Shuru
Apke Nagar Ki App…
28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.
SRIHARI POONDLA
28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.
More news from Spsr Nellore and nearby areas
- మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ. 5 కోట్లతో మోడల్ స్కూల్గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్ విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్ రీ-మోడలింగ్ పనులు లోకేష్ విజన్.. నారాయణ యాక్షన్. నెల్లూరు విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం నెల్లూరు రూరల్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మంత్రి నారాయణ ద్రుష్టి పెట్టారు . సిటీ తరహాలోనే రూరల్ విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం సృష్టించబోతున్నారు.యువనేత లోకేష్ విజన్ కి అనుగుణంగా ముందుకు దూసుకు పోతున్నారు . మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ను క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పరిశీలించారు .విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు .రూ. 5 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువనేత లోకేష్ విజన్కు అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లను మూడేళ్లలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మారుస్తామన్నారు .ఏప్రిల్ 15 నుంచే ఈ ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ మహత్కార్యానికి CSR నిధులతో సహకరిస్తున్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యాన్ని అభినందించారు.త్వరలోనే పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నారాయణ విద్యాసంస్థల తరపున సైకిళ్ల పంపిణీ చేపడతామని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసి పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నా, తన నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి నారాయణ సార్ పరుగులు పెట్టిస్తున్నారు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన మాటప్రకారం రూరల్ లోని స్కూళ్ల అభివృద్ధిపై ద్రుష్టి పెట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు .1
- అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకండి- టిడిపి నాయకులు కోవూరు పివిఆర్ కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై మీడియా సమావేశంలో విమర్శలు చేసిన విషయంపై కోవూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని అక్రమ కట్టడాలను తొలగించడం పై మాట్లాడుతూ ఆ కట్టడాలలో ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ప్రజా సంక్షేమం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వైసిపి నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఎమ్మెల్యే పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రజల కోసమే చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ని కోవూరులోని వైసిపి నాయకులు ఎన్ని ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు మాకు తెలుసని ప్రజలను మోసం చేసి ఈరోజు నలుగురు వ్యక్తులను వెంట వేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ గోపిరెడ్డి , జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.3
- బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.1
- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2
- 27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.1
- కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం పరిధిలోని పెద్దపల్లి లో ఏర్పాటు చేసిన అయోధ్య మినీ మందిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని బీజేపీ నాయకులు కొనియాడారు. రాముని మీద ఉన్న భక్తి భావముతో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముస్లిం సోదరుడు ముక్తియార్ భాషను బీజేపీ నాయకులు అభినందించారు. మినీ అయోధ్య రామాలయాన్ని తొమ్మిది రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు.1