Shuru
Apke Nagar Ki App…
యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన పూలబోయిన సాయి ప్రసాద్ బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన సాయి ప్రసాద్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అభినందించి, ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా జరిగిన కఠిన ఎంపిక ప్రక్రియలో కేవలం 48 మంది మాత్రమే ఎంపిక కాగా, అందులో తెలంగాణకు చెందిన సాయి ప్రసాద్ ఉండటం గర్వకారణమని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ను పలువురు అభినందించారు.
P.srinu
యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన పూలబోయిన సాయి ప్రసాద్ బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన సాయి ప్రసాద్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అభినందించి, ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా జరిగిన కఠిన ఎంపిక ప్రక్రియలో కేవలం 48 మంది మాత్రమే ఎంపిక కాగా, అందులో తెలంగాణకు చెందిన సాయి ప్రసాద్ ఉండటం గర్వకారణమని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ను పలువురు అభినందించారు.
More news from తెలంగాణ and nearby areas
- రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బద్దుల ఉమా గారి భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్పై రామన్నపేట ఎస్సై సతీష్ అనుచితంగా ప్రవర్తించి, భౌతికంగా దాడికి పాల్పడటాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు తీవ్రంగా ఖండించారు. రామన్నపేట మండలంలో చేనేత సంఘ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్తో ఎస్సై సతీష్ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడంతో పాటు భౌతికంగా దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇటువంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు రామన్నపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐను కలిసి, సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడి రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నాయకుల ప్రేరేపణతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన ఎస్సై సతీష్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత అధికారులు ఆయనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హెచ్చరించారు.1
- తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం ఒక సీఎం మాట్లాడే భాషేనా అని ఆయన నిలదీశారు. బ్యారేజీల గురించి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కరుస్తున్నావని, అదే ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు మాట్లాడితే వారిపై ఏసీబీ దాడులు చేయిస్తున్నావని హరీష్ రావు సీఎంపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే రక్తం పారిస్తా, నాలిక కోస్తా అనడం సరికాదన్న ఆయన, ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా కాపాడుకోవాలనే తపన ఉండాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదులుతూ తన గురువు (CBN)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలను రక్తం పారిస్తా, కోస్తా అంటావా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.2
- జనగామ జిల్లా కేంద్రంలోని పలు మాంసం విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం ఉదయం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సుమారు 20 కిలోల నాసిరకం, పరిశుభ్రత లేని మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యాపారిపై రూ. లక్ష భారీ జరిమానా విధించినట్లు పురపాలక సంఘం అధికారులు వెల్లడించారు. నగరంలోని మాంసం వ్యాపారులందరూ ప్రభుత్వం అనుమతించిన స్లాటర్ హౌస్లలోనే జంతువులను వధించాలని, ప్రజలకు కేవలం పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వధలు, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించడం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏ చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జనగామ మున్సిపాలిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు. నగర ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అపరిశుభ్రంగా లేదా నాణ్యత లేని మాంసం, చికెన్ విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే జనగామ మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇటువంటి ఫిర్యాదులపై తాము తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.1
- సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం కన్నులపండువగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కల్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన, వస్తు రూపేణా సహకరించిన దాతలకు, రాత్రింబవళ్లు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్థులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.1
- తెలంగాణ మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బూతుల పర్వం లంకించుకున్నారు. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి తనకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వీళ్ళని బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పని, తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.1
- Post by Assalamualikumjj3
- బాలికపై నిందితుడు అఘాయిత్యం చేసిన సమయంలో అతడిని పట్టుకోకుండా, అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులతో పాటు ప్రభుత్వమే సహకరించిందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు ఏకంగా ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసినప్పటికీ, పోలీసులు ఇంకా ఆ నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ దారుణ ఉదంతం తర్వాత ఆ బాలిక కుటుంబంలో ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి మిగిలిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూగ, చెవిటి, మరియు నడవలేని స్థితిలో ఉంటూ పూర్తిగా కుటుంబంపైనే ఆధారపడిన ఆ అమ్మాయి పరిస్థితిని తలుచుకుంటేనే తీవ్ర బాధగా ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.1
- తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా భద్రాద్రి భద్రాచలం చేరుకున్న జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్కు స్థానిక తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విచ్చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా రాజేంద్ర ప్రసాద్ స్వామివారిని దర్శించుకోగా, ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే పంచాయతీ రాజ్ చాంబర్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీర్వాదంతో తమ ఆశయం సిద్ధించే వరకు రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఏపీ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్ మరియు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, జల్లు కొండయ్యలతో పాటు వివిధ జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు ప్రతినిధులు ఈ స్వాగత వేడుకలో పాల్గొన్నారు.3