Shuru
Apke Nagar Ki App…
ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళిక లో భాగంగా ఐటీడీఏ కార్యాలయంలోని ఫైళ్లను శుభ్రం చేసిన అధికారులు ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఆదేశాల మేరకు ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో ఉన్న ఫైళ్లను సిబ్బంది ఆధ్వర్యంలో శుభ్రం చేయడం జరిగినదని ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు అన్నారు. సోమవారం నాడు ప్రగతి పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐటిడిఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమక్షంలో రికార్డు గదులను శుభ్రపరిచి ఫైళ్లను సరైన విధంగా క్రమబద్ధంగా అమరిక చేయడం జరిగిందని, పనికిరాని ఫైళ్లను తీసివేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు, మేనేజర్ ఆదినారాయణ, శ్రీనివాస్ సిబ్బంది సాయిచంద్, సూపల్, లక్ష్మయ్య, అనిత, సుజాత,తదితరులు పాల్గొన్నారు.
VANAMA SRINIVAS RAO
ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళిక లో భాగంగా ఐటీడీఏ కార్యాలయంలోని ఫైళ్లను శుభ్రం చేసిన అధికారులు ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఆదేశాల మేరకు ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో ఉన్న ఫైళ్లను సిబ్బంది ఆధ్వర్యంలో శుభ్రం చేయడం జరిగినదని ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు అన్నారు. సోమవారం నాడు ప్రగతి పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐటిడిఏ కార్యాలయంలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమక్షంలో రికార్డు గదులను శుభ్రపరిచి ఫైళ్లను సరైన విధంగా క్రమబద్ధంగా అమరిక చేయడం జరిగిందని, పనికిరాని ఫైళ్లను తీసివేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పవర్ వేణు, మేనేజర్ ఆదినారాయణ, శ్రీనివాస్ సిబ్బంది సాయిచంద్, సూపల్, లక్ష్మయ్య, అనిత, సుజాత,తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- Shabbir Arts 81216816861
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.2
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. వాయిస్ ఓవర్: ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇంకా ఎలాంటి సదుపాయాలు అవసరమో అడిగి తెలుసుకుని, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంచి విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో భోజన వసతి, హాస్టల్ సదుపాయాలు, తరగతి గదులు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నాగరాజు ఆదేశించారు.3
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం.శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం Rs.1కోటి ,05లక్షల ,94వేల ,090 రూపాయలు, బంగారం-80 గ్రాములు, వెండి-650 గ్రాములు, 40 రోజుల హుండీ ఆదాయం2