
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడే మరో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్లాంట్‌లోని ఆర్గాన్-3 విభాగంలో ఒక లాడిల్ విరిగిపోగా, అందులోని ద్రవపు ఉక్కు నేలపాలు అయింది. అయితే, ఈ సంఘటన జరిగిన స్థలంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఉద్యోగులు, కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.
    1
    స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడే మరో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్లాంట్‌లోని ఆర్గాన్-3 విభాగంలో ఒక లాడిల్ విరిగిపోగా, అందులోని ద్రవపు ఉక్కు నేలపాలు అయింది. అయితే, ఈ సంఘటన జరిగిన స్థలంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఉద్యోగులు, కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.
    user_Nethala Nageswararao
    Nethala Nageswararao
    నర్సీపట్నం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.