Shuru
Apke Nagar Ki App…
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షుడు బైకాని మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దండిగా వెంకన్న, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీష్ గౌడ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
A.SHANKAR
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షుడు బైకాని మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దండిగా వెంకన్న, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీష్ గౌడ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ కోసం కేటాయించిన సమయం ముగిసినప్పటికీ, ఆశించిన మేర జనం రాకపోవడంతో పలుచోట్ల బస్సులు ఖాళీగానే వెనుదిరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ సభకు సంబంధించి మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలను, స్వయం సహాయక సంఘాల సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బలవంతంగా సభకు తరలిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు మరియు సభలో కనిపించిన వెలవెలబాటుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ నూతన ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, మరియు పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.2
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పర్వతమ్మగూడెం గ్రామంలో "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొని, గ్రామాన్ని గంజాయి రహితంగా, నేర రహితంగా మరియు సురక్షితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు వీడియో ప్రదర్శనల ద్వారా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ఏ విధంగా దెబ్బతింటుందో వివరించి అవగాహన కల్పించారు. గంజాయి రహిత గ్రామ నిర్మాణంలో ప్రతి గ్రామస్థుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. గ్రామ భద్రతలో, నేరాల నియంత్రణలో మరియు నేరస్థుల గుర్తింపులో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు మరియు మీడియా మిత్రులకు ఎస్పీ హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన "Wall of Promise" (ప్రతిజ్ఞ గోడ) వద్ద గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామస్థులతో కలిసి గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, హెల్మెట్ ధరిస్తామని మరియు గ్రామ భద్రతకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించి, సంతకాలు చేయించారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, యువత మరియు ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొంటూ, గంజాయి సాగు, రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలుపుతూ, ఎలాంటి సమాచారం ఉన్నా 87126 56999 నంబర్కు తెలియజేయాలని ఎస్పీ ప్రజలను కోరారు.1
- హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.1
- తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.1
- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.1
- పోక్సో కేసులో నమోదైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో పోక్సో కేసు బాధితురాలు, ఆమె తల్లి తనకు ఫోన్ చేసి తీవ్ర భయాందోళనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని బాధిత కుటుంబం తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో నిందితులు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎదుర్కొంటున్న భయాందోళనలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా దారుణ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయ మరియు పోలీసు వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.1