బసివి రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుపై కుట్రలు తగవు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన ప్రముఖ దాత బసివి రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉదంతంపై స్పందించారు. వేలాది మంది పేదలకు నివాస స్థలాలు ఇప్పించి, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకరించిన అపర దానకర్ణుడు బసివి రెడ్డి గారి విగ్రహాన్ని చింత దొరబాబు మరియు వారి మిత్రబృందం కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో అధికార పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒక ప్రైవేట్ స్థలంలో, యజమాని అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో పంచాయతీ కార్యదర్శిని పంపి అభ్యంతరాలు వ్యక్తం చేయించడం, విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం వెనుక నియోజకవర్గ ముఖ్య నేత ప్రోత్సాహం ఉందనేది స్పష్టమవుతోందని", ఇలాంటి కుట్రలు చేసే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బసివి రెడ్డి గారికి అనపర్తి గ్రామానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అనపర్తిలోని రెడ్డి సంఘం నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయిస్తే, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా మూర్తుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం మరియు సేవా తత్పరత తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయుడైన బసివి రెడ్డి గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ, ఈ అడ్డంకులను అధిగమించి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తాను కూడా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.
బసివి రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుపై కుట్రలు తగవు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన ప్రముఖ దాత బసివి రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉదంతంపై స్పందించారు. వేలాది మంది పేదలకు నివాస స్థలాలు ఇప్పించి, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకరించిన అపర దానకర్ణుడు బసివి రెడ్డి గారి విగ్రహాన్ని చింత దొరబాబు మరియు వారి మిత్రబృందం కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో అధికార పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒక ప్రైవేట్ స్థలంలో, యజమాని అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో పంచాయతీ కార్యదర్శిని పంపి అభ్యంతరాలు వ్యక్తం చేయించడం, విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం వెనుక నియోజకవర్గ ముఖ్య నేత ప్రోత్సాహం ఉందనేది స్పష్టమవుతోందని", ఇలాంటి కుట్రలు చేసే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బసివి రెడ్డి గారికి అనపర్తి గ్రామానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అనపర్తిలోని రెడ్డి సంఘం నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయిస్తే, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా మూర్తుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం మరియు సేవా తత్పరత తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయుడైన బసివి రెడ్డి గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ, ఈ అడ్డంకులను అధిగమించి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తాను కూడా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.
- జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ కలెక్టరేట్ ధర్నా జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, వాటిలో ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్న ను త్వరగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట రైతుల ధర్నా లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అరకొర సౌకర్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని, వెంటనే ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలలో దళారుల దందాను అరికట్టి మొక్కజొన్నకు 2400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- పల్నాడు జిల్లా :- నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల సుజాత అనే మహిళ... నరసరావుపేట. సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద నాలుగు దొంగ డ్వాక్రా గ్రూపులు చేసి 10లక్షలు నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ... బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వగా నాకు నా పేరు మీద లోను ఉందని నాకు విషయం తెలిసింది... సమైక్య లీడర్ అనిల అని నేను తీసుకున్న లోను నేను క్లియర్ చేస్తాను అంటూ రెండు సంవత్సరాలు నుంచి కాలం గడుపుకుంటూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన... ఇప్పుడు లీడర్ అనిల ని లోను కట్టమని అడిగితే నన్ను ఎలా పడితే అలా అసభ్య పదజాలతో మాట్లాడుతుందని సుజాత ఆరోపణ... సమైక్య లీడర్ అనిల మీద తగు చర్యలు తీసుకొని,నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావుని వేడుకున్న బాధితురాలు సుజాత.1
- గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ చేసిన ఈ పనికి ఫిర్యాదుదారులు ఆయనను మెచ్చుకుంటున్నారు.1
- MGM వెస్ట్స్ రోజూ వేసుకునే దుస్తులలో పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా వీటి ప్రీమియం ఫీల్ తో హాయిగా ఉండవచ్చు. మీ రోజువారీ జీవితంలో ఆనందం, విశ్వాసం పెంచుకోవడానికి ఇవి సరైన ఎంపిక.1
- అమరేశ్వరాలయంలో రుద్ర హోమం నిర్వహించిన ఆంజనేయస్వామి భక్తులు పంచారామ క్షేత్రమైన బాల చాముండికా సమేత అమరేశ్వరంలో ఈరోజు ఉదయం అత్యంత ఘనంగా ఆలయ అర్చకులుమహా రుద్ర హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు భక్తి పూజల నిర్వహించారు తదనంతరం ఆలయ సహాయకమిషనర్ కే రేఖ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు తదనంతరం కేంద్ర ప్రసాదాలు పెంచిపెట్టారు1
- విజయనగరం జిల్లా మెరకముడిదాం ఉపాధ్యాయుడు ఎం. సత్యారావు పదో తరగతిలో ప్రతిభ చూపిన ఆరుగురు విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానయానం చేయించారు. చదువులో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రయోగాత్మకంగా చూపిన ఆయనను అధికారులు, స్థానికులు ప్రశంసించారు. ఇది విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు గొప్ప పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్కు చెందిన కుందన్ సింగ్ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1
- Palnadu జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేసి, రూ.1.33 లక్షల విలువైన బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ నేరస్థులను పట్టుకున్నారు.1