ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2008 నుండి 2025 వరకు గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల కోసం కేటాయించిన నిధులను అధికారులు కాజేసి, రికార్డులను మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం మెట్పల్లి ఐసీడీఎస్ అధికారుల నుండి సమాచారం కోరగా, తమకు కావలసిన రికార్డులను తనిఖీ చేసుకోమని వారు చెప్పినట్లు సమ్మయ్య పేర్కొన్నారు. అయితే, అడిగిన రికార్డులు లేవని, రికార్డులు కాలిపోయాయని యూడీసీ, సీడీపీఓలు నిర్లక్ష్యంగా మౌఖిక సమాధానం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ను కోరగా, ఐసీడీఎస్ అధికారులకు ఆయనకు కావలసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 2008 నుండి 2025 వరకు కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేయగా, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలకు అందించాల్సిన బాలామృతం, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం, నూనెల పంపిణీకి సంబంధించిన రికార్డులలో అనేక తప్పులు, అవినీతి జరిగినట్లు కనిపించిందని సమ్మయ్య తెలిపారు. రికార్డులపై సంతకాలు లేకుండానే బిల్లులు కాజేసి, ఒకే బిల్లును మళ్లీ మళ్లీ చేసుకుంటూ అనేక రకాలుగా అవినీతికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కావాల్సిన రికార్డులు లేవని, అడిగినా అస్పష్టమైన సమాధానాలు వస్తున్నాయని, ఇది రికార్డులు లేకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్కు అన్ని రికార్డులు చూపించామని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరుతున్నామని టేకుమల్ల సమ్మయ్య చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల సొమ్మును కాజేసి రికార్డులు మాయం చేసిన ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మాయమైన రికార్డులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి పసిపిల్లల సొమ్మును కాజేసినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం 2005ను దుర్వినియోగం చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని, దుర్వినియోగమైన పసిపిల్లల సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, 2024 జులై నెలలో 220 మంది అంగన్వాడీ ఆయాలకు రెండు సంవత్సరాల వేతనం పెండింగ్లో ఉందని, వేతనాలు ఇవ్వమని అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు. సీడీపీఓ, యూడీసీ, సూపర్వైజర్లు, డీడబ్ల్యుఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, అంగన్వాడీ ఆయాల జీతాలను వెంటనే ఇప్పించాలని టేకుమల్ల సమ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు పందికొక్కుల్లా స్వాహా చేస్తున్న పట్టించుకునే నాథుడు లేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అవినీతిని ఆధారాలతో చూపించినా అధికారుల్లో చలనం లేకపోవడం ఐసీడీఎస్లో అవినీతి ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తోందని అన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2008 నుండి 2025 వరకు గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల కోసం కేటాయించిన నిధులను అధికారులు కాజేసి, రికార్డులను మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం మెట్పల్లి ఐసీడీఎస్ అధికారుల నుండి సమాచారం కోరగా, తమకు కావలసిన రికార్డులను తనిఖీ చేసుకోమని వారు చెప్పినట్లు సమ్మయ్య పేర్కొన్నారు. అయితే, అడిగిన రికార్డులు లేవని, రికార్డులు కాలిపోయాయని యూడీసీ, సీడీపీఓలు నిర్లక్ష్యంగా మౌఖిక సమాధానం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ను కోరగా, ఐసీడీఎస్ అధికారులకు ఆయనకు కావలసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 2008 నుండి 2025 వరకు కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేయగా, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలకు అందించాల్సిన బాలామృతం, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం, నూనెల పంపిణీకి సంబంధించిన రికార్డులలో అనేక తప్పులు, అవినీతి జరిగినట్లు కనిపించిందని సమ్మయ్య తెలిపారు. రికార్డులపై సంతకాలు లేకుండానే బిల్లులు కాజేసి, ఒకే బిల్లును మళ్లీ మళ్లీ చేసుకుంటూ అనేక రకాలుగా అవినీతికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కావాల్సిన రికార్డులు లేవని, అడిగినా అస్పష్టమైన సమాధానాలు వస్తున్నాయని, ఇది రికార్డులు లేకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్కు అన్ని రికార్డులు చూపించామని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరుతున్నామని టేకుమల్ల సమ్మయ్య చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల సొమ్మును కాజేసి రికార్డులు మాయం చేసిన ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మాయమైన రికార్డులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి పసిపిల్లల సొమ్మును కాజేసినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం 2005ను దుర్వినియోగం చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని, దుర్వినియోగమైన పసిపిల్లల సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, 2024 జులై నెలలో 220 మంది అంగన్వాడీ ఆయాలకు రెండు సంవత్సరాల వేతనం పెండింగ్లో ఉందని, వేతనాలు ఇవ్వమని అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు. సీడీపీఓ, యూడీసీ, సూపర్వైజర్లు, డీడబ్ల్యుఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, అంగన్వాడీ ఆయాల జీతాలను వెంటనే ఇప్పించాలని టేకుమల్ల సమ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు పందికొక్కుల్లా స్వాహా చేస్తున్న పట్టించుకునే నాథుడు లేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అవినీతిని ఆధారాలతో చూపించినా అధికారుల్లో చలనం లేకపోవడం ఐసీడీఎస్లో అవినీతి ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తోందని అన్నారు.
- ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులో 2008 నుండి 2025 వరకు గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల కోసం కేటాయించిన నిధులను అధికారులు కాజేసి, రికార్డులను మాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం మెట్పల్లి ఐసీడీఎస్ అధికారుల నుండి సమాచారం కోరగా, తమకు కావలసిన రికార్డులను తనిఖీ చేసుకోమని వారు చెప్పినట్లు సమ్మయ్య పేర్కొన్నారు. అయితే, అడిగిన రికార్డులు లేవని, రికార్డులు కాలిపోయాయని యూడీసీ, సీడీపీఓలు నిర్లక్ష్యంగా మౌఖిక సమాధానం ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ను కోరగా, ఐసీడీఎస్ అధికారులకు ఆయనకు కావలసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 2008 నుండి 2025 వరకు కార్యాలయంలో ఉన్న రికార్డులను తనిఖీ చేయగా, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలకు అందించాల్సిన బాలామృతం, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం, నూనెల పంపిణీకి సంబంధించిన రికార్డులలో అనేక తప్పులు, అవినీతి జరిగినట్లు కనిపించిందని సమ్మయ్య తెలిపారు. రికార్డులపై సంతకాలు లేకుండానే బిల్లులు కాజేసి, ఒకే బిల్లును మళ్లీ మళ్లీ చేసుకుంటూ అనేక రకాలుగా అవినీతికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కావాల్సిన రికార్డులు లేవని, అడిగినా అస్పష్టమైన సమాధానాలు వస్తున్నాయని, ఇది రికార్డులు లేకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్కు అన్ని రికార్డులు చూపించామని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరుతున్నామని టేకుమల్ల సమ్మయ్య చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లల సొమ్మును కాజేసి రికార్డులు మాయం చేసిన ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మాయమైన రికార్డులపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి పసిపిల్లల సొమ్మును కాజేసినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం 2005ను దుర్వినియోగం చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకొని, దుర్వినియోగమైన పసిపిల్లల సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, 2024 జులై నెలలో 220 మంది అంగన్వాడీ ఆయాలకు రెండు సంవత్సరాల వేతనం పెండింగ్లో ఉందని, వేతనాలు ఇవ్వమని అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు. సీడీపీఓ, యూడీసీ, సూపర్వైజర్లు, డీడబ్ల్యుఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, అంగన్వాడీ ఆయాల జీతాలను వెంటనే ఇప్పించాలని టేకుమల్ల సమ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, ఐసీడీఎస్ అధికారులు పందికొక్కుల్లా స్వాహా చేస్తున్న పట్టించుకునే నాథుడు లేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అవినీతిని ఆధారాలతో చూపించినా అధికారుల్లో చలనం లేకపోవడం ఐసీడీఎస్లో అవినీతి ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తోందని అన్నారు.1
- జన్నారం మండలంలోని భంగ్యా నాయక్ తండా గ్రామ ప్రజలు తమ గ్రామంలో వీధి దీపాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు కాలనీలలో విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ, వీధి దీపాలు లేవని, దీంతో రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడకతప్పడం లేదని వారు వాపోయారు. ముఖ్యంగా, అత్యవసర సమయాలలో బయటకు రావాలంటే భయంగా ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీలలో వీధి దీపాలను ఏర్పాటు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.1
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ గిరిజనుల బతుకులు మారకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కేరామెరి మండలంలోని చిన్నుగూడా, లక్మాపూర్, అనార్ పల్లి తదితర గిరిజన గ్రామాలను సందర్శించి, స్థానిక అడవి బిడ్డల కష్టాలను, మౌలిక వసతుల కొరతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పర్యటనలో ఆయన మూడు ప్రధాన డిమాండ్లను లేవనెత్తారు: గిరిజన ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉట్నూర్ నుండి ఆసిఫాబాద్ వరకు తక్షణమే నాలుగు వరుసల రహదారిని మంజూరు చేయాలి; అత్యంత వెనుకబడిన ఆదివాసి తెగ అయిన కోలాముల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ₹100 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి; అలాగే, గిరిజనుల కొంగుబంగారమైన ఐటీడీఏను ప్రభుత్వం మూసేస్తోందా అనే అనుమానాలపై పాలకులు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో దయనీయ స్థితులను భరత్ చౌహాన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నుగూడా, లక్మాపూర్, అనార్ పల్లి వంటి గ్రామాల్లో నేటికీ అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా, వర్షాకాలంలో అనార్పల్లి, లక్మాపూర్ గ్రామ ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు, అక్కడి వాగులపై బ్రిడ్జీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన పర్యటనలో భరత్ చౌహాన్తో పాటు ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్, పి వి టి సి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు టేకం వసంతరావు, బంజారా జాగృతి భజన మండలి కన్వీనర్ జాదవ్ ప్రవీణ్ మహారాజ్, స్థానిక గిరిజన నాయకులు, యువకులు మరియు గిరిజన మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని LHPS పోరాటానికి మద్దతు పలికారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో వివోఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నాయకులు సంఘీభావం తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తన ఛాంబర్లో హైదరాబాద్కు చెందిన యూఎస్టీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. 2025 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో సంభవించిన వరదల సమయంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల కింద విశేష సేవలు అందించినందుకు ఈ ప్రశంస లభించింది. వరదల ప్రభావానికి గురైన కుటుంబాలకు యూఎస్టీ సంస్థ 600 డిజాస్టర్ ఫ్లడ్ రిలీఫ్ కిట్లను పంపిణీ చేసిందని, సకాలంలో మానవతా సహాయాన్ని అందించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు అత్యవసర సహాయం అందిందని, ఇది సమాజ సేవ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. యూఎస్టీ CSR అంబాసడర్ తిరుమల విజయ్ కుమార్తో పాటు వాలంటీర్ బృంద సభ్యులు రాధికా పెరుమాళ్, షాహుల్ సయ్యద్, సురేంద్రనాథ్ తిరునగరం, బిక్షపతి ఎండ్లా చేసిన సేవలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో సహాయక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు వారికి ప్రశంసలు తెలిపారు. జిల్లా ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా యూఎస్టీ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, విద్య, వైద్య రంగం, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో భవిష్యత్తులో CSR కార్యక్రమాలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాల్లో రాబోయే సంవత్సరాల్లో కూడా యూఎస్టీ సంస్థ తమ సహకారాన్ని కొనసాగించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దోహదపడే CSR కార్యక్రమాలలో జిల్లా పరిపాలన యూఎస్టీ సంస్థతో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో గల ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీఓఏల (గ్రామ సంఘ సహాయకులు) సమ్మె నేటి శనివారం, 30/05/2026 నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కేంద్రంలోని వీఓఏలు బతుకమ్మలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షురాలు బాలలక్ష్మి, కార్యదర్శి బంగారు అంజలి, కోశాధికారి మహంకాళి ఉమారాణి పాల్గొన్నారు. వారితో పాటు వివిధ గ్రామాల నుండి రాణి, వినోద, దేవేంద్ర, లావణ్య, స్వప్న, రజిత, రాజశ్రీ, అంజలి, వనిత, జ్యోతి, వజ్రవ్వ, సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితర వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ'ని తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అకాడమీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా SFI కోరింది. ఈ మేరకు శనివారం SFI ఆధ్వర్యంలో రేకుర్తిలోని ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మించి, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అపార్ట్మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి ఇప్పటికైనా స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని SFI కోరింది. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే, ఈ అకాడమీలపై ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని SFI హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.2
- జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనీ అంగన్వాడి కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్ 03 అంగన్వాడి కేంద్రంలో షేక్ ఇమ్రాన్ చేపట్టిన అమ్మ మాట – అంగన్వాడీ బాట” తెలంగాణ ప్రభుత్వ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. దీని ప్రధాన లక్ష్యం 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం మరియు తల్లిదండ్రులకు అంగన్వాడీ సేవలపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో:ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. పిల్లలను అంగన్వాడీల్లో నమోదు చేయిస్తారు.ప్రీ-స్కూల్ విద్య, ఆటల ద్వారా బోధన గురించి వివరించారు పిల్లలకు పోషకాహారం, యూనిఫారం, బొమ్మలు మరియు ఇతర సౌకర్యాలు అందిస్తారు. ఈ కార్యక్రమం భాగంలో ఐసిడిఎస్ సిడిపిఓ మన్నెమ్మ మరియు సూపర్వైజర్ తో పాటు వార్డు కౌన్సిలర్ టేకుల శిరీష పిల్లల సంరక్షకులు పాల్గొన్నారు1