రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన మంత్రి పొన్నం ప్రభాకర్....నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.
రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన మంత్రి పొన్నం ప్రభాకర్....నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు సెంటర్ కు మండల స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, కొహెడ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం అధికారులు, పార్టీ శ్రేణులతో వెర్వేరుగా సమావేశమై ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, వేసవిలో మంచినీటి ఎద్దడి, స్థానిక సమస్యలపై అధికారులకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు మొదలయ్యిందని
ట్రాన్స్ పోర్ట్ సమస్య లేకుండా మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా జిల్లా కలెక్టర్ లు రైస్ మిల్లర్లతో మాట్లాడుతారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామ కార్యదర్శి, జిపివో, వారికి తోడుగా పార్టీ కమిటీ మండల స్థాయిలో తహశీల్దార్ ఎంపిడివో, ఏవో లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో డిఎస్వో, డిపివో, జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షిస్తు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని మీ పరిధిలో పరిష్కారం కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తనకేం సంబంధం లేనట్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ గా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు తోపాటు గ్రామాల్లో ఈ వేసవిలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికి పనులు ప్రారంభించని వారి ఇళ్ళను రద్దు చేసి కొత్తవారిని ఎంపిక చేయాలని ఆదేశించారు.
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ డిపో చైర్మన్ సుధాకర్ రెడ్డి ద్వారా కార్మిక జెండాను మంత్రి ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడి సోలమన్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మే డే వేడుకల్లో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి తెలిపారు. గతంలో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుంది అంటే మహా లక్ష్మీ పథకం ద్వారానేనని తెలిపారు. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు 35 లక్షల కిలోమీటర్లు 10 వేల బస్సులతో ఆర్టీసీ రన్ చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కి వెళ్తే వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క సారథ్యంలో నేను ,మంత్రులు శ్రీధర్ బాబు ,వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్మిక సంఘాల తో 15 గంటల పాటు చర్చించి వారి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుని ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం , కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిందని తెలిపారు. కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి.. గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపట్టామని ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని జిల్లాల మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల తో ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయి, ఎక్కడ బస్ స్టేషన్ల అభివృద్ధి అవసరముందని వారి దగ్గర వినతులు తీసుకొని పరిష్కరిస్తున్నామని తెలిపారు.3
- ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.1
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక అంబులెన్స్కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- Post by Vodnala thirupthi1
- కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.2
- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.2