మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో దళిత నేత, యువ జననేత..* *కొందుర్గు మండలం పర్వతాపూర్ లో భారీ ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమం..* ఒకవైపు దళితులకు అండగా నిలిచిన జననేత.. మరోవైపు సామాన్యులను కష్టాలలో ఆదుకునే జననేత.. ఒకరు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాగా, మరొకరు కొందుర్గు, చౌదరిగుడా మండలాలలో సేవల ద్వారా తనదైన ముద్ర వేసిన జననేత కేకే కృష్ణ. ఈ ఇద్దరు నేతలు కొందర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హాజరయ్యారు. ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఆదుకునే దిశగా రాజ్యాంగాన్ని రూపొందించి దళితులకు భవిష్యత్తును అందించిన జననేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే, అణగారిన వర్గాలకు అక్షరాలు నేర్పించి వారి భవిష్యత్తుకు ప్రాణం పోసిన ఘననేత జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అలాంటి మహోన్నత నాయకుల విగ్రహావిష్కరణ ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. యువ నాయకుడు కేకే కృష్ణ మాట్లాడుతూ పుట్టుక, మరణం మానవ జీవితంలో సహజమని, కానీ జనం కోసమే పుట్టిన నాయకులు కొందరే ఉంటారని, అలాంటి మహోన్నత వ్యక్తులే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గా, జ్యోతిరావు పూలే గా గుర్తింపు పొందుతారని ప్రశ్నించారు. అలాంటి గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కృష్ణారెడ్డి, మంగులాల్ నాయక్, సయ్యద్ సాదిక్, మల్లేష్ గౌడ్, జాంగారి రవి, గుట్ట రాజు, సాజిద్, సర్పంచులు బోయ అశోక్, తుంపల్లి బోయ రామచంద్రయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటన్నోళ్ల నరసింహ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఏళ్ల రాజు, ప్రధాన కార్యదర్శి అమరేందర్, విగ్రహ దాతలు ప్రభావతి, భీమయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో దళిత నేత, యువ జననేత..* *కొందుర్గు మండలం పర్వతాపూర్ లో భారీ ఎత్తున విగ్రహావిష్కరణ కార్యక్రమం..* ఒకవైపు దళితులకు అండగా నిలిచిన జననేత.. మరోవైపు సామాన్యులను కష్టాలలో ఆదుకునే జననేత.. ఒకరు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాగా, మరొకరు కొందుర్గు, చౌదరిగుడా మండలాలలో సేవల ద్వారా తనదైన ముద్ర వేసిన జననేత కేకే కృష్ణ. ఈ ఇద్దరు నేతలు కొందర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హాజరయ్యారు. ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఆదుకునే దిశగా రాజ్యాంగాన్ని రూపొందించి దళితులకు భవిష్యత్తును అందించిన జననేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే, అణగారిన వర్గాలకు అక్షరాలు నేర్పించి వారి భవిష్యత్తుకు ప్రాణం పోసిన ఘననేత జ్యోతిరావు పూలే అని
కొనియాడారు. అలాంటి మహోన్నత నాయకుల విగ్రహావిష్కరణ ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. యువ నాయకుడు కేకే కృష్ణ మాట్లాడుతూ పుట్టుక, మరణం మానవ జీవితంలో సహజమని, కానీ జనం కోసమే పుట్టిన నాయకులు కొందరే ఉంటారని, అలాంటి మహోన్నత వ్యక్తులే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గా, జ్యోతిరావు పూలే గా గుర్తింపు పొందుతారని ప్రశ్నించారు. అలాంటి గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కృష్ణారెడ్డి, మంగులాల్ నాయక్, సయ్యద్ సాదిక్, మల్లేష్ గౌడ్, జాంగారి రవి, గుట్ట రాజు, సాజిద్, సర్పంచులు బోయ అశోక్, తుంపల్లి బోయ రామచంద్రయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటన్నోళ్ల నరసింహ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఏళ్ల రాజు, ప్రధాన కార్యదర్శి అమరేందర్, విగ్రహ దాతలు ప్రభావతి, భీమయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.1
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- హనుమకొండలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.1
- తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.2
- ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య1
- ఆదివారం రోజున కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో. శ్రీ సీతారాములవారి పల్లకి సేవలను నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ కలిసి శ్రీ సీతారాములవారి పల్లకినీ గ్రామంలో ఆటపాటలతో, వివిధ రకాల వేషధారణలతో శ్రీరామ భజన చేస్తూ కనుల పండుగగ నిర్వహించినరూ. ఇలాంటి వేడుకలను నిర్వహించినందుకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ గారు, ఉపసర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్ గారు, వాడు సభ్యులు మబ్బులు ,మురళి, దేవేందర్ ,రమేష్, మరియు గ్రామ పెద్దలు చంద్రం , మల్లేష్ ,దుర్గయ్య గౌడ్ ,టీ మల్లేష్, శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.4
- Post by Tagore1
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1