హైదరాబాద్ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద *_ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు_* బీఆర్ఎస్ జగిత్యాల సభపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:- 🔹 నిన్న జగిత్యాల సభలో కే. చంద్రశేఖర్ రావు గారి ప్రసంగంలో ఉత్తమాటలే తప్ప విషయం లేదని, సబ్జెక్ట్ అంతకన్నా లేదని అన్నారు. కేసీఆర్ తనకు తాను ఏదో ఆపాదించుకుంటున్నారని, కానీ మా ముఖ్యమంత్రి గారికి అయన మీద ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతిపక్ష నాయకునిగా చాలా కాలం కొనసాగాలని మా ముఖ్య మంత్రి గారు కోరుకుంటున్నారని తెలిపారు. 🔹తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ దొరల గడీలను బద్దలు కొట్టాలని కూడా కవిత్వం రాసారని . ఆయన చరిత్రే దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర అని, మీరు అయన పేరు తీసుకోవడంతో ఆయన ఆత్మ ఎక్కడున్నా గోషిస్తుందని పేర్కొన్నారు. 🔹బిఆర్ ఎస్ పార్టీ నుండి అనేక మందిని అవమానించి బయటకు పంపిన చరిత్ర మీదని విమర్శించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు, విజయశాంతి గారు, నాగం జనార్ధన్ రెడ్డి గారు, నాయిని నర్సింహారెడ్డి గారి వంటి నాయకులను గౌరవించకపోగా తీవ్రంగా అవమానించి బయటకు పంపిన చరిత్ర మీదని అన్నారు. 🔹తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని బీఆర్ఎస్ పాలనలో తగిన విధంగా గౌరవించలేని దౌర్భాగ్య పాలన మీది అని, మాజీ మంత్రి టి. రాజయ్యను మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించిన నీచ సంస్కృతి నీది అని విమర్శించారు. 🔹మీ ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కాం, చేప. పిల్లల స్కాం, లిక్కర్ స్కాం, దళిత బంధు వంటి పథకాల్లో అవినీతి జరిగింది. అందుకే మిముల్ని ప్రజలు పక్కన పెట్టారు,కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీమ్లు, స్కాంలు లాగా తయారు చేశారు.. 🔹మా ప్రభుత్వం ద్వారా పేదలకు అండగా నిలబడి....ఉచిత బస్సు ప్రయాణం కల్పించినం , ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం , సన్నబియ్యం వంటి ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సకల జనుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఒక్కరి వల్ల కాదని మాజీ ముఖ్యమంత్రిని విమర్శించారు 🔹 గత ఎన్నికల నుండి వరుస ఓటముల ఎదుర్కొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల విశ్వాసం తగ్గిందని అన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటమి పాలయ్యారు ఇంకా ఏ మొఖం పెట్టుకొని జనంలోకి వస్తున్నారని అన్నారు..!! 🔹మూసీ నది ప్రక్షాళన ద్వారా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు,తాగునీరు అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. 🔹మీ పరిపాలనలో దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలు అమలు కాలేదని అవి ఉత్త హామీలుగా మిగిలి పోయాయి అని విమర్శించారు..
హైదరాబాద్ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద *_ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు_* బీఆర్ఎస్ జగిత్యాల సభపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:- 🔹 నిన్న జగిత్యాల సభలో కే. చంద్రశేఖర్ రావు గారి ప్రసంగంలో ఉత్తమాటలే తప్ప విషయం లేదని, సబ్జెక్ట్ అంతకన్నా లేదని అన్నారు. కేసీఆర్ తనకు తాను ఏదో ఆపాదించుకుంటున్నారని, కానీ మా ముఖ్యమంత్రి గారికి అయన మీద ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతిపక్ష నాయకునిగా చాలా కాలం కొనసాగాలని మా ముఖ్య మంత్రి గారు కోరుకుంటున్నారని తెలిపారు. 🔹తెలంగాణ కవి అలిశెట్టి ప్రభాకర్ దొరల గడీలను బద్దలు కొట్టాలని కూడా కవిత్వం రాసారని . ఆయన చరిత్రే దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర అని, మీరు అయన పేరు తీసుకోవడంతో ఆయన ఆత్మ ఎక్కడున్నా గోషిస్తుందని పేర్కొన్నారు. 🔹బిఆర్ ఎస్ పార్టీ నుండి అనేక మందిని అవమానించి బయటకు పంపిన చరిత్ర మీదని విమర్శించారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గారు, విజయశాంతి గారు, నాగం జనార్ధన్ రెడ్డి గారు, నాయిని నర్సింహారెడ్డి గారి వంటి నాయకులను గౌరవించకపోగా తీవ్రంగా అవమానించి బయటకు పంపిన చరిత్ర మీదని అన్నారు. 🔹తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని బీఆర్ఎస్ పాలనలో తగిన విధంగా గౌరవించలేని దౌర్భాగ్య పాలన మీది అని, మాజీ మంత్రి టి. రాజయ్యను మంత్రి పదవి
నుంచి అవమానకరంగా తొలగించిన నీచ సంస్కృతి నీది అని విమర్శించారు. 🔹మీ ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కాం, చేప. పిల్లల స్కాం, లిక్కర్ స్కాం, దళిత బంధు వంటి పథకాల్లో అవినీతి జరిగింది. అందుకే మిముల్ని ప్రజలు పక్కన పెట్టారు,కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కీమ్లు, స్కాంలు లాగా తయారు చేశారు.. 🔹మా ప్రభుత్వం ద్వారా పేదలకు అండగా నిలబడి....ఉచిత బస్సు ప్రయాణం కల్పించినం , ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం , సన్నబియ్యం వంటి ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సకల జనుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప ఒక్కరి వల్ల కాదని మాజీ ముఖ్యమంత్రిని విమర్శించారు 🔹 గత ఎన్నికల నుండి వరుస ఓటముల ఎదుర్కొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ప్రజల విశ్వాసం తగ్గిందని అన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటమి పాలయ్యారు ఇంకా ఏ మొఖం పెట్టుకొని జనంలోకి వస్తున్నారని అన్నారు..!! 🔹మూసీ నది ప్రక్షాళన ద్వారా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు,తాగునీరు అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. 🔹మీ పరిపాలనలో దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి హామీలు అమలు కాలేదని అవి ఉత్త హామీలుగా మిగిలి పోయాయి అని విమర్శించారు..
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.1
- Post by Tagore1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- Post by JADI RAJU1
- వరంగల్ రంగంపేటలోని శ్రీ భద్రకాళి రోడ్పై ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయం, శ్రీ గాయత్రి మాత దేవాలయాల సముదాయంలో ఈ ఉదయం భక్తి వైభవం నెలకొంది. ఆలయ అర్చకులు జి. కార్తిక్ చారి ఆధ్వర్యంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం నిర్వహించారు. ఇది 101వ దేవాలయ కార్యక్రమంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుతోట బాల కొమురెల్లి స్వామి, మాటేటి సత్యనారాయణ (సత్యం) స్వామి, జగన్మోహన్ రెడ్డి, మూడు నగేష్ స్వామి, లాస్య శ్రీ స్వామి, అరవింద స్వామి, ఎం. రాజేందర్ చారి, జి. కృష్ణ స్వామి, ప్రదీప్, గోపీచంద్, ఆర్. సాత్విక, ఏ. వినయ్, ఈశ్వర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామస్మరణ, రామకీర్తనలు, భజనలు ఘనంగా నిర్వహించబడాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.2
- ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...1