logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సారపాక ప్రాథమిక పాఠశాలకు టీచర్ల కొరత విద్యార్థులకు చదువు భారం! ఎంఈఓ, డీవీవో, స్పందించాలంటున్న సర్పంచ్* 287 మంది విద్యార్థులు.. 15 మంది టీచర్లు! సారపాక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు *ఎంఈఓ, డీవీఓలు స్పందించరా? విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రశ్న* సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మసీద్ రోడ్ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతపై గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 287 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, గతంలో 20 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారని సర్పంచ్ తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో పాటు మరో ముగ్గురిని ఇతర పాఠశాలలకు మార్చడంతో ప్రస్తుతం 15 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. వసతులు కల్పించాం.. టీచర్లు మాత్రం కరువయ్యారు! పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన డిజిటల్ క్లాస్‌రూమ్‌లతో పాటు అనేక మౌలిక వసతులను పంచాయతీ తరఫున కల్పించినట్లు సర్పంచ్ తెలిపారు. తాను సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాల అభివృద్ధికి రూ.64 లక్షలు, అదనంగా పంచాయతీ తరఫున రూ.12 లక్షల కాంట్రిబ్యూషన్ అందించినట్లు వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేయడంతో పాటు క్రీడలకు అవసరమైన వసతులు కల్పించామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో ముందంజలో ఉన్నప్పటికీ వారిని ప్రోత్సహించే ఉపాధ్యాయుల కొరత ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎంఈఓ, డీవీఓలు తక్షణమే స్పందించాలి ఉపాధ్యాయుల కొరత విషయాన్ని ఇప్పటికే బూర్గంపాడు మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈఓ) దృష్టికి, జిల్లా విద్యాశాఖ అధికారుల (డీవీఓ) దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించినట్లు సర్పంచ్ తెలియజేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై ఎంఈవో, డివిఓ, సారపాక లో ఉన్న ప్రాథమిక పాఠశాల పై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ అన్నారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ విద్యా బోధన అందించే ఉపాధ్యాయులు లేకపోతే ఆ వసతుల ప్రయోజనం విద్యార్థులకు ఎలా అందుతుంది? అని సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ప్రశ్నించారు. కొంతమంది పర్సనల్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సర్పంచ్ పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో తక్షణమే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి ఎంఈఓ, డివిఓ, తోపాటు జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరిన సర్పంచ్ సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి జిల్లా కలెక్టర్ ను కలిసి పాఠశాలలోని లోటుపాట్లను వివరించాల్సి వస్తుందని కిషోర్ శివరాం నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేటందుకు వారంలో రెండు సార్లు పాఠశాలను సందర్శిస్తున్నట్టు సర్పంచ్ తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా పంచాయతీ తరపున మా వంతు సహకారం అందిస్తూనే ఉంటామంటూ తెలియజేశారు.

1 hr ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago
aa549bb9-525a-4196-abb4-2c7200fa5c4d

సారపాక ప్రాథమిక పాఠశాలకు టీచర్ల కొరత విద్యార్థులకు చదువు భారం! ఎంఈఓ, డీవీవో, స్పందించాలంటున్న సర్పంచ్* 287 మంది విద్యార్థులు.. 15 మంది టీచర్లు! సారపాక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు *ఎంఈఓ, డీవీఓలు స్పందించరా? విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రశ్న* సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మసీద్ రోడ్ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతపై గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ, సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 287 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, గతంలో 20 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారని సర్పంచ్ తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో పాటు మరో ముగ్గురిని ఇతర పాఠశాలలకు మార్చడంతో ప్రస్తుతం 15 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. వసతులు కల్పించాం.. టీచర్లు మాత్రం కరువయ్యారు! పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన డిజిటల్ క్లాస్‌రూమ్‌లతో పాటు అనేక మౌలిక వసతులను పంచాయతీ తరఫున కల్పించినట్లు సర్పంచ్ తెలిపారు. తాను సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాల అభివృద్ధికి రూ.64 లక్షలు, అదనంగా పంచాయతీ తరఫున రూ.12 లక్షల కాంట్రిబ్యూషన్ అందించినట్లు వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేయడంతో పాటు క్రీడలకు అవసరమైన వసతులు కల్పించామని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో ముందంజలో ఉన్నప్పటికీ వారిని ప్రోత్సహించే ఉపాధ్యాయుల కొరత ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎంఈఓ, డీవీఓలు తక్షణమే స్పందించాలి ఉపాధ్యాయుల కొరత విషయాన్ని ఇప్పటికే బూర్గంపాడు మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈఓ) దృష్టికి, జిల్లా విద్యాశాఖ అధికారుల (డీవీఓ) దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించినట్లు సర్పంచ్ తెలియజేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంపై ఎంఈవో, డివిఓ, సారపాక లో ఉన్న ప్రాథమిక పాఠశాల పై ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ అన్నారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నాం కానీ విద్యా బోధన అందించే ఉపాధ్యాయులు లేకపోతే ఆ వసతుల ప్రయోజనం విద్యార్థులకు ఎలా అందుతుంది? అని సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ ప్రశ్నించారు. కొంతమంది పర్సనల్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సర్పంచ్ పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు వాస్తవ పరిస్థితులను పరిశీలించి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో తక్షణమే అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి ఎంఈఓ, డివిఓ, తోపాటు జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరిన సర్పంచ్ సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి జిల్లా కలెక్టర్ ను కలిసి పాఠశాలలోని లోటుపాట్లను వివరించాల్సి వస్తుందని కిషోర్ శివరాం నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేటందుకు వారంలో రెండు సార్లు పాఠశాలను సందర్శిస్తున్నట్టు సర్పంచ్ తెలియజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా పంచాయతీ తరపున మా వంతు సహకారం అందిస్తూనే ఉంటామంటూ తెలియజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్ దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!
    1
    నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్
దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు
అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా
అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది
దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    32 min ago
  • వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం 8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వికలాంగుల రాజ్యాధికారమే లక్ష్యం
8వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్
చివ్వెంల: వికలాంగుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికార సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. గురువారం దురాజ్‌పల్లిలో సంఘం 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలతో వికలాంగుల సమస్యలు పరిష్కారం కావని, నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం గత ఎనిమిదేళ్లుగా పోరాటాలు కొనసాగిస్తున్నామని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఎర్రకోట, గోల్కొండ కోటపై వికలాంగుడు జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
    1
    వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు
వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు
వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
    user_Panthangi gokul
    Panthangi gokul
    Sathupalli, Khammam•
    10 hrs ago
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    1
    ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.
ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు.
ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.
    user_మాంధాత సత్య
    మాంధాత సత్య
    Astrologer సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా  మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 
18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని
మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు.
నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు.
నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, 
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్‌ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్‌” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.
    1
    మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన 
వరంగల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్‌ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్‌” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.
    user_Madhu
    Madhu
    కన్నాయిగూడెం, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    1
    నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు*
కాఠ్మాండు,  నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు.
వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం
వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది.
*గల్లంతైన వారిలో భారతీయులు* 
నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు.
*కొనసాగుతున్న సహాయక చర్యలు* 
గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.
భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.