logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని, అలాగే రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి వ్యాపార అవకాశాలను మెరుగుపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

12 hrs ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
12 hrs ago

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని, అలాగే రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి వ్యాపార అవకాశాలను మెరుగుపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    భద్రాద్రి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత బూర్గంపాడు మండలం గొమ్మూరు ర్యాంపు వద్ద గోదావరి నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భద్రాద్రి రాముడే తెలంగాణ దేవుడని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో కల్వకుంట్ల కవిత వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    1
    చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సభలో జర్నలిస్టులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సభలో పలువురు జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని గమనించి వెంటనే ఆ ప్లకార్డులను లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జర్నలిస్టులు గట్టిగా కోరారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    1
    మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు.

గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్‌కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు శనివారం పరామర్శించారు. కల్లూరు పట్టణానికి చెందిన కొంతమంది నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను స్వయంగా ప్రభుత్వ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించిన ఆమె, ప్రమాదంలో గాయపడిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ, సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీరితో పాటు కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రూ అర్జున్ రావు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ మరియు కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    3
    సత్తుపల్లి మున్సిపాలిటీలోని మాధురి ఫంక్షన్ హాల్ లో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం (11-07-26) "ఉపాధ్యాయ సదస్సు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్, RIMSE కరస్పాండెంట్ స్వామి ఆనంద మహారాజ్, రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి సితి కంటానంద మహారాజ్ గారు విశిష్ట అతిథులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి MEO రాజేశ్వరరావు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు, సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, సత్తుపల్లి ప్రముఖులు మరియు మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    2
    తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు.

ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Yakaiah-Pushpa
    Yakaiah-Pushpa
    కొమ్మన పో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ మోహన్ రావు (గాంధి) వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జగన్ మోహన్ రెడ్డి కుట్రలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఒక మంచి ఆలోచనతో దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఆ అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామ మోహన్ రావు పేర్కొన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలను ప్రేరేపించి, గ్రామ స్థాయి వరకు అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆయన విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని, హద్దులు దాటి పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తులను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న కుల, మత రాజకీయాలను ఎండగట్టాలని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    45 min ago
  • ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని, అలాగే రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి వ్యాపార అవకాశాలను మెరుగుపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
    1
    ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మహిళా సంఘాల కోసం చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ. 67 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని, అలాగే రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు, వారికి వ్యాపార అవకాశాలను మెరుగుపరిచి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.