ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, మరియు క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు మత్స్యకార ప్రముఖులను గ్రామ పెద్ద మనుషులుగా సంఘం సభ్యులు ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కాపులు మరియు మత్స్యకార పెద్దలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మత్స్యకార పెద్దలకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నూతన కార్యవర్గం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి ఆర్థికాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాననని మత్స్యకార నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపులతో పాటు పలువురు మత్స్యకార నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం ఊటుకూరు పెద్దపాళెం కాపులుగా ఎంపికైన మత్స్యకార పెద్దలకు ఘన సన్మానం విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, మరియు క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో ఆరుగురు మత్స్యకార ప్రముఖులను గ్రామ పెద్ద మనుషులుగా సంఘం సభ్యులు ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మత్స్యకార నాయకులు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వారి క్యాంప్
కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కాపులు మరియు మత్స్యకార పెద్దలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మత్స్యకార పెద్దలకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నూతన కార్యవర్గం మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి వారి ఆర్థికాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తాననని మత్స్యకార నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపులతో పాటు పలువురు మత్స్యకార నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- *కడప జిల్లా :* వీరబల్లి మండలంలో ఉద్రిక్తత... సంగంవాండ్లపల్లి వద్ద వీరబల్లి-రాయచోటి రహదారి పై బైఠాయించిన సంగంవాండ్లపల్లి, పెద్దివీడు గ్రామాల ప్రజలు... నిలిచిపోయిన రాకపోకలు... ఆక్రమణకు గురైన తిమ్మారెడ్డి చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలి అంటూ నినాదాలు... కబ్జాదారులకు వీరబల్లి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణ...1