SIR తదుపరి ప్రక్రియపై గ్రామసభలో ఏలే మల్లికార్జున్ అవగాహన నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాన్స్ వాడ ఆగస్టు 27, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. SIR (Special Intensive Revision – ప్రత్యేక సమగ్ర సవరణ) తదుపరి ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా చేపడుతున్న SIR ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, పేరు లేకపోయినా లేదా ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నా సంబంధిత BLO, AERO, ERO అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించుకోవాలని సూచించారు. ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు, ఫారం–7 ద్వారా మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్లపై అభ్యంతరాలు, ఫారం–8 ద్వారా మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాల సవరణలు చేసుకునే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు. SIR ప్రక్రియలో భాగంగా 17-08-2026 నుంచి 16-09-2026 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం 19-10-2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే SIR హియరింగ్ సమయంలో BLAలు, Cluster Incharges, గ్రామ సర్పంచ్లు, గ్రామ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత MRO అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, BLOలు, BLAలు, Cluster Incharges, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, IKP VOAs, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి — అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు పరిశీలించుకోవాలి” అని ఏలే మల్లికార్జున్ గారు పిలుపునిచ్చారు.
SIR తదుపరి ప్రక్రియపై గ్రామసభలో ఏలే మల్లికార్జున్ అవగాహన నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాన్స్ వాడ ఆగస్టు 27, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజేపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామసభలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. SIR (Special Intensive Revision – ప్రత్యేక సమగ్ర సవరణ) తదుపరి ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా చేపడుతున్న SIR ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, పేరు లేకపోయినా లేదా ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నా సంబంధిత BLO, AERO, ERO అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించుకోవాలని సూచించారు. ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు, ఫారం–7 ద్వారా మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్లపై అభ్యంతరాలు, ఫారం–8 ద్వారా మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాల సవరణలు చేసుకునే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు. SIR ప్రక్రియలో భాగంగా 17-08-2026 నుంచి 16-09-2026 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం 19-10-2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే SIR హియరింగ్ సమయంలో BLAలు, Cluster Incharges, గ్రామ సర్పంచ్లు, గ్రామ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత MRO అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, BLOలు, BLAలు, Cluster Incharges, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, IKP VOAs, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి — అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు పరిశీలించుకోవాలి” అని ఏలే మల్లికార్జున్ గారు పిలుపునిచ్చారు.
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1