దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్లోని డిసిసి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికై మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి, 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దేశంలోనే 'సంక్షేమం' అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారని, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ముఖ్యంగా రైతాంగానికి అండగా నిలిచి, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు వరద కాలువల నిర్మాణం చేపట్టిన గొప్ప నాయకుడిగా ఆయన ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, చొప్పదండి నియోజకవర్గంలో జేఎన్టీయూ వంటి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని, నేటికీ కీర్తించబడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచారని మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన పోరాట పటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి, గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి, చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్, కల్వల రామ్ చందర్, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్లోని డిసిసి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికై మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి, 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దేశంలోనే 'సంక్షేమం' అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారని, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ముఖ్యంగా రైతాంగానికి అండగా నిలిచి, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు వరద కాలువల నిర్మాణం చేపట్టిన గొప్ప నాయకుడిగా ఆయన ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, చొప్పదండి నియోజకవర్గంలో జేఎన్టీయూ వంటి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని, నేటికీ కీర్తించబడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచారని మేడిపల్లి సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన పోరాట పటిమను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందిపుచ్చుకోవాలని కోరుతూ, కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న, బానోతు శ్రావన్ నాయక్, వెన్న రాజమల్లయ్య, సిరాజ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి ముదుగంటి, గంట శ్రీనివాస కళ్యాణి, కాంతాల జగన్ రెడ్డి, చర్ల పద్మ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, కుంభాల రాజు కుమార్, కల్వల రామ్ చందర్, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, గడప శ్రీనివాస్, మంద మహేష్, శిల్ప, స్వప్నశ్రీ, అందే శంకర్, తోట అంజయ్య, భారీ, మూల కృష్ణారెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, హైమద్, మహమ్మద్ చాంద్, గన్ను మహేందర్ రెడ్డి, హనీఫ్, జొన్నల రమేష్, ముక్క భాస్కర్, సత్తినేని శ్రీకాంత్, విక్టర్, శారద, కట్టెకోల ప్రభాకర్, జ్యోతి రెడ్డి, కాంపల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లిలో ఒక ప్రేమ వ్యవహారం పెద్ద కలకలం సృష్టించింది. తనను ప్రేమించిన యువకుడిని కాదని, మరో యువకుడితో పెళ్లి చేయడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దీంతో సిద్దిపేటకు చెందిన ప్రియుడు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన యువకుడి ఇంటి గోడలకు పోస్టర్లు అతికించాడు. ఈ పోస్టర్లలో, ఆ అమ్మాయి, తాను ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని స్పష్టం చేశాడు. రాత్రిపూట తంగళ్ళపల్లికి కారులో వచ్చి గోడలపై ఈ పోస్టర్లను అంటిస్తున్న సిద్దిపేట జిల్లా యువకుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ పోస్టర్లను చూసిన గ్రామస్థులు ఆశ్చర్యానికి గురవగా, అమ్మాయి కుటుంబ సభ్యులు మరియు పెళ్లి చేసుకోబోయే యువకుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.1
- వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం నుండి బ్రిడ్జి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వేములవాడ ప్రాంతంతో చక్కటి అనుబంధం ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వంలో భాగంగా మల్యాల గ్రామంలో 1737 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాల మరణం తీరని లోటుగా పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2009లో రుద్రంగి, జోగాపూర్, చందుర్తి ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ కలికొట సూరమ్మ చెరువు, మర్రిపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేములవాడ ప్రాంతంలో పలు ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి, ఎంఏఎండి నుండి వేములవాడకు నీటిని అందించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, అగ్రహారంలో ఎలాంటి కార్పస్ ఫండ్ లేకుండా సైన్స్ వింగ్ను ఏర్పాటు చేశారని, వరద కాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నిర్మించారని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, రైతులకు ఉచిత విద్యుత్, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని ఆది శ్రీనివాస్ ప్రశంసించారు. పేద ప్రజల ఆరాధ్య దైవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు.2
- సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేడం లింగమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నాడు ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ఆయన దుర్మరణం చెంది 17 సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని లింగమూర్తి గుర్తుచేశారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి వరప్రదాయినిగా భావించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్లకు ఆయన కాలంలోనే శంకుస్థాపనలు జరిగాయని వివరించారు. ప్రస్తుత ప్రజా పాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నారని లింగమూర్తి పేర్కొన్నారు.1
- జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్.ఐ.ఆర్. ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని, ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, బి.ఎల్.వో లు మరియు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని, రైతు భరోసా నిధుల జమను పురస్కరించుకొని కోనరావుపేటలో ఈ సంబరాలు నిర్వహించారు.2
- హనుమకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు, హంటర్ రోడ్డులోని డీ-లైట్ హోటల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.33,430 నగదు, 10 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు, స్కోర్ స్లిప్, అలాగే TS24H6663 నంబర్ గల క్రెటా కారును టాస్క్ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కలిసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సుబేదారి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్స్పెక్టర్లు కె. శ్రీధర్, టీ. వీరస్వామి, ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్లో ఒక జంట తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ధర్నా నిర్వహించింది. బాధితుల ఆరోపణల ప్రకారం, వివాహం అయినప్పటి నుండి అదనపు కట్నం కోసం అత్తగారి వేధింపులు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా, వారు లైంగిక వేధింపులకు, హత్యాయత్నాలకు కూడా పాల్పడ్డారని ఆ జంట ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఈ విషయమై కరీంనగర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్నతాధికారులు స్పందించి, తమ కుటుంబానికి రక్షణ కల్పించి, తక్షణమే న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు.3
- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్లవనపర్తిలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, కేవలం 15 రోజుల పసిపాపను కన్న తండ్రే విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందనే అక్కసా లేక ఆర్థిక ఇబ్బందులో తెలియదు కానీ, అభం శుభం తెలియని ఆ పసికందు అంగడి సరుకుగా మారిందని, ఈ ఘటనతో తండ్రి జైలుపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామానికి చెందిన రమ-అశోక్ దంపతులకు ఇది నాలుగో సంతానం. వారికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు ఉండగా, 15 రోజుల క్రితం ఈ చిన్నారి జన్మించింది. పాపను ఆసుపత్రిలో చూపించేందుకు తీసుకెళ్తున్నామని చెప్పి, తండ్రి అశోక్తో పాటు అతడి బావ దూడ మహేష్, మేనత్త రాజమ్మ, తోడల్లుడు కళ్లెపల్లి లింగయ్య, కళ్లెపల్లి రాజయ్యలు పాపను తీసుకువెళ్లారు. మధ్యవర్తి కాలువల రవి సాయంతో ఈనెల 3న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నస్పూర్ చెందిన సుదర్శన్ దంపతులకు ఆ పాపను విక్రయించారు. పాప తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి రమ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, పాప విక్రయానికి గురైనట్లు గుర్తించారు. ఈ కేసులో తండ్రితో పాటు బంధువులు మరియు పాపను కొనుగోలు చేసిన సుదర్శన్ దంపతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ పసిపాపను తల్లి ఒడికి చేర్చిన పోలీసులు, ఈ విక్రయంలో భాగమైన అందరిని అరెస్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు.2
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా, వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రైతు సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, రైతులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో సాగు పెట్టుబడుల భారం తగ్గి, రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.1