ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలుశిక్ష ఎక్కడో తెలుసా...? బంధుమిత్రుల సందడి, విందు భోజనాలతో కళకళలాడే వేడుక పెళ్లి, అయితే ఆహ్వానం లేకున్నా పెళ్లిళ్లకు హాజరై విందు ఆరగించే వారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించబడును' అని హెచ్చరికగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్ద ఫంక్షన్ హాల్స్లో జరిగే పెళ్లిళ్లకు సంబంధంలేని కొందరు వ్యక్తులు వెళ్లి విందు భోజనం చేసి వెళ్లే ఘటనలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పక్క మానుకోటలో చర్చనీయాంశంగా మారింది.
ఫంక్షన్ కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలలు జైలుశిక్ష ఎక్కడో తెలుసా...? బంధుమిత్రుల సందడి, విందు భోజనాలతో కళకళలాడే వేడుక పెళ్లి, అయితే ఆహ్వానం లేకున్నా పెళ్లిళ్లకు హాజరై విందు ఆరగించే వారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ఫంక్షన్ హాల్స్ ముందు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించబడును' అని హెచ్చరికగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్ద ఫంక్షన్ హాల్స్లో జరిగే పెళ్లిళ్లకు సంబంధంలేని కొందరు వ్యక్తులు వెళ్లి విందు భోజనం చేసి వెళ్లే ఘటనలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పక్క మానుకోటలో చర్చనీయాంశంగా మారింది.
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.1
- ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని విద్యా నిలయ స్కూల్లో మంగళవారం బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. బాలల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓతో పాటు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- Shabbir Arts 81216816861
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ హైదరాబాద్ రోడ్డులోని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం... అతివేగంతో దూసుకొచ్చిన కారు... ప్రమాదంలో ఓ మహిళా, ఓ యువకుడు ప్రాణాపాయస్థితిలో... ద్విచక్ర వాహనం, రోడ్డుపై సఫాయి చేస్తున్న మున్సిపల్ కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు... మున్సిపల్ మహిళా కార్మికురాలి రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం.. స్కూటీపై వెళ్తున్న యువకుడికి తలకు తీవ్ర గాయం.. యువకుడి పరిస్థితి ప్రాణాపాయంగా ఉన్నట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.. ద్విచక్ర వాహనదారుడికి సీరియస్ కావడంతో ఐకాన్ హాస్పిటల్కు తరలింపు.. కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపణ.. కారు డ్రైవర్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న టూ టౌన్ పోలీసులు... *ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.*3
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- సోమవారం *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కె.అనిల్ కుమార్,* జిల్లా అధికారులు, సంబంధిత మండలాల నుండి గూగుల్ మీట్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, వివిధ సమస్యలపై ప్రజల చేసుకున్న దరఖాస్తులను సానుకూలంగా వింటూ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు, స్వయంగా, ఈ సోమవారం *వినూత్న రీతిలో మండల ప్రధాన కార్య స్థానం నుండి తహసీల్దారులకు గూగుల్ మీట్* ద్వారా ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు, ప్రజలు చేస్తున్న న్యాయమైన సమస్యలల దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాల సిఫారసు చేయాలని లేదా సరియైన విధంగా సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్ లను క్లియర్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకుంటూ, అనవసరమైన స్క్రాప్ ను ఖండం చేయాలని, అట్టి నివేదికను ప్రతిరోజు సమర్పించాలని అధికారులను ఆదేశించారు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత సిబ్బంది తరచుగా వారికి కేటాయించిన వసతి గృహాలు హాస్టలను విద్యాసంస్థలను తనిఖీ చేస్తూ విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, వసతి గృహాలలో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, జిల్లా వ్యాప్తంగా ( 136 ) దరఖాస్తులు వచ్చాయని వాటి పరిష్కారం నిమిత్తం తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, లీగల్ సెల్ ద్వారా న్యాయ సలహాలు సూచనలు సమస్యల పరిష్కారం కోసం (5) దరఖాస్తులు వచ్చాయని వారికి సరియైన పరిష్కారం చూపి పంపడం జరిగింది ప్యార లీగల్ వాలంటరీ విజయ్ కుమార్ తెలిపారు,1