Shuru
Apke Nagar Ki App…
Paramesh Ratnagiri
More news from Telangana and nearby areas
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం, కడమల కాలువ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నారుల కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోలాటం కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ ప్రజలు కోలాటం ను తిలకించారు.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.4
- పెదకూరపాడు: మాజీ ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేక గత ప్రభుత్వంలో తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా గ్రామ గ్రామాన 70% సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రహ్మయ్య ముంతాజ్ అప్పారావు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- బద్వేలు ,ఏప్రిల్ 14 : అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి, శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లె వెంకటసుబ్బారెడ్డి చేతులమీదుగా కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు,ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామరెడ్డి కి పలువురు అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు, అనంతరం సీఐ సీతారామిరెడ్డి, హెచ్ఎం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు, ప్రజలందరూ కూడా అగ్ని ప్రమాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, ఏదైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మనోధర్యంగా ఎదుర్కొంటూ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు, ఇటీవల బద్వేల్ ప్రాంతంలో జరిగిన అనేక ప్రమాదాలలో అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా శ్రమించి ప్రజలకు రక్షణగా నిలబడ్డారన్నారు, ప్రజలందరికీ అగ్ని ప్రమాదాల పట్ల అనేకచోట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సేవలను వారు కొనియాడారు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆపదలో ఉన్నవారిని కాపాడటమే లక్ష్యంగా అగ్నిమాపక సిబ్బంది చేసే సాహసాలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా వారు కొనియాడారు." "వేసవి కాలం దృష్ట్యా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున, గృహాల్లోనూ మరియు వ్యాపార సముదాయాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు." "కేవలం వారోత్సవాల సమయంలోనే కాకుండా, ప్రతి రోజూ అగ్నిమాపక నిబంధనలను పాటించడం ద్వారా భారీ ఆస్తి మరియు ప్రాణ నష్టాలను నివారించవచ్చని స్పష్టం చేశారు." "ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కనీస అవగాహన కలిగి ఉండాలని, యువత సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు." అనంతరం అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకొని బద్వేల్ పట్టణంలో వారం రోజులు పాటు ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్లు, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు మరియు అనేక చోట్ల అగ్ని ప్రమాదాల వారోత్సవాలను నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు, అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు, ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది లీడింగ్ ఫైర్ మాన్స్ సుధాకర్,,హరికృష్ణ, డ్రైవర్ ఆపరేటర్స్ జి చెన్నయ్య, పి మాబురెడ్డి, ప్రభాకర్, ఫైర్ మాన్స్ పి సిద్దేశ్వర్, బి శ్రీనివాసులు,, పాములేట్ నాయక్, హోంగార్డ్స్ బాలయ్య, రాజు, రాజశేఖర్ తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.3