భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) త్వరలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ఆధునిక నోట్లు నీటిలో తడిసినా, మడతలు పడినా పాడవవు, సులభంగా చిరిగిపోవు. నకిలీ నోట్ల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక భద్రతా ఫీచర్లను ఇందులో పొందుపరుస్తారు. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల కొత్త నోట్ల ముద్రణ అవసరం తగ్గి, కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి ముద్రణ వ్యయం గణనీయంగా ఆదా అవుతుంది. ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికల్లో భాగంగా కరెన్సీ నిర్వహణలో మార్పులపై దృష్టి సారించి, ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి అంతర్గత కసరత్తును వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ తీరుపై నిపుణుల కమిటీలతో అధ్యయనం చేయిస్తోంది. ప్రారంభ దశలో, ప్రజల్లో ఎక్కువగా చలామణి అయ్యే చిన్న నోట్లైన ₹10, ₹20, ₹50లను ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ రూపంలో తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమై, ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తే, ఆ తర్వాత ₹200, ₹500 వంటి పెద్ద నోట్లలోనూ ప్లాస్టిక్ కరెన్సీని విడతల వారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) త్వరలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ఆధునిక నోట్లు నీటిలో తడిసినా, మడతలు పడినా పాడవవు, సులభంగా చిరిగిపోవు. నకిలీ నోట్ల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక భద్రతా ఫీచర్లను ఇందులో పొందుపరుస్తారు. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల కొత్త నోట్ల ముద్రణ అవసరం తగ్గి, కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి ముద్రణ వ్యయం గణనీయంగా ఆదా అవుతుంది. ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికల్లో భాగంగా కరెన్సీ నిర్వహణలో మార్పులపై దృష్టి సారించి, ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావడానికి అంతర్గత కసరత్తును వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ తీరుపై నిపుణుల కమిటీలతో అధ్యయనం చేయిస్తోంది. ప్రారంభ దశలో, ప్రజల్లో ఎక్కువగా చలామణి అయ్యే చిన్న నోట్లైన ₹10, ₹20, ₹50లను ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ రూపంలో తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమై, ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తే, ఆ తర్వాత ₹200, ₹500 వంటి పెద్ద నోట్లలోనూ ప్లాస్టిక్ కరెన్సీని విడతల వారీగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.
- 🙏😭1
- 😭🙏1
- ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల, నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ కమ్మ మహాజన సంఘం ఉచిత మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో పాటు, ఈ సంఘం ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు, సేవలు చేసి ఖమ్మం ప్రజలందరికీ ఉపయోగపడాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.2
- పొగాకు వినియోగించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని DMHO విజయలక్ష్మి హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం నాడు సిబార్ వైద్య విద్యార్థులు నగరంపాలెంలో ఒక భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా 12 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నారని తెలిపారు. దీని నియంత్రణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.1
- రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, క్యాబినెట్ హోదా కలిగిన గౌరవ శ్రీ సోళ్ల బొజ్జిరెడ్డి పోలవరం జిల్లా అధికారులతో నిర్వహించ తలపెట్టిన ఆర్&ఆర్, రెవెన్యూ శాఖల సమీక్షా సమావేశానికి అధికారులు సమయానికి హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. రంపచోడవరం ఐ. టి డి.ఎ అధికారులు ఆలస్యంగా వచ్చారు. వారం రోజుల ముందే చైర్మన్ పర్యటన, సమీక్షా సమావేశం షెడ్యూల్ జిల్లా యంత్రాంగానికి అధికారికంగా అందినప్పటికీ, సోమవారం ఉదయం 10:30 గంటలకు చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తన కమిషన్ సభ్యులతో సమావేశ మందిరానికి చేరుకున్నారు. కానీ కీలక శాఖల అధికారులు మధ్యాహ్నం 12 గంటలు దాటినా హాజరుకాలేదు. దీంతో చైర్మన్ దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది గిరిజనుల పట్ల చిన్నచూపు కాదా అని ప్రశ్నించాయి. క్యాబినెట్ హోదా ఉన్న ఎస్టీ కమిషన్ చైర్మన్కే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఒక సాధారణ గిరిజనుడు 50 కి.మీ దూరం నుంచి తన సమస్య చెప్పుకోవడానికి వస్తే వారి పరిస్థితి ఏంటని గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఆర్&ఆర్ ప్యాకేజీ అమలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు, భూసేకరణ నష్టపరిహారంపై జరగాల్సిన సమీక్షలో అవినీతి, నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతోనే అధికారులు ఉద్దేశపూర్వకంగా సమావేశానికి డుమ్మా కొట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సమయపాలన పాటించని అధికారుల తీరుపై చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించిన ఆయన, గిరిజనుల సమస్యలపై చర్చించే సమావేశానికే అధికారులు రాకపోతే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. నిర్ణీత సమయానికి హాజరుకాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్&ఆర్ అంశంపై ప్రత్యేక విచారణ జరపాలని ఎస్టీ కమిషన్ను గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ఒక క్యాబినెట్ హోదా కలిగిన కమిషన్ చైర్మన్కే అధికారులు విలువ ఇవ్వకపోతే, సామాన్య గిరిజనుడి గోడు వినేదెవరు అనే ప్రశ్న ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.1
- 😭🙏1
- 😭1
- 😭🙏1
- కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.1