మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు ఉధృతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది దశకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఏకంగా 59,000 సంతకాలను సేకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిశీలకుడు కుంబా రవిబాబు నేతృత్వంలో మంగళవారం నరసన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలు సేకరించిన కాగితాలను భద్రపరిచే ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతును ఆదుకోవాలని, అలాగే 'సూపర్ సిక్స్' హామీలు, ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమాన్ని 15వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి జరగబోయే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కృష్ణదాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వై ఎస్ భారతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు .
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు ఉధృతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది దశకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా, శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఏకంగా 59,000 సంతకాలను సేకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిశీలకుడు కుంబా రవిబాబు నేతృత్వంలో మంగళవారం నరసన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలు సేకరించిన కాగితాలను భద్రపరిచే ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి రైతును ఆదుకోవాలని, అలాగే 'సూపర్ సిక్స్' హామీలు, ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమాన్ని 15వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి జరగబోయే కార్యక్రమాలను జయప్రదం చేయాలని కృష్ణదాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం, గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వై ఎస్ భారతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకుల ఆధ్వర్యంలో కేకును కట్ చేశారు .
- 🙏🙏1
- గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల కు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిబివచ్చారు. అనంతరం స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు. వారు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి గురువారం స్థానిక ఎన్నికల విధుల ప్రక్రియను నిర్వహించనున్నారు.1
- Post by Nagesh Thalari6
- భారత్ మాత కి జై 🇮🇳4
- జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించిన జాతీయ రహదారి సిబ్బంది వారు. జాతీయ రహదారిపై బాగా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ వాహనదారులకు పాదాచారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మట్టిని తొలగిస్తున్న జాతీయ రహదారి సిబ్బంది వారు. వాహనదారులు,ప్రయాణికులు, పాదాచారులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.1
- Post by Omnamashivaya S1
- 🙏🙏1
- పాఠశాలలో మాక్ పోలింగ్ లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించామని పాఠశాల హెచ్ఎం గిరిధర్, ఉపాధ్యాయులు సతీష్ తెలిపారు. విద్యార్థులు ఎన్నికల అధికారులుగా, సిబ్బందిగా, ఓటర్లుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హెచ్ఎం కోరారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 మన పూర్వీకుల చరిత్ర తెలుసుకుందాం గతంలో కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ మన చరిత్రను కనుమరుగు చేసింది1