Shuru
Apke Nagar Ki App…
*గుడ్ న్యూస్.. ఆ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు* AP: న్యూ ఇయర్ వేళ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 రకాల భూములను 22-A (నిషేధిత) భూముల జాబితా నుంచి తొలగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. స్వాత్రంత్య్ర సమరయోధులు, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులకు సరైన భూమి పత్రాలుంటే లిస్ట్ నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Saddala Adi Narayana Reporter
*గుడ్ న్యూస్.. ఆ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు* AP: న్యూ ఇయర్ వేళ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 రకాల భూములను 22-A (నిషేధిత) భూముల జాబితా నుంచి తొలగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. స్వాత్రంత్య్ర సమరయోధులు, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులకు సరైన భూమి పత్రాలుంటే లిస్ట్ నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబు గుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కుళాయిల వద్ద బిందెలను క్యూ లైన్లో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్యను గ్రామస్థులు తెలియజేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- చేనేత కార్మికులకు నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డులో మగ్గం చేనేత కార్మికులతో ముచ్చటించారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఆది నుండి తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గం వారు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.1
- *🔰ఏపీలో నేటితో ముగియనున్న సర్పంచుల పదవీ కాలం* రేపటి నుంచి ప్రత్యేక అధికారుల నియామకానికి ఉత్తర్వులు తహశీల్దార్, MPDO స్థాయి అధికారులు, కొత్త పాలకమండలి వచ్చే వరకు బాధ్యతలు జీవో జారీ చేసిన ప్రభుత్వం1
- బద్వేలు, ఏప్రిల్ 0 2: ఫిబ్రవరి మాసంలో వృద్ధాప్యంలో కూడా వీడని అన్న చెల్లెల అనుబంధం. అనేటువంటి కథనం సోషల్ మీడియా ద్వారా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో వారు చేసినటువంటి ట్వీట్ట్ ద్వారా కలెక్టర్ జిల్లా యంత్రాంగం స్పందించి గోపవరం మండలం పిపి కుంట గ్రామంలోని ఇద్దరు నిరాశ్రయులను ఆర్డిఓ చంద్రమోహన్ మరియు డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో లక్కీ కొండయ్య మరియు ఆయన సోదరి పొంత గిరిలక్ష్మీనారాయణమ్మ గా గుర్తించారు. బద్వేలు పట్టణంలోని మెప్మా మరియు బద్వేలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నైట్ షెల్టర్, ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం. నకు తరలించి, వారికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి, డాక్టర్ల ద్వారా వైద్యం అందించడం జరిగింది. అధికారులు స్వయంగా వారి చేతుల మీదుగా వారికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఆర్డీవో , డిఆర్డిఎ పిడి రాజ్యలక్ష్మి ఆదేశాలతో, వారిని నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించుకొని, వారికి అవసరమైనటువంటి వైద్యము, వసతి, ఆహారాన్ని, ఈ రెండు నెలలపాటు అందించడం జరిగింది. అధికారుల సహకారంతో, వారికి అవసరమైన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మంజూరు చేశారు. నేడు ఏప్రిల్ ఒకటో తారీకు ఉదయం, పెన్షన్ వారికి ఇవ్వడంతో ఆనంద నిలయంలోని వృద్ధులు అందరు కూడా తమ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని, తెలియపరుస్తూ, వచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలతో చిరు సన్మానం చేయడం జరిగింది .ఆనంద నిలయం నిర్వాహకులు పిడతల రవికుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపవరం మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1
- అప్పు అడిగినందుకే చంద్రమను హత్య చేశారు: DSP డేగల ప్రభాకర్ పెద్ద పంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై పలమనేరు డిఎస్పి డేగల ప్రభాకర్, సిఐ పరశురాముడు పలమనేరు పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమ్మను సమీప బంధువైన సుబ్రమణి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారన్నారు. చీటీల డబ్బు మరియు అప్పుగా తీసుకున్న మొత్తం సుమారు రెండు లక్షల నగదును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో ముందుగా పన్నిన పథకం ప్రకారం చంద్రమ్మను బైక్ పై తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ఓ మామిడి తోపులో హత్య చేశారన్నారు. అనంతరం ఓ బొలెరో వాహనాన్ని బాడుగకు తీసుకొని వారే స్వయంగా నడుపుకుంటూ చంద్రమ్మ మృతదేహాన్ని పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో పారవేశారన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో సుబ్రహ్మణ్యం ను విచారించాగా మరో ఇద్దరితో కలిసి హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుబ్రమణి అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ముద్దాయిలైన నూర్ అహ్మద్, దేవి వరప్రసాద్ లను తొందర్లోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్ని సాక్ష్యాదారాలు సేకరించామన్నారు.1
- బద్వేలు :స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లక్ష్యంగా మన బద్వేలు పురపాలక సంఘం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు వార్డు స్థాయిలో జరిగిన చెత్త వర్గీకరణ (Waste Segregation) కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ స్వయంగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు: నేరుగా క్షేత్రస్థాయిలో: కమిషనర్ గారు స్వయంగా తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో (ఆకుపచ్చ, నీలం, ఎరుపు బుట్టల వినియోగం) ప్రజలకు వివరించారు. కార్మికులకు దిశానిర్దేశం: పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి, వ్యర్థాల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షించారు. పౌరుల బాధ్యత: "మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత" అని కమీషనర్ గారు పిలుపునిచ్చారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వేళ, మన వంతుగా చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరిద్దాం. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో మన బద్వేలు ను నంబర్ 1 గా నిలుపుదాం!1
- నందవరం బంగారమ్మ ఆలయంలో భక్తి విరాజిల్లింది… గోపుర కలశ ప్రతిష్టతో మహోత్సవ వైభవం!”1
- ఆంధ్రప్రదేశ్ లో... ఆగని డోలి మోతలు *అల్లూరి జిల్లా. న్యూస్ డోలిలో గర్భిణి… 5 కి.మీ నడక. ▪️అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల కష్టాలు మరోసారి వెలుగులోకి. ▪️డుంబ్రిగూడ మండలం డొక్రిపాడు గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణి మహిళను కుటుంబ సభ్యులు డోలిలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి. ▪️పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను భర్తతో పాటు బంధువులు సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిలో మోసుకుంటూ ఆస్పత్రికి తరలింపు. ▪️రోడ్డు లేకపోవడంతో ప్రతిసారి ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తోందని గిరిజనులు ఆగ్రహం. ▪️వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వినతి.1