logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

1 hr ago
user_Apsv9 News channel
Apsv9 News channel
Media company Yeleswaram, Kakinada•
1 hr ago

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

More news from Kakinada and nearby areas
  • ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    1 hr ago
  • కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, కొడవలి గ్రామంలో నూతనంగా శ్రీకృష్ణ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, అలాగే ఒక రేకుల షెడ్డు ప్రారంభోత్సవం NRI శశి యాదవ్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, NRI శశి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పెద్దలు, గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం, ఆలయ పెద్దలు శశి యాదవ్ అందించిన 50 వేల ఆర్థిక సహాయం ఆలయ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మరిన్ని దేవాలయాలకు శశి యాదవ్ సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా శశి యాదవ్ గ్రామ శివారులోని శివాలయాన్ని కూడా పరిశీలించి, దాని అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం, గ్రామంలోని చేపల సంత చెరువు దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద కూర్చోవడానికి నీడ లేకపోవడాన్ని తెలుసుకున్న శశి యాదవ్, సుమారు 1 లక్ష రూపాయలు వెచ్చించి నూతనంగా రేకుల షెడ్డును నిర్మించారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే అభివృద్ధి అని, ఆయన ప్రజలకు ఏ విధంగా సహాయపడతారో దానిని స్ఫూర్తిగా తీసుకుని తాను వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. గ్రామ ప్రజలు కూర్చుండటానికి సరైన నీడ ప్రదేశం లేదని వారు తెలపగా, పక్షులకు, ఇతర జీవరాశులకు హాని కలగకుండా ఈ రేకుల షెడ్డును నిర్మించామని, ఇది ఎండకు, వానకు నీడనిస్తుందని ఆయన అన్నారు. అలాగే కొడవలి గ్రామ ప్రజలకు ఎటువంటి సహాయం అవసరమైనా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన బీసీ నాయకులు నక్కా బద్రి యాదవ్, మాజీ సర్పంచ్ మట్ల సత్తిబాబు, కె. గంగరావు, జి. సూర్య చక్ర, డి. శ్రీను, గోకులం యూత్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
    2
    కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, కొడవలి గ్రామంలో నూతనంగా శ్రీకృష్ణ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, అలాగే ఒక రేకుల షెడ్డు ప్రారంభోత్సవం NRI శశి యాదవ్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, NRI శశి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పెద్దలు, గ్రామ పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు.

శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం, ఆలయ పెద్దలు శశి యాదవ్ అందించిన 50 వేల ఆర్థిక సహాయం ఆలయ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మరిన్ని దేవాలయాలకు శశి యాదవ్ సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా శశి యాదవ్ గ్రామ శివారులోని శివాలయాన్ని కూడా పరిశీలించి, దాని అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం, గ్రామంలోని చేపల సంత చెరువు దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద కూర్చోవడానికి నీడ లేకపోవడాన్ని తెలుసుకున్న శశి యాదవ్, సుమారు 1 లక్ష రూపాయలు వెచ్చించి నూతనంగా రేకుల షెడ్డును నిర్మించారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే అభివృద్ధి అని, ఆయన ప్రజలకు ఏ విధంగా సహాయపడతారో దానిని స్ఫూర్తిగా తీసుకుని తాను వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. గ్రామ ప్రజలు కూర్చుండటానికి సరైన నీడ ప్రదేశం లేదని వారు తెలపగా, పక్షులకు, ఇతర జీవరాశులకు హాని కలగకుండా ఈ రేకుల షెడ్డును నిర్మించామని, ఇది ఎండకు, వానకు నీడనిస్తుందని ఆయన అన్నారు. అలాగే కొడవలి గ్రామ ప్రజలకు ఎటువంటి సహాయం అవసరమైనా అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన బీసీ నాయకులు నక్కా బద్రి యాదవ్, మాజీ సర్పంచ్ మట్ల సత్తిబాబు, కె. గంగరావు, జి. సూర్య చక్ర, డి. శ్రీను, గోకులం యూత్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
    user_B RATNA RAJU
    B RATNA RAJU
    పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో గల కుమ్మరి వారి వీధిలోని టాటా ఇన్నోవేషన్ అబ్ ఆధ్వర్యంలో జూన్ 17న అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు సూక్ష్మ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఆర్‌టీఐహెచ్ గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజమండ్రి సీఈవో, హెడ్ ఆఫ్ ఇంకూబేషన్ రవి ఈశ్వరపు తెలియజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. టిట్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ కె. చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జూన్ 17 నుండి 23, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో వ్యాపార అవకాశాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత వ్యాపారాల నిర్వహణ, మార్కెట్ మరియు ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, అలాగే వ్యాపార కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ ప్లాన్) రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. పాండురంగ, టి. శ్రీనివాస్, కె. మణికంఠతో పాటు పలువురు మహిళలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల ఆలోచనలను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలుగా మార్చే లక్ష్యంతో టాటా ఇన్నోవేషన్ అబ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
    4
    కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో గల కుమ్మరి వారి వీధిలోని టాటా ఇన్నోవేషన్ అబ్ ఆధ్వర్యంలో జూన్ 17న అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు సూక్ష్మ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఆర్‌టీఐహెచ్ గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజమండ్రి సీఈవో, హెడ్ ఆఫ్ ఇంకూబేషన్ రవి ఈశ్వరపు తెలియజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

టిట్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ కె. చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జూన్ 17 నుండి 23, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో వ్యాపార అవకాశాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత వ్యాపారాల నిర్వహణ, మార్కెట్ మరియు ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, అలాగే వ్యాపార కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ ప్లాన్) రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జి. పాండురంగ, టి. శ్రీనివాస్, కె. మణికంఠతో పాటు పలువురు మహిళలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల ఆలోచనలను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలుగా మార్చే లక్ష్యంతో టాటా ఇన్నోవేషన్ అబ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
    user_Sattibabau dadala
    Sattibabau dadala
    Local News Reporter కొత్తపల్లె, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    1
    పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.

మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కాకినాడ జిల్లాలోని తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు బుధవారం మధ్యాహ్నం వరకు ఉక్కపోత, ఎండతో ఇబ్బంది పడిన తర్వాత ఒక్కసారిగా ఉపశమనం పొందారు. మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై, ఒక్కసారిగా చీకటి కమ్మి, వాతావరణం మారిపోయింది. అనంతరం, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాణిజ్య, వ్యాపార రంగాలు మూతపడ్డాయి.
    1
    కాకినాడ జిల్లాలోని తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు బుధవారం మధ్యాహ్నం వరకు ఉక్కపోత, ఎండతో ఇబ్బంది పడిన తర్వాత ఒక్కసారిగా ఉపశమనం పొందారు. మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై, ఒక్కసారిగా చీకటి కమ్మి, వాతావరణం మారిపోయింది.

అనంతరం, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాణిజ్య, వ్యాపార రంగాలు మూతపడ్డాయి.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటలో అమృత్ 2.0 నిధులు ₹2.38 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ సర్వీస్ డబుల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రానున్న రోజుల్లో 22, 26, 30 వార్డుల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
    1
    కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటలో అమృత్ 2.0 నిధులు ₹2.38 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ సర్వీస్ డబుల్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రానున్న రోజుల్లో 22, 26, 30 వార్డుల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
    user_Mohammad Imran
    Mohammad Imran
    గుడివాడ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడులో రేపు నిర్వహించాల్సిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అకాల వర్షాల కారణంగా సభా ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, కార్యకర్తల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ ఆర్డీవో కృష్ణమూర్తితో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. వాతావరణ శాఖ కాకినాడ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ నిర్ణయం ప్రాముఖ్యత సంతరించుకుంది.
    1
    కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడులో రేపు నిర్వహించాల్సిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అకాల వర్షాల కారణంగా సభా ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, కార్యకర్తల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ ఆర్డీవో కృష్ణమూర్తితో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. వాతావరణ శాఖ కాకినాడ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఈ నిర్ణయం ప్రాముఖ్యత సంతరించుకుంది.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    1 hr ago
  • మృతదేహాల పోస్టుమార్టం నిర్వహణకు ₹4,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సిబ్బంది ఏకంగా "ఈ మొత్తంలో డాక్టర్లకే ₹2,500 వెళ్తుంది" అని బహిరంగంగా చెప్పడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్సులు ఉంటేనే పోస్టుమార్టం త్వరగా పూర్తవుతోందని, లేకపోతే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    మృతదేహాల పోస్టుమార్టం నిర్వహణకు ₹4,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సిబ్బంది ఏకంగా "ఈ మొత్తంలో డాక్టర్లకే ₹2,500 వెళ్తుంది" అని బహిరంగంగా చెప్పడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.

ఆసుపత్రి సూపరింటెండెంట్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్సులు ఉంటేనే పోస్టుమార్టం త్వరగా పూర్తవుతోందని, లేకపోతే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.