Shuru
Apke Nagar Ki App…
రైతులకు శుభవార్త చెప్పిన నాదెండ్ల | Nadendla Manohar Good News To AP Farmers | Disha Tv Ap
Skshaidavali Vali
రైతులకు శుభవార్త చెప్పిన నాదెండ్ల | Nadendla Manohar Good News To AP Farmers | Disha Tv Ap
More news from Nadendla and nearby areas
- దోషులకు శిక్ష తప్పదు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై సీఎం చంద్రబాబు సీరియస్ భూ కబ్జాలు, భూ దందాలు చేస్తే ఉపేక్షించం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దగ్ధం కేసులో దోశలు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చట్ట ప్రకారం దోశలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను అసెంబ్లీ లో వున్న రోజులు ఏ మంత్రి కలిసినా, ఎంఎల్ఏ కలిసినా మదనపల్లె హాట్ టాపిక్ గా మారిందే అని నన్ను అడిగారని అన్నారు. మదనపల్లె భూ ఆక్రమణల పైన ప్రత్యేక అధికారిని నియమిస్తామని, మదనపల్లె చూట్టూ భారీగా ల్యాండ్ గ్రాబియింగ్ జరిగిందని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైర్ పైన సిఎం చంద్రబాబునాయుడు సీరియస్గా ఉన్నారని అన్నారు. మదనపల్లి మండలంలోని సిటిఎం పంచాయతీలో వైసిపి భర్త పై భూ ఆక్రమణలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొత్త తహసీల్దారు వచ్చిన వెంటానే బి.కె.పల్లి, సిటిఎం, సిటిఎం క్రాస్ రోడ్డులో ప్రత్యేకంగా వినతుల స్వీకరణ చేస్తామని, సిటిఎం చెరువు ఆక్రమణ, భూ కబ్జా చేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. మదనపల్లె రాయల్ వుడ్ పక్కన అక్రమంగా వన్ బి తో భూమి ఆక్రమణ చేశారన్నారు. అదేవిధంగా వలసపల్లి పంచాయతీలను పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని వీటన్నిటి పైన సమగ్రమైన విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. వైసిపి వాళ్ళు ఏమి చెబితే అది చేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేస్తారని ఆయన అన్నారు. కాట్లటపల్లి రోడ్డులో కొంతమంది కౌన్సిలర్ల, వైసిపి నాయకుల అక్రమణలు చేసారని, దోషులు ఎంతటి వారైనా ఎవరని వదలం అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, షంషీర్, నాగూర్ వలి, ఆర్జే వెంకటేష్, సుధాకర, తదితరులు పాల్గొన్నారు.1
- ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కామెంట్స్1
- రైతులకు శుభవార్త చెప్పిన నాదెండ్ల | Nadendla Manohar Good News To AP Farmers | Disha Tv Ap1
- నాదెండ్ల కు ధన్యవాదాలు తెలిపిన పవన్ ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు Deputy CM Pawan Kalyan -1
- నాదెండ్ల కు ధన్యవాదాలు తెలిపిన పవన్... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు |Deputy CM Pawan Kalyan | Prime91
- *ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే కేంద్రం నుండి ఎక్కువ సాయం కావాలి* *- రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది* *-ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధుల కంటే ఎక్కవ కేటాయింపులు అవసరం* *-ప్రస్తుతం ఇచ్చిన నిధులు ప్రత్యేక కేటాయింపులేమి కావు.. విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన సాయమే* *-పార్లమెంట్లో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు* --------- విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ఎంతో దెబ్బతిన్ననది.. మా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే ఎక్కువ సహకారం అవసరం ఉందని, ప్రస్తుతం టిడిపి ఎన్డీఏలో భాగమే కాబట్టి వచ్చే ఐదు ఏళ్లలో ఎక్కువ నిధులు కేటాయించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. 2014లో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని, అప్పటినుంచి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో ఉందని, రాష్ట్రం ప్రస్తుతం అప్పుల్లో కూరుకు పోయి ఉందని అన్నారు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ ఏపీకి చట్టంలో ఇచ్చిన హామీల గురించి మర్చిపోయి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏపీని అశాస్త్రీయంగా విభజించారని, ఏపీ విభజన చట్టంలోని హామీల ప్రకారమే నిర్మలా సీతారామన్ అమరావతి, పోలవరానికి కేటాయింపులు జరిపారని అన్నారు. విభజనచట్టంలోని సెక్షన్ 94లోనే అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని ఉంది. విభజన చట్టంలోని సెక్షన్ 19లో పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సెక్షన్ 94(1), వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సెక్షన్ 94(2) ప్రకారం నిధులు కేటాయించాలని విభజన చట్టంలోనే పేర్కొన్న విషయాన్న ప్రతిపక్షాలు విస్మరించడం తగదని, సమాఖ్య స్పూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించారని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపుగా పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రంలోని ఉండిపోయాయి, ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిపోయింది, ఈ నేపథ్యంలో ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనక బండి ప్రాంతాలు అభివృద్ధి కూడా విభజన హామీలు ఉన్నదేనని అన్నారు. అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు.. మొదటి అసెంబ్లీ సమావేశాలు నాటికి రూ. 24000కోట్ల ఆర్థిక లోటు ఉంటే అది కాస్తా 2024 నాటికి రూ.9.74 లక్షల కోట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన నిధులు కూడా సమర్థవంతంగా వాడాల్సిన పరిస్థితి ఉందని, సంక్షేమానికి అభివృద్ధికి సమానంగా నిధులు వాడకం జరగలేదని అన్నారు. గత టిడిపి హయాంలో జలవనరులశాఖలో 47వేల కోట్లు ఖర్చు చేస్తే 2019-24మధ్యలో కేవలం 20వేల కోట్లే ఖర్చు చేశారు. రహదారుల నిర్మాణానికి గత టిడిపి హయాంలో రూ. 8800కోట్లు ఖర్చు చేస్తే జగన్ మయాంలో రూ.1350కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు పెట్టామన్నదే ముఖ్యం...అనవసర ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు. ఇప్పటికైనా మా రాష్ట్రానికి నిధులు కేటాయించి అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హార్వర్డ్, కేంబ్రిడ్జిలలో చదవలేదంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి, వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా...కామరాజర్ ఏమీ చదువుకోకపోయినా మధ్యాహ్నా భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆదర్శ నేతగా ఎదిగారు...చదువుకు, నాయకత్వానికి సంబంధం లేదన్న విషయం ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ డి ఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదు, మూడోసారి ప్రధాని అయిన మోదీకి అభినందనలు...వరుసగా 6వ సారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం హర్షణీయం అని అన్నారు.1
- *పరిటాల కు ఉత్తమ సామాజిక సేవ కు గౌరవ డాక్టరేట్* పల్నాడు జిల్లా నరసరావుపేట: మీసేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పరిటాల సత్యనారాయణ గారికి ఉత్తమ సామాజిక సేవ చేసినందుకు గౌరవ డాక్టరేట్ ను యు.ఎస్.ఏ హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. కోవిడ్ లాక్ టైంలో ఎంతోమంది నిరాశయులకు అన్నదానం చేసి వారి ఆకలిని తీర్చి మరియు ఎంతోమంది అనాధ శవాలను దహన సంస్కారాలు చేయించి మరియు ఇప్పటిదాకా సుమారు 75 గ్రామాలలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పరిచి ఎంతోమంది పేద బలుగు బలహీన వర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు సరఫరా చేయించి వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు, అలాగనే తన మీసేవ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎంతోమంది నిరాశయులకు రాత్రిపూట అన్నదానం చేశారు. ఈ ఉత్తమమైన సేవలకు గాను యు.ఎస్.ఏ హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు తన సామాజిక సేవను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రధానం చేశారు.1
- పల్నాడు జిల్లా,. నరసరావుపేట1