*AICC పిలుపు మేరకు SIR Phase-2 BLAల ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహణ..* *ప్రతి బూత్లో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలి - సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారు..* *గజ్వేల్, (AICC) పిలుపు మేరకు చేపట్టిన SIR Phase-2 కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), BLA సూపర్వైజర్లు, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకుల ముఖ్య సమావేశం గజ్వేల్ పట్టణం లోని టి. వై. ఆర్ గార్డెన్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.* *ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా BLAలు అత్యంత బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. బూత్ వారీగా ఓటరు జాబితాలను ఇంటింటికీ వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, తప్పుగా తొలగించబడిన పేర్ల పునరుద్ధరణ, చిరునామా మార్పులు, ఇతర సవరణలను గుర్తించి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.* *SIR Phase-2 కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనదని, ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి BLAలే వెన్నెముకగా నిలవాలని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి గ్రామం, ప్రతి బూత్పై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలని, పార్టీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాలని కోరారు.* *సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా SIR ఇంచార్జ్, గుమ్మడి వెన్నెల గారు మాట్లాడుతూ, AICC ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా SIR Phase-2 కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి BLA ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి అసాధారణ నమోదు, డూప్లికేట్ పేర్లు, తొలగింపులు, కొత్త ఓటర్ల వివరాలను గుర్తించి నిర్ణీత నమూనాలో నివేదికలు సమర్పించాలని సూచించారు.*
*AICC పిలుపు మేరకు SIR Phase-2 BLAల ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహణ..* *ప్రతి బూత్లో ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలి - సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారు..* *గజ్వేల్, (AICC) పిలుపు మేరకు చేపట్టిన SIR Phase-2 కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), BLA సూపర్వైజర్లు, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకుల ముఖ్య సమావేశం గజ్వేల్ పట్టణం లోని టి. వై. ఆర్ గార్డెన్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.* *ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా BLAలు అత్యంత బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. బూత్ వారీగా ఓటరు జాబితాలను ఇంటింటికీ వెళ్లి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు, తప్పుగా తొలగించబడిన పేర్ల పునరుద్ధరణ, చిరునామా మార్పులు, ఇతర సవరణలను గుర్తించి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.* *SIR Phase-2 కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైనదని, ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి BLAలే వెన్నెముకగా నిలవాలని ఎమ్మెల్యే అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి గ్రామం, ప్రతి బూత్పై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయాలని, పార్టీ ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాలని కోరారు.* *సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా SIR ఇంచార్జ్, గుమ్మడి వెన్నెల గారు మాట్లాడుతూ, AICC ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా SIR Phase-2 కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి BLA ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి అసాధారణ నమోదు, డూప్లికేట్ పేర్లు, తొలగింపులు, కొత్త ఓటర్ల వివరాలను గుర్తించి నిర్ణీత నమూనాలో నివేదికలు సమర్పించాలని సూచించారు.*
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి మంగళవారం రూ.18,92,299 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,70,860, కార్ పార్కింగ్తో రూ.3 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,87,200, బ్రేక్ దర్శనాలతో రూ.1,08,300, ప్రధాన బుకింగ్ తో రూ.1,49,854, వ్రతాలతో రూ.1,10,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు.1
- అయితే ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లతో సమావేశం నిర్వహించ1
- మేడ్చల్లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1