Shuru
Apke Nagar Ki App…
శ్రీరామనవమి సందర్బంగా జగదేవపూర్ మండల్ అలిరాజేపీట్ లో సీతారాములా కళ్యాణం అంగవంగ వైభవంగా చేయడం జరిగింది అలిరాజాపేట లోని హనుమాన్ దేవాలయాలంలో గ్రామప్రజలదరు కలసి సీతారాములకళ్యాణం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామప్రజలు పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. అందరు కలసి అందరికి శ్రీతారాములా ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నారు
KingstarAshok KSR
శ్రీరామనవమి సందర్బంగా జగదేవపూర్ మండల్ అలిరాజేపీట్ లో సీతారాములా కళ్యాణం అంగవంగ వైభవంగా చేయడం జరిగింది అలిరాజాపేట లోని హనుమాన్ దేవాలయాలంలో గ్రామప్రజలదరు కలసి సీతారాములకళ్యాణం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామప్రజలు పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. అందరు కలసి అందరికి శ్రీతారాములా ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నారు
More news from తెలంగాణ and nearby areas
- *రిమ్మనగూడలో వైభవంగా గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు.* ౼ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ౼ భారీగా తరలివచ్చిన భక్తులు, గ్రామస్తులు ౼ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రసిద్ధ గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే నిర్వాహకులు రాము మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణ వేదిక శోభాయమానంగా మారింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గోలోకాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.4
- ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్1
- వైభవంగా సీతారాముల కళ్యాణం హైదరాబాద్లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.1
- Post by Shyam sunder Yadav Pulapally1
- ధర్మానికి ప్రతిరూపం, సత్యానికి నిలువుటద్దం ఆ శ్రీరామచంద్రుడని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షురాలు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలోని గోకుల్ నగర్ కమ్యూనిటీ హాల్ లోనిర్వహించిన సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. శ్రీరాముడు నేటి యువతకు ఆదర్శమని ఆమె కొనియాడారు.లోక కళ్యాణం కోసం ఆ విష్ణుమూర్తి స్వయంగా శ్రీరాముడిగా భూలోకానికి వచ్చి ధర్మ రక్షణ కోసం దుష్టశిక్షణ చేశారని వెల్లడించారు.అందులో భాగంగా శ్రీరాముడు హిందువుల దేవుడుగా నిలిచాడని స్పష్టం చేశారు. శ్రీరామ నవమిని పురష్కరించుకొని బండ కార్తీక రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొన్నది. బందువులు స్థానికులు తరలి రావడంతో కోలాహాలంగా మారింది. ముందుగా సీతారములకు,బండ దంపతులు స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకి ఎక్కించి కళ్యాణ వేదితకకు తరలించారు. వేద బ్రాహ్మణుల వేదమంత్రాల మద్య సీతారాముల కళ్యాణ మహోత్సవంను కన్నుల పండగలా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండ కార్తీక రెడ్డి, బండ చంద్రారెడ్డి, కొట్టం భూపాల్ రెడ్డి, కొట్టం వినోద, బండ శివా రెడ్డి,బండ జయసుధా, గోకుల నగర్ కమిటీ సభ్యులు , స్థానికులు స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.1
- చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వరంగల్కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.1
- Post by Ali ammu1
- "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.1