నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు ధర్నా నోటీసు ఇచ్చిన జె.ఏ.సి.ఉద్యోగులు ఈనెల 27న నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న మహా ధర్నాకు సంబం ధించిన నోటీసును మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా జాక్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యంగా పీఆర్సీ, పాత పెన్షన్ పునరుద్దరణ, పెండింగ్లో ఉన్న 6 డీఏల మంజూరు, హెల్త్ స్కీమ్ అమలు, పెండింగ్ బిల్లుల మంజూరు, తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజవయంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు షర్ఫోద్దీన్, సత్యనారాయణ రెడ్డి, కృష్ణ, వెంకటప్ప, సురేషు, నజీర్, కళ్యాణ్ కృష్ణారావు, బాలరాజ్, మహేష్, రాజు గౌడ్, మహిళా నాయకులు శివ రత్న ,అరుణ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కు ధర్నా నోటీసు ఇచ్చిన జె.ఏ.సి.ఉద్యోగులు ఈనెల 27న నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న మహా ధర్నాకు సంబం ధించిన నోటీసును మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా జాక్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యంగా పీఆర్సీ, పాత పెన్షన్ పునరుద్దరణ, పెండింగ్లో ఉన్న 6 డీఏల మంజూరు,
హెల్త్ స్కీమ్ అమలు, పెండింగ్ బిల్లుల మంజూరు, తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో ఈ మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజవయంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు షర్ఫోద్దీన్, సత్యనారాయణ రెడ్డి, కృష్ణ, వెంకటప్ప, సురేషు, నజీర్, కళ్యాణ్ కృష్ణారావు, బాలరాజ్, మహేష్, రాజు గౌడ్, మహిళా నాయకులు శివ రత్న ,అరుణ తదితరులు పాల్గొన్నారు.
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- నెట్టెంపాడు కాలువల కింది రైతుల భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన 99, 100, 106 ప్యాకేజీల కాలువ పనులు దశాబ్దాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. నెట్టంపాడు ప్రాజెక్టు ద్వారా ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, రాజోళి తదితర మండలాల జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అసంపూర్తిగా ఉన్న 99, 100, 106 ప్యాకేజీల పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి త్వరగా కాలువల నిర్మాణం పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు మీరు అందించి రైతుల కళ్ళలో ఆనందాలు నింపాలని రైతులు వేడుకుంటున్నారు.2
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- మంగనూర్ లో బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ గారి 108వ జయంతి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామం లోని బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల నూతన విగ్రహాల దిమ్మె దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి.పి. మండల్ ) గారి 108వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో మంగనూర్ గ్రామం సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బోట్క చంద్రశేఖర్, వార్డు మెంబర్ కత్తి పరశురాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, తోట జయరాములు, నక్కల సాయులు, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, అప్పల మల్లేష్, ఇండ్ల మల్లిఖార్జున్, కుమ్మరి సాంబశివ, వంక ఎల్లయ్య, దాసరి అంజి, వడ్ల నరేష్, పిట్టల నిరంజన్, అప్పల శ్రీను, సల్ల భీమయ్య, కొంగిరి లక్ష్మయ్య, నరసగల్ల కురుమూర్తి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1