Shuru
Apke Nagar Ki App…
ఉమ్మడి అల్లూరిలో గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 86 మంది దూరంగా ఉన్నారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
Nava surya
ఉమ్మడి అల్లూరిలో గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 86 మంది దూరంగా ఉన్నారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.1
- లేబర్ కోడ్లను రద్దు చేయాలని కొమరాడలో 'బ్లాక్ డే' నిరసన కొమరాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరాడ మండల కేంద్రంలో కార్మికులు మరియు ఉపాధి హామీ కూలీలు కలిసి ఈరోజు 'బ్లాక్ డే' నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టి వ్యతిరేకించినప్పటికీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్లను అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులతో పాటు దళితులు, గిరిజనులు మరియు అన్ని వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప" అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కార్మిక వర్గం మరో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, సిఐటియు కార్యకర్తలు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.1
- అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభసందర్భంగా పాతపట్నంలో ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం సాయంత్రం ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏపీ సమగ్ర అభివృద్ధికి అమరావతి కీలక కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భముగా పీఎం నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబుకు, డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ఎంజీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి ,జై అమరావతి అంటూ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు1
- Post by Sode Prasad1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ పరిధిలోని రెడ్డిక మరువాడలో గ్రామ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి తిరుపతిరావు, సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగించారు.అలాగే గ్రామంలోని వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత పనులు నిర్వహించారు. కాలువల్లో బ్లీచింగ్ పొడి చల్లి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామ ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.2
- కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మల మండలం నౌపడ గ్రామంలో హనుమాన్ విజయోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా భక్తులు స్వామివారిని సింధూర సేవలు తమ చిన్న సేవలు చేసి స్వామి వారి విశేష పూజ నిర్వహించారు.4