ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, ఎమ్మెల్యే తాతయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేసి, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిత్యావసర సరుకులతో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాతయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అమలు జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తూనే, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తాతయ్య గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ & పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్యక్రమాలలో
చురుకుగా పాల్గొన్నారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, ఎమ్మెల్యే తాతయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేసి, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిత్యావసర సరుకులతో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాతయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అమలు జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తూనే, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు
ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తాతయ్య గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ & పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
- ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం, ధర్మవరప్పాడు తండా గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత కార్యక్రమాలను వారు స్వయంగా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామ పారిశుద్ధ్యాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, ఎమ్మెల్యే తాతయ్య గారు ప్రత్యేకంగా సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేసి, ఆర్థిక ప్రోత్సాహకాలు, నిత్యావసర సరుకులతో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తాతయ్య గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు అమలు జరుగుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తూనే, ప్రజలలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తాతయ్య గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ & పోచంపల్లి సొసైటీ చైర్మన్ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామస్తులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.4
- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల అటవీ పార్కులో ముందస్తుగా ఒక యోగా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్. బాలరాజు మరియు డాక్టర్ జి సునీల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యోగాను తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు, తెల్లబియ్యం, నూనె, ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని వారు సూచించారు. అటవీశాఖ రేంజ్ అధికారి బాలరాజు ప్రత్యేకంగా దైనందిన జీవితంలో యోగా సాధన ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.1
- బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో జూన్ 20, శనివారం బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు రూ.50 వేల విలువైన టీషర్టులు, డ్రెస్ కోడ్ సామగ్రిని పంపిణీ చేశారు. అమరజీవి తూము ప్రకాశరావు స్మారక స్థూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు బత్తినేని నీరజ కళాకారులకు సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమానికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. కాగా, ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.1
- ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా అధ్యక్షుడు తాతా మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 30 నెలల కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని 2013కి ముందున్న పరిస్థితులకు, అంటే తెలంగాణకు ముందు రైతులు అనుభవించిన కష్టాల స్థితికి తిరిగి తీసుకువచ్చిందని తీవ్రంగా ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే అనేక సంస్కరణలు తెచ్చి, 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే నినాదంతో రైతుల బాధలను తొలగించారని వారు గుర్తు చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారని, పూడికలతో నిండిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించి అభివృద్ధి చేశారని నేతలు తెలిపారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేస్తూ ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీయేనని, ఆ పాలనలో తెలంగాణ జలకళను సంతరించుకుందని వారు వివరించారు. ప్రస్తుత 'ఇందిరమ్మ రాజ్యంలో' తెలంగాణ ద్రోహి మళ్లీ సమైక్య పాలనకు తెరలేపాడని విమర్శించారు. కేసీఆర్ ముందుచూపుతో కేవలం ఆరు నెలల్లో భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తెచ్చిన ఘనుడని ప్రశంసించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు 30 నెలల్లో కనీసం ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదని, రైతులపై ప్రేమ లేకుండా తమ జేబులు నింపుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్పై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 24న ఎస్ఐఆర్ (SIR) పై అవగాహన సదస్సు కోసం కేటీఆర్ సత్తుపల్లికి వస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు గారి విజన్కు అనుగుణంగా రాజధాని నగరం ప్రపంచం మెచ్చే విధంగా రూపుదిద్దుకుంటోందని, ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.1
- ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20-06-2026 శనివారం నాడు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూవివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే రాగమయి గారు మాట్లాడుతూ, బుగ్గపాడు ఫుడ్ పార్క్ విషయంలో కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, గ్రామస్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే దీనిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఒకప్పుడు మూతపడిపోయిన ఈ ప్రతిష్టాత్మక ఫుడ్ పార్కును తమ ప్రభుత్వ హయాంలో మళ్ళీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బుగ్గపాడులో రూ. 660 కోట్ల ప్రాజెక్టుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకొచ్చిందని, పది సంవత్సరాల నుండి పాడుబడి ఉన్న ఈ ఫుడ్ పార్కును అభివృద్ధి పథంలో నడుపుతున్నామని వివరించారు. 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 61.13 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ జరిగిందని, రూ. 109 కోట్లతో ఇప్పటివరకు ఫుడ్ పార్కును అభివృద్ధి చేశామని వెల్లడించారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసి అక్కడివారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక దృష్టి సారించి ఫుడ్ పార్కును పునఃప్రారంభించాలని కోరామని, గిరిజన ప్రాంతాల్లో భూధర ఎక్కువగా ఉంటే కంపెనీలు రావని పెద్దలను కోరినట్లు తెలిపారు. దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ రూ. 650 కోట్ల ప్రాజెక్టుతో 3000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వచ్చిందని, ఇతర ప్రాంతాల్లో భూములు చూసినప్పటికీ, బుగ్గపాడులోనే బాగుంటుందని నిర్ణయించి, అందరి ఆమోదంతో భూములు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి చెడు కోణం లేదని, ప్రాంత ప్రజలకు మంచి జరుగుతోందన్నదే తమ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే రాగమయి గారు నొక్కి చెప్పారు. గత కొద్ది రోజులుగా రకరకాల పార్టీల వారు వచ్చి ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తే చూసి ఊర్వలేరా అని ప్రశ్నిస్తూ, ప్రతిపక్ష పార్టీలు రంధ్రాన్వేషణ చేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని హితవు పలికారు.3
- ఈరోజు మంథనిలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, 64 CMRF మరియు 45 కల్యాణలక్ష్మి చెక్కులను మంజూరు చేశారు. ఈ చెక్కుల మొత్తం విలువ 66 లక్షల 46 వేల 320 రూపాయలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్ని చిల్లర ఆరోపణలు చేసినా పట్టించుకోబోమని, అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సింగరేణిని కాపాడింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. అల్లిబిల్లి మాటలతో అధికారంలో ఉన్న ఒక పార్టీ తర్వాత మరో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కుటుంబంతో విభేదాల కారణంగా బయటకు వచ్చి తమపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, అయితే ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు ఎవరూ తమను ఏమీ చేయలేరని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని పట్టణంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, మంథని నియోజకవర్గానికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలో అందిస్తామని, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరైనా చిల్లర ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోమని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడడమే తమ ధ్యేయమని శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.1
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా, జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహం పరిసరాలు, బుద్ధ పార్క్, మరియు వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కలుపు మొక్కలను పీకేయడం, పొదలను కత్తిరించడం, వాకింగ్ ట్రాక్ను శుభ్రపరచడం, డ్రైనేజీలలోని వ్యర్థాలను తొలగించడం, పార్కులోని మొక్కల సంరక్షణ వంటి పనులు చేపట్టారు. ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఈ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పట్టణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు మాట్లాడుతూ, పట్టణంలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 10 ఈ-ఆటోలు, 20 పుష్ కార్టులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు ప్రతి వార్డులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి. ప్రసాద్ రావు గారు, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, గొట్టే నాగరాజు, దువ్వల రామకృష్ణ, నూకల బాలకృష్ణ, కోటగిరి సుధాకర్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, MEPMA స్వయం సహాయక సంఘాల మహిళలు, MEPMA సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు ప్రజలందరూ పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుని జగ్గయ్యపేటను రాష్ట్రంలోనే ఆదర్శ పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.4