logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది* డీజీపీ నుంచి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న డిఐజి , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. 2026 సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును శుక్రవారం విజయవాడ మంగళగిరిలో ఏపీ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర డీజీపీ శ్రీ హారిష్ కుమార్ గుప్తా ఐపియస్ చేతుల మీదుగా డిఐజి , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్, డిఎస్పీ భార్గవి, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి అందుకున్నారు. డీజీపీ వీరిని అభినందించారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టా త్మక అవార్డును అందుకోవడం జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణమని కొనియాడారు.టెక్నాలజీని వినియోగించి లా అండ్‌ ఆర్డర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ సూచించారు.డిఐజి ,కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ నేరాల అదుపు, నేర నియంత్రణ, సీసీ కెమెరాలు, త్వరితగతిన కేసుల దర్యాప్తు మొదలైన వాటి వల్ల ఈ అవార్డుకు పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఎంపికైందన్నారు.పెద్దకడుబూరు పోలీసులు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పరిష్కారం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యల్లో చురుగ్గా పనిచేశారన్నారు.ఈ కారణంగా అవార్డు దక్కింది.దేశంలో పది పోలీసు స్టేషన్‌లు ఈ అవార్డులకు ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ కు ఆ ఘనత దక్కిందని , కేంద్రం హోం శాఖ అవార్డుకు పెద్దకడుబూరు పోలీసు స్టేషన్‌ ఎంపిక కావటం గర్వంగా ఉంది.సమష్టి కృషితోనే సాధ్యమైంది అని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు తెలిపారు. డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ, సిఐ, ఎస్సైలకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

1 day ago
user_P.VEERANNA
P.VEERANNA
Journalist మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 day ago
2c3b9a48-9761-4c2e-9fd9-510b23d0cfae

*పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది* డీజీపీ నుంచి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్న డిఐజి , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. 2026 సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అవార్డును శుక్రవారం విజయవాడ మంగళగిరిలో ఏపీ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర డీజీపీ శ్రీ హారిష్ కుమార్ గుప్తా ఐపియస్ చేతుల మీదుగా డిఐజి , కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్, డిఎస్పీ భార్గవి, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఏ. మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి అందుకున్నారు. డీజీపీ వీరిని అభినందించారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టా త్మక అవార్డును అందుకోవడం జిల్లా పోలీస్‌శాఖకు గర్వకారణమని కొనియాడారు.టెక్నాలజీని వినియోగించి లా అండ్‌ ఆర్డర్‌ను పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ సూచించారు.డిఐజి ,కర్నూలు

dab3843e-e966-498f-ba68-f0fec34d9924

జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మాట్లాడుతూ నేరాల అదుపు, నేర నియంత్రణ, సీసీ కెమెరాలు, త్వరితగతిన కేసుల దర్యాప్తు మొదలైన వాటి వల్ల ఈ అవార్డుకు పెద్దకడుబూరు పోలీస్‌స్టేషన్‌కు ఎంపికైందన్నారు.పెద్దకడుబూరు పోలీసులు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పరిష్కారం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యల్లో చురుగ్గా పనిచేశారన్నారు.ఈ కారణంగా అవార్డు దక్కింది.దేశంలో పది పోలీసు స్టేషన్‌లు ఈ అవార్డులకు ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ కు ఆ ఘనత దక్కిందని , కేంద్రం హోం శాఖ అవార్డుకు పెద్దకడుబూరు పోలీసు స్టేషన్‌ ఎంపిక కావటం గర్వంగా ఉంది.సమష్టి కృషితోనే సాధ్యమైంది అని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు తెలిపారు. డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ, సిఐ, ఎస్సైలకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    user_J. Bhaskar
    J. Bhaskar
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    7 hrs ago
  • తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
    1
    తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. 
తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం
నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 
తదుపరిఎస్పీ  గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని,
ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్,
ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు.  గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. 
జరుగుతుందన్నారు. 
ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
    user_KESAVA SIRIGINENI
    KESAVA SIRIGINENI
    Journalist ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.
    1
    1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి
గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    1
    సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...*
*బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* 
*విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం 
*ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.*
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.
    1
    అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి  1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* *మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
    1
    చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర పార్బాయిల్డ్ రైస్ మిల్, వెంకటేశ్వర మోడరన్ రైస్ మిల్ ఇవి రెండు విసర్జిస్తున్న వాయు, ఘన, ద్రవ కాలుష్యాలను చిట్యాల మున్సిపల్ అధికారులు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రించకపోవడం వల్ల చంద్రపురి కాలనీ, సాయి ద్వారకాపురి కాలనీ, ఆదర్శనగర్, ఆటోనగర్, ముత్యాలమ్మ గూడెం, సంజీవనగర్ తదితర పట్టణవాసుల జీవనానికి ఈ రైస్ మిల్లులు రెండు  విసర్జించే కాలుష్యం తీవ్ర ఆటంకంగా మారిందని చంద్రపురి కాలనీ చుట్టూరా రైల్వే లైన్ ప్రక్కన చెత్త డెంపు యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల రైస్ మిల్ విసర్జిత కాలుష్యపు నీరు చెత్తలో పేరుకుపోవడంతో ప్రజలు శ్వాస పీల్చలేక, దోమలతో జీవించలేక ఇబ్బందికర  పరిస్థితులు ఎదురయ్యాయని, వీటిని నివారించడంలో మున్సిపల్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వీటిని కంట్రోల్ చేయకపోతే రెండు రైస్ మిల్లులకు తాళాలు వేసి నిలిపివేస్తామని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మిల్లు యాజమాన్యాలను హెచ్చరిక చేశారు.* 
*మూడు జిల్లాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) వెంకన్న గారితో ఫోన్లో మాట్లాడి, వారు సందర్శించి మిల్లుల నుండి వస్తున్న కాలుష్యాన్ని  నివారిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించారు.* 
ఈ ధర్నాలో కాలనీకి చెందిన మహిళలు, బాలబాలికలు వీరితోపాటు చేపూరి శ్రీనివాస్ నేత, మారగొని యాదగిరి గౌడ్, రుద్రారపు నరసింహ, రుద్రారపు కిష్టయ్య, ఆదిరెడ్డి, నరసింహ, రావిడి సత్తిరెడ్డి, బిల్లపాటి అలివేలు, మారగోని జ్యోతి, రుద్రారపు జ్యోతి  తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    5 hrs ago
  • మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
    user_J. Bhaskar
    J. Bhaskar
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.