*ముదిగుబ్బలో ఉద్రిక్తత* సీఐ శివరాముడిపై టిడిపి నేతల ఆగ్రహం – పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ముదిగుబ్బ, ఫిబ్రవరి 19: ముదిగుబ్బ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణ సీఐ శివరాముడు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మండలంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు విమర్శించారు. *🔹 టిడిపి ఆరోపణలు ఇవీ…* ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. బైండోవర్ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, కౌన్సిలింగ్ పేరుతో మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. పట్టా భూమి వివాదం వేడెక్కింది,తాజాగా తమ పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టిన సుధాకర్, విశ్వనాథ్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి, వారిని నేరస్తుల్లా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అవమానించారని టిడిపి నేతలు తెలిపారు. ఈ విషయంపై ఆగ్రహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్పీ జోక్యం – శాంతించిన నిరసన సమాచారం అందుకున్న డీఎస్పీ ఫోన్ ద్వారా టిడిపి నాయకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.గత సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి పరసలో జరిగిన ఘటనలో ఎలాంటి నేర చరిత్ర లేని టిడిపి నాయకులపై కేసులు నమోదు చేసి ఇప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద ఎలాంటి సంఘటన జరగకపోయినా వైసిపి ఫిర్యాదు మేరకు టిడిపి కార్యకర్తలను పిలిపించి దాడి చేశారని పేర్కొన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదం-దొరిగిల్లు గ్రామంలో జగన్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి రక్తాభిషేకం చేసిన ఘటనలో పోలీసులు మొదట స్పందించలేదని టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రక్తంతో ఉన్న ఫ్లెక్సీ నెల రోజులపాటు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి వీరనారాయణ స్వామి పరసలో రాజకీయ ఫ్లెక్సీలు, డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టకూడదని కమిటీ సభ్యులు, పోలీసులు ముందుగా నిర్ణయించినప్పటికీ, వైసిపి కార్యకర్తలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. *🔹 లాఠీచార్జ్ ఆరోపణ* అలాగే వైసిపి మాజీ ఎంపీ Gorantla Madhav వాహనం రాక సందర్భంగా అడ్డుగా ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలైన సూర్యనారాయణ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీకి విజ్ఞప్తి ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించి సీఐ శివరాముడిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.
*ముదిగుబ్బలో ఉద్రిక్తత* సీఐ శివరాముడిపై టిడిపి నేతల ఆగ్రహం – పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ముదిగుబ్బ, ఫిబ్రవరి 19: ముదిగుబ్బ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణ సీఐ శివరాముడు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మండలంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు విమర్శించారు. *🔹 టిడిపి ఆరోపణలు ఇవీ…* ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. బైండోవర్ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, కౌన్సిలింగ్ పేరుతో మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. పట్టా భూమి వివాదం వేడెక్కింది,తాజాగా తమ పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టిన సుధాకర్, విశ్వనాథ్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి, వారిని నేరస్తుల్లా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అవమానించారని టిడిపి నేతలు తెలిపారు. ఈ విషయంపై ఆగ్రహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్పీ జోక్యం – శాంతించిన నిరసన సమాచారం అందుకున్న డీఎస్పీ ఫోన్ ద్వారా టిడిపి నాయకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.గత సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి పరసలో జరిగిన ఘటనలో ఎలాంటి నేర చరిత్ర లేని టిడిపి నాయకులపై కేసులు నమోదు చేసి ఇప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద ఎలాంటి సంఘటన జరగకపోయినా వైసిపి ఫిర్యాదు మేరకు టిడిపి కార్యకర్తలను పిలిపించి దాడి చేశారని పేర్కొన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదం-దొరిగిల్లు గ్రామంలో జగన్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి రక్తాభిషేకం చేసిన ఘటనలో పోలీసులు మొదట స్పందించలేదని టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రక్తంతో ఉన్న ఫ్లెక్సీ నెల రోజులపాటు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి వీరనారాయణ స్వామి పరసలో రాజకీయ ఫ్లెక్సీలు, డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టకూడదని కమిటీ సభ్యులు, పోలీసులు ముందుగా నిర్ణయించినప్పటికీ, వైసిపి కార్యకర్తలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. *🔹 లాఠీచార్జ్ ఆరోపణ* అలాగే వైసిపి మాజీ ఎంపీ Gorantla Madhav వాహనం రాక సందర్భంగా అడ్డుగా ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలైన సూర్యనారాయణ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీకి విజ్ఞప్తి ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించి సీఐ శివరాముడిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.
- శ్రీ సత్యసాయి జిల్లా,ముదిగుబ్బ, ఫిబ్రవరి 19: ముదిగుబ్బ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణ సీఐ శివరాముడు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మండలంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు విమర్శించారు. *🔹 టిడిపి ఆరోపణలు ఇవీ…* ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను తరచూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. బైండోవర్ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, కౌన్సిలింగ్ పేరుతో మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. పట్టా భూమి వివాదం వేడెక్కింది,తాజాగా తమ పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టిన సుధాకర్, విశ్వనాథ్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి, వారిని నేరస్తుల్లా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అవమానించారని టిడిపి నేతలు తెలిపారు. ఈ విషయంపై ఆగ్రహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్పీ జోక్యం – శాంతించిన నిరసన సమాచారం అందుకున్న డీఎస్పీ ఫోన్ ద్వారా టిడిపి నాయకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.గత సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి పరసలో జరిగిన ఘటనలో ఎలాంటి నేర చరిత్ర లేని టిడిపి నాయకులపై కేసులు నమోదు చేసి ఇప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద ఎలాంటి సంఘటన జరగకపోయినా వైసిపి ఫిర్యాదు మేరకు టిడిపి కార్యకర్తలను పిలిపించి దాడి చేశారని పేర్కొన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదం-దొరిగిల్లు గ్రామంలో జగన్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి రక్తాభిషేకం చేసిన ఘటనలో పోలీసులు మొదట స్పందించలేదని టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రక్తంతో ఉన్న ఫ్లెక్సీ నెల రోజులపాటు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి వీరనారాయణ స్వామి పరసలో రాజకీయ ఫ్లెక్సీలు, డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టకూడదని కమిటీ సభ్యులు, పోలీసులు ముందుగా నిర్ణయించినప్పటికీ, వైసిపి కార్యకర్తలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. *🔹 లాఠీచార్జ్ ఆరోపణ* అలాగే వైసిపి మాజీ ఎంపీ Gorantla Madhav వాహనం రాక సందర్భంగా అడ్డుగా ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలైన సూర్యనారాయణ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీకి విజ్ఞప్తి ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించి సీఐ శివరాముడిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.1
- రాయచోటి మదనపల్లె రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మా బిడ్డ మృతి విషాదంలో మాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు” అని వ్యాఖ్యానించారు.1
- బద్వేలు, ఫిబ్రవరి 19: ధైర్యం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో శిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు చత్రపతి శివాజీ చత్రపతి శివాజీ మహారాజ్ అని, బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు, గురువారం నాడు కార్యాలయంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులలో ఛత్రపతి శివాజీ ఒకరని, ఆయన మరాఠీ యోధుడిని, ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని అన్నారు, స్వరాజ్య సిద్ధాంతాలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా యోధుడు అని అన్నారు, వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు పుల్లం రాజు, కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, సి వి ప్రసాద్ చిన్న రాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్, జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,1
- రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన రాజంపేట పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న జోన్ ఫోర్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) గారు,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు, షాప్ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ జగన్మోహన్ రాజుగారు మొదలగును వారు పాల్గొన్నారు.1
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- కోసిగి మండలం మంత్రాలయం తాలూకా కర్నూలు జిల్లా.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బుధవారం నుంచి బోర్వెల్ రిగ్ యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బోర్వెల్ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంపై రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు ఉద్య మిస్తామని, మొదటి విడతగా ఐదు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.1