Shuru
Apke Nagar Ki App…
ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు అలా నిర్మించావు: రాంగోపాల్ రెడ్డి చెన్నై తాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మించావు చెప్పు జగన్' అంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం విజయవాడ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.చెన్నైకి మనకు ఏమి సంబంధం.. ఎవడబ్బ సొమ్మని అక్కడ ఖర్చు పెట్టావు జగన్' అని ప్రశ్నించారు. వారి బంధువులు రాజకీయాల్లో ఉన్నారని ఏపీ ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావన్నారు.
LAKKU SIVA SANKAR reddy
ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు అలా నిర్మించావు: రాంగోపాల్ రెడ్డి చెన్నై తాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మించావు చెప్పు జగన్' అంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం విజయవాడ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.చెన్నైకి మనకు ఏమి సంబంధం.. ఎవడబ్బ సొమ్మని అక్కడ ఖర్చు పెట్టావు జగన్' అని ప్రశ్నించారు. వారి బంధువులు రాజకీయాల్లో ఉన్నారని ఏపీ ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చేనేత సమస్యలపై ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటాం: కేతిరెడ్డి చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో ధర్మవరంలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడురు.. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకుల మాటలు విని అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్న హ్యాండ్లూమ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హులకు పథకం అందకుండా చేసిన అధికారులపై విచారణ జరిపించి, తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటామని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.1
- ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం.... ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.4
- మార్తోమా నగర్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి..పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి. బద్వేలు, ఆగస్టు 11:మార్తోమ నగర్ ఏర్పాటై 22 సంవత్సరాలు అయినప్పటికీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తామనగర్ స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ. బద్వేల్ పట్టణం11వ వార్డు మార్తామ నగర్ స్మశానం కు 2008లో రెండు ఎకరాలు అధికారులు కేటాయించారని, అయితే ఈ స్మశాన వాటికకు దారి సరిగా లేదని, అలాగే స్మశానం కంపచెట్లతో నిండి ఉన్నదని, ఆయన తెలిపారు చాలాసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లు వేయించుకునే పాలక ప్రభుత్వాలు వీరి స్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికకు సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరీ గోడ, చేతిపంపు ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి, నాగ దాసరి ఇమ్మానుయేలు, ఏరియా పట్టణ కార్య వర్గ సభ్యులు పడగ వెంకటరమణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు3
- డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నమయ్య జిల్లా పుంగనూరు డీఎస్సీ అంటే ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు చింపేసి గెలవడం అనుకున్నారా పుంగనూరు టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ డి ఎస్ సి అంటే గతంలో స్థానికసంస్థలఎన్నికలలో పేపర్లు చించి కౌన్సిలర్లు మరియు యం పి టి సి లు జడ్ పి టి సి లు అయినట్లు కాదని పుంగనూరు పట్టణ టిడిపి మాజీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రాయల్ అన్నారు. మంగళవారం పుంగనూరులో ఆయన వైసిపి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో డి ఎస్ సి ని నిర్వహించండి అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే వాళ్ల పైన లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి ఇప్పుడు డి ఎస్ సి పై ప్రేమ వచ్చిందా అని డి ఎస్ సి అంటే ల్యాండ్, శాండ్, మైను, వైను, లూటీచేసినట్లు కాదు ఎంతో కష్టపడి నిగాయితీగా పరీక్షలు రాసి వాటిలో క్వాలిఫై అయితే వారికి ఉపాధ్యాయ పోస్ట్ లు వస్తాయి, మీ లాగా శాసన సభ్యులు గా గెలిచి అసెంబ్లీ వెళ్ళకుండా ప్రజలను యామర్చడం కాదు డి ఎస్ సి అంటే, మానాయకుడు నిభద్దతతో నిరుద్యుగులకు ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 10 నెలలలోపే డి ఎస్ సి నిర్వహించి న ఘనత మా నారా లోకేష్ బాబు గారిది మరియునారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానిది, మీకు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసిన మేలు ఎంతమాత్రం అనేది తేలుసు కొన్నారు మీకు అధికార దాహం తో మీకు రక్తపాత రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు రాబోవు కాలం లో ప్రజలు మీమ్మలిని గ్రామాలలో తిరగనివ్వరు రని తెలియచేస్తున్నాము, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నెల లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి అక్కడకు వెళ్ళి మాట్లాడండి అనితెలియ చేస్తున్నాము, మా నారా లోకేష్ బాబును రాజీనామా చేయించే అంత గొప్పవారు లేరని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకు లు వెంకటేష్, సయ్యద్, మంజు, నూర్షా,నూరు, భార్గవ్ అఫ్రాజ్, శేఖర్ ,అజీర్ ,వంశి, కుట్టి ,అజిత్, అల్తాఫ్, నామ త్, సాదిక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు2
- విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు: బీటెక్ రవి విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ విద్యా సంస్థలు చెలగాటమాడుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక ర్యాలీలలో విద్యార్థులు పాల్గొనడం ఆనవాయితీ అని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొనడం ఎంతవరకు సమంజసమన్నారు.1