logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా"టి.జనార్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా" టి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.అదేవిధంగా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య హక్కుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఎఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_Reporter Pen Ppwer
Reporter Pen Ppwer
చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యాసంస్థల్లో జెండా ఆవిష్కరణ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా"టి.జనార్ధన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా" టి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.అదేవిధంగా కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు.ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య హక్కుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని, పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఎఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు.

More news from Chittoor and nearby areas
  • దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!”... ఆసక్తికరమైన అంశాలు జాతీయ జెండా మన గౌరవానికి ప్రతీక త్రివర్ణ పతాకంలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతి మరియు సత్యానికి, ఆకుపచ్చ అభివృద్ధి మరియు సస్యశ్యామలతకు ప్రతీకగా భావిస్తాం. మధ్యలోని అశోకచక్రం ధర్మం, నిరంతర ప్రగతికి ప్రతీక. స్వాతంత్ర్యం వెనుక ఎన్నో త్యాగాలు మనకు లభించిన స్వేచ్ఛ ఒక్కరోజులో వచ్చినది కాదు. గాంధీజీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి అనేక మంది నాయకులతో పాటు పేరు తెలియని వేలాది మంది కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు. విద్యార్థుల ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యత నేటి విద్యార్థులే రేపటి భారతదేశాన్ని నిర్మించే పౌరులు. అందుకే విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం ద్వారా దేశభక్తి, ఐక్యత, బాధ్యత వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. జెండా ఎగురవేయడం మాత్రమే కాదు—దేశాన్ని గౌరవించడం కూడా జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేయడంతో పాటు దేశ చట్టాలను గౌరవించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను గౌరవించడం, బాధ్యతగల పౌరులుగా ఉండడం కూడా నిజమైన దేశభక్తే. అందరినీ కలుపుకొని వెళ్లే సందేశం ఈ ర్యాలీ ఎవరికైనా వ్యతిరేకంగా కాదు. జాతీయ ఐక్యత, దేశభక్తి, స్వాతంత్ర్య విలువలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టంగా చెప్పవచ్చు. 🎤 కార్యక్రమంలో చెప్పడానికి మంచి ముగింపు “భారతదేశ స్వాతంత్ర్యం మనకు లభించిన గొప్ప వరం. ఆ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు—అది మన దేశ గౌరవానికి, మన ఐక్యతకు, మన స్వాతంత్ర్యానికి ప్రతీక. ఈ ఆగస్టు 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా మనమంతా కలిసి దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!” 🇮🇳
    2
    దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!”...
ఆసక్తికరమైన అంశాలు
జాతీయ జెండా మన గౌరవానికి ప్రతీక
త్రివర్ణ పతాకంలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతి మరియు సత్యానికి, ఆకుపచ్చ అభివృద్ధి మరియు సస్యశ్యామలతకు ప్రతీకగా భావిస్తాం. మధ్యలోని అశోకచక్రం ధర్మం, నిరంతర ప్రగతికి ప్రతీక.
స్వాతంత్ర్యం వెనుక ఎన్నో త్యాగాలు
మనకు లభించిన స్వేచ్ఛ ఒక్కరోజులో వచ్చినది కాదు. గాంధీజీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి అనేక మంది నాయకులతో పాటు పేరు తెలియని వేలాది మంది కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు.
విద్యార్థుల ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యత
నేటి విద్యార్థులే రేపటి భారతదేశాన్ని నిర్మించే పౌరులు. అందుకే విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం ద్వారా దేశభక్తి, ఐక్యత, బాధ్యత వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు.
జెండా ఎగురవేయడం మాత్రమే కాదు—దేశాన్ని గౌరవించడం కూడా
జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేయడంతో పాటు దేశ చట్టాలను గౌరవించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులను గౌరవించడం, బాధ్యతగల పౌరులుగా ఉండడం కూడా నిజమైన దేశభక్తే.
అందరినీ కలుపుకొని వెళ్లే సందేశం
ఈ ర్యాలీ ఎవరికైనా వ్యతిరేకంగా కాదు. జాతీయ ఐక్యత, దేశభక్తి, స్వాతంత్ర్య విలువలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టంగా చెప్పవచ్చు.
🎤 కార్యక్రమంలో చెప్పడానికి మంచి ముగింపు
“భారతదేశ స్వాతంత్ర్యం మనకు లభించిన గొప్ప వరం. ఆ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు—అది మన దేశ గౌరవానికి, మన ఐక్యతకు, మన స్వాతంత్ర్యానికి ప్రతీక. ఈ ఆగస్టు 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా మనమంతా కలిసి దేశభక్తిని చాటుదాం. జెండాను గౌరవిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, భారతీయులుగా మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. జై హింద్! జై భారత్!” 🇮🇳
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    12 hrs ago
  • అమావాస్య సందర్భంగా విశేష పూజలందుకున్న విరూపాక్షి మారెమ్మ తల్లి. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు. పుంగనూరు ప్రైవేట్ బస్టాండ్ సమీపాన వెలసిన శక్తి క్షేత్రం విరూపాక్ష మారెమ్మ తల్లి ఆలయంలో సమావేశం సందర్భంగా అమ్మవారిని పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ఫల పుష్పాలను నివేదించి వేధించి అత్యంత సుందరంగా అర్చక స్వాములు అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఆపై అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అర్చక స్వాములు ఆలయ కమిటీ సభ్యులు పంచిపెట్టారు. ఈ అమావాస్య రోజు అమ్మవారి గర్భగుడిలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి ఇచ్చే నిమ్మకాయలు, గుమ్మడికాయల కోసం భక్తులు ఎగబడ్డారు.
    2
    అమావాస్య సందర్భంగా విశేష పూజలందుకున్న విరూపాక్షి మారెమ్మ తల్లి. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు.
పుంగనూరు ప్రైవేట్ బస్టాండ్ సమీపాన వెలసిన శక్తి క్షేత్రం విరూపాక్ష మారెమ్మ తల్లి ఆలయంలో సమావేశం సందర్భంగా అమ్మవారిని పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ఫల పుష్పాలను నివేదించి వేధించి అత్యంత సుందరంగా అర్చక స్వాములు అమ్మవారిని  అలంకరించడం జరిగింది. ఆపై  అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అర్చక స్వాములు ఆలయ కమిటీ సభ్యులు పంచిపెట్టారు.  ఈ అమావాస్య రోజు అమ్మవారి గర్భగుడిలో ఉంచి  ప్రత్యేక పూజలు  చేసి ఇచ్చే నిమ్మకాయలు, గుమ్మడికాయల కోసం భక్తులు ఎగబడ్డారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? -శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? -శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
    1
    నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు?

-శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
నా భర్త సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మంత్రిగా జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు. కానీ నేడు క్రిమినల్ గా ముద్ర వేస్తున్నారు. రాజకీయంగా నా భర్తను ఎదుర్కోండి.. అంతేతప్ప చదువుకుంటున్న నా బిడ్డని రాజకీయాల్లోకి లాగి వేధించడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు?
-శ్రీదేవి గారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి సతీమణి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • అలిపిరి పోలీస్ స్టేషన్‌కు మన తిరుపతి ప్రెస్ క్లబ్ పుస్తకాల వితరణ తిరుపతి, ఆగస్టు 11: పఠన అలవాటును ప్రోత్సహించడం, జ్ఞానాన్ని పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయానికి పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అడ్వకేట్ గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లు, పోలీసు సిబ్బంది ఖాళీ సమయాన్ని సెల్‌ఫోన్ వినియోగానికి కాకుండా పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ పి.వి.ఎస్. రామ కిషోర్ మాట్లాడుతూ, పఠన అలవాటును ప్రోత్సహించే విధంగా పుస్తకాలను అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొడ్డిండ్ల వెంకటేశ్వర్లును అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, గౌరవాధ్యక్షులు సుకుమార్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, వెంకట్రావు, సెక్రటరీ అనుపమ, కోశాధికారి గడ్డం కీర్తి, మేనేజర్ అనిల్ రాయల్, అభిసారిక, మధు, నాగ బాల తదితరులు పాల్గొన్నారు. చదవండి – నేర్చుకోండి – ఆలోచించండి – ఎదగండి. పుస్తకాలు మనసులను వెలిగిస్తాయి… జ్ఞానం సమాజాన్ని బలోపేతం చేస్తుంది.
    1
    అలిపిరి పోలీస్ స్టేషన్‌కు మన తిరుపతి ప్రెస్ క్లబ్ పుస్తకాల వితరణ

తిరుపతి, ఆగస్టు 11:
పఠన అలవాటును ప్రోత్సహించడం, జ్ఞానాన్ని పెంపొందించడం, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ కార్యాలయానికి పుస్తకాలను వితరణ చేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అడ్వకేట్ గొడ్డిండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే పిటిషనర్లు, పోలీసు సిబ్బంది ఖాళీ సమయాన్ని సెల్‌ఫోన్ వినియోగానికి కాకుండా పుస్తక పఠనానికి కేటాయించాలని సూచించారు. పుస్తక పఠనం జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ పి.వి.ఎస్. రామ కిషోర్ మాట్లాడుతూ, పఠన అలవాటును ప్రోత్సహించే విధంగా పుస్తకాలను అందించడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొడ్డిండ్ల వెంకటేశ్వర్లును అభినందించారు.

ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి, గౌరవాధ్యక్షులు సుకుమార్ రాజు, వైస్ ప్రెసిడెంట్ పొన్నా రవికుమార్, వెంకట్రావు, సెక్రటరీ అనుపమ, కోశాధికారి గడ్డం కీర్తి, మేనేజర్ అనిల్ రాయల్, అభిసారిక, మధు, నాగ బాల తదితరులు పాల్గొన్నారు.

చదవండి – నేర్చుకోండి – ఆలోచించండి – ఎదగండి.
పుస్తకాలు మనసులను వెలిగిస్తాయి… జ్ఞానం సమాజాన్ని బలోపేతం చేస్తుంది.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అందమైన పాము 🐍 దాని వెనుక డేంజర్ ❌🤢 అందం వెనుక దాగున్న డేంజర్.. ఇలాంటి పామును చూశారా? వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    1
    అందమైన పాము 🐍 

దాని వెనుక డేంజర్ ❌🤢

అందం వెనుక దాగున్న డేంజర్.. 

ఇలాంటి పామును చూశారా?
వరంగల్ జిల్లా పాకాల మండలం అశోక్ నగర్ గ్రామంలో అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది. నలుపు, పచ్చటి చారలతో అందంగా కనిపించే ఈ సర్పం అత్యంత విషపూరితమైనది. బాండెడ్ క్రేట్గా గుర్తించిన ఈ పాము కాటేస్తే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఆ పామును బంధించి అడవుల్లో విడిచిపెట్టారు. ఈ జాతి పాములు చైనా, నేపాల్, థాయిలాండ్ లాంటి దేశాలలో కనిపిస్తాయి.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిశ్రమలపై దాడులు, దౌర్జన్యాలు పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు నిత్య కృత్యాలు అయిపోయాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం వదిలిపోయేలా చేస్తున్నారు. -వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిశ్రమలపై దాడులు, దౌర్జన్యాలు పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు నిత్య కృత్యాలు అయిపోయాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం వదిలిపోయేలా చేస్తున్నారు. -వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిశ్రమలపై దాడులు, దౌర్జన్యాలు పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు నిత్య కృత్యాలు అయిపోయాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం వదిలిపోయేలా చేస్తున్నారు.

-వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
బూడిద పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పరిశ్రమలపై దాడులు, దౌర్జన్యాలు పారిశ్రామిక వేత్తలకు బెదిరింపులు నిత్య కృత్యాలు అయిపోయాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రం వదిలిపోయేలా చేస్తున్నారు.
-వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు.... మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    వనిపెంట చెక్‌పోస్ట్ వద్ద రోడ్డు గుంతలకు మరమ్మతులు....

మైదుకూరు–పోరుమామిళ్ల రహదారిలో వాహనదారులకు ఊరట
మైదుకూరు: మైదుకూరు–పోరుమామిళ్ల ప్రధాన రహదారిలోని వనిపెంట చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వెంటనే జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి సుబ్బారాయుడు స్పందించారు.వెంటనే అక్కడికి చేరుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి మరమ్మతులు చేయించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, గ్రామ ప్రజలకు కొంత ఊరట లభించింది.ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంటనే స్పందించి, స్వయంగా చర్యలు తీసుకున్న తమ్మిశెట్టి సుబ్బారాయుడు సేవాభావాన్ని గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.రోడ్డు గుంతల సమస్యను వెంటనే పరిష్కరించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే స్టేషన్‌లో జరిగిన సెల్‌ఫోన్ చోరీపై విచారణకు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన కనిపించింది. క్షతగాత్రులను చూసిన రమణయ్య వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాహనాల తాళాలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని యువకులకు సూచించగా.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు "కత్తితో పొడుస్తానంటూ" బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..
    1
    పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం
పోలీసులపై దౌర్జన్యం.. కత్తితో పొడుస్తానంటూ బెదిరింపులు... శ్రీకాళహస్తిలో కలకలం
విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో ఉద్రిక్తతకు దారితీసింది.
రైల్వే స్టేషన్‌లో జరిగిన సెల్‌ఫోన్ చోరీపై విచారణకు వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యకు మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన కనిపించింది.
క్షతగాత్రులను చూసిన రమణయ్య వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వాహనాల తాళాలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని యువకులకు సూచించగా.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
మాటామాటా పెరగడంతో హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు "కత్తితో పొడుస్తానంటూ" బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనే దౌర్జన్యం జరిగితే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..
    user_Harshitha RALLAPALLI
    Harshitha RALLAPALLI
    అట్లూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.