ఏసీబీకి చిక్కిన తహసీల్దార్.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. దిశ, గజ్వేల్ రూరల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. విధుల్లో ఉన్న సమయంలో అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల విషయంలో నమోదైన కేసులో భాగంగా శనివారం కరీంనగర్లోని ఆయన నివాసంతో పాటు తన సోదరి ఇంటిలో ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా వారి ఆస్తులు మార్కెట్ విలువ కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సోదాల్లో రూ.11.90 లక్షల నగదు, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 30 లక్షలు విలువ చేసే లగ్జరీ వాహనాలు, రెండు రూ.1.6 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, కరీంనగర్ లో 2 ఇళ్ళు, ఒక అపార్ట్మెంట్ లో 6 ప్లాట్లు, 4 ఖాళీ ప్లాట్లు పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ రూ. 2.47 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తహసీల్దార్ ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. తహసీల్దార్ తన అధికారిక హోదా దుర్వినియోగం చేసి ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. దిశ, గజ్వేల్ రూరల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. విధుల్లో ఉన్న సమయంలో అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల విషయంలో నమోదైన కేసులో భాగంగా శనివారం కరీంనగర్లోని ఆయన నివాసంతో పాటు తన సోదరి ఇంటిలో ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా వారి ఆస్తులు మార్కెట్ విలువ కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సోదాల్లో రూ.11.90 లక్షల నగదు, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 30 లక్షలు విలువ చేసే లగ్జరీ వాహనాలు, రెండు రూ.1.6 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, కరీంనగర్ లో 2 ఇళ్ళు, ఒక అపార్ట్మెంట్ లో 6 ప్లాట్లు, 4 ఖాళీ ప్లాట్లు పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ రూ. 2.47 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తహసీల్దార్ ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. తహసీల్దార్ తన అధికారిక హోదా దుర్వినియోగం చేసి ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- Post by Tagore3
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- Post by Tagore1