డోర్నకల్ నియోజకవర్గానికి ఎన్నికల కోఆర్డినేటర్ గా ఎండి. అవేజ్ నియామకం మెట్ పల్లి, ఏప్రిల్ 19 :- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల కోఆర్డినేటర్గా ఎండి. అవేజ్ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.ఈ నియామకం ద్వారా మండల, గ్రామ, పట్టణ, వార్డ్, బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు బూత్ లెవల్ ఏజెంట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా ఎండి. అవేజ్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమన్వయం సాధించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ప్రతి కార్యకర్తను చైతన్యపరచి పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తానని అవేజ్ స్పష్టం చేశారు.
డోర్నకల్ నియోజకవర్గానికి ఎన్నికల కోఆర్డినేటర్ గా ఎండి. అవేజ్ నియామకం మెట్ పల్లి, ఏప్రిల్ 19 :- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల కోఆర్డినేటర్గా ఎండి. అవేజ్ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
(పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.ఈ నియామకం ద్వారా మండల, గ్రామ, పట్టణ, వార్డ్, బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు బూత్ లెవల్ ఏజెంట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా ఎండి. అవేజ్ మాట్లాడుతూ, పార్టీ
తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమన్వయం సాధించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ప్రతి కార్యకర్తను చైతన్యపరచి పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తానని అవేజ్ స్పష్టం చేశారు.
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.1