Shuru
Apke Nagar Ki App…
*చర్ల మండలంలో పాడి పశువులను కాపాడేది ఎవరు!?...* *పన్నెండు వందల ఆవులు గేదెలు ఎద్దులు చర్ల పోలీస్ అధికారులకు కనిపించడం లేదా!?* *అక్రమ రవాణా సహకరించే ఆ పాపపు అధికారి వాటా ఎంత...!?* *శ్రీను అనే వ్యాపారి మీడియాపై దుర్భాషలు ఆడినట్లు కసాయి వ్యాపారుల గుసగుసలు...* *రాజకీయ నాయకుల సహకారంతోనే కబేలాలకు తరలిస్తానని సవాల్ విసిరిన ఘనుడు* *అయ్యా జిల్లా ఎస్పీ రోహిత్ సాబ్ మాకు పాడిపశువులు దైవంతో సమానం జర కాపాడండి అంటున్న హిందువులు*
Sode Prasad
*చర్ల మండలంలో పాడి పశువులను కాపాడేది ఎవరు!?...* *పన్నెండు వందల ఆవులు గేదెలు ఎద్దులు చర్ల పోలీస్ అధికారులకు కనిపించడం లేదా!?* *అక్రమ రవాణా సహకరించే ఆ పాపపు అధికారి వాటా ఎంత...!?* *శ్రీను అనే వ్యాపారి మీడియాపై దుర్భాషలు ఆడినట్లు కసాయి వ్యాపారుల గుసగుసలు...* *రాజకీయ నాయకుల సహకారంతోనే కబేలాలకు తరలిస్తానని సవాల్ విసిరిన ఘనుడు* *అయ్యా జిల్లా ఎస్పీ రోహిత్ సాబ్ మాకు పాడిపశువులు దైవంతో సమానం జర కాపాడండి అంటున్న హిందువులు*
More news from తెలంగాణ and nearby areas
- Post by V Ramarao4
- మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపుకు స్పందించిన తిర్మలాపురం గ్రామ ప్రజలు ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు గ్రామంలోకి అనుమతి ఇవ్వబోమని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ ప్రవేశద్వారంలో ప్రత్యేక స్వాగత ఆర్చ్ను ఏర్పాటు చేశారు. హెల్మెట్ అవసరాన్ని వివరించే సందేశాలతో రూపొందించిన ఈ స్వాగత ద్వారం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ, భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు గ్రామాన్ని సందర్శించి, హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను అభినందించారు. తిర్మలాపురం గ్రామప్రజలను, కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్ను ప్రత్యేకంగా ప్రశంసించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రోడ్డు భద్రతపై చూపిన చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.1
- పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.1
- కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ అభివృద్ధికి 9కోట్ల రూపాయలు మంజులైనట్లు మేయర్ మూడ్ గణేష్ తెలిపారు లక్ష్మీదేవి పల్లి,నిమ్మలగూడెం,కోమటపల్లి గ్రామాలలో మౌలిక వసంతలు కల్పనకు ఈ నిధులు వేచినట్లు పేర్కొన్నారు.తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను అని కేవలం 20వ డివిజన్ మాత్రమే కాకుండా కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు1
- హనుమకొండ జిల్లా వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం లేకుండా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలతో గత నాలుగు నెలలుగా సుమారు 204 ఫైళ్లను పెండింగ్లో ఉంచినట్లు ఫిర్యాదులు వచ్చినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సోదాల సందర్భంగా 20 మంది మధ్యవర్తుల వద్ద నుంచి రూ.45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలపై విచారణ కొనసాగుతోంది.1
- Post by Syyed taher1