logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనాభా ప్రకారం స్థానిక, పార్టీ పదవులలో అవకాశాలు కల్పించాలి.. నీలం మధు రాబోయే స్థానిక ఎన్నికల్లో , కాంగ్రెస్ పార్టీ పదవులలో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, సామాజిక న్యాయం పాటించినప్పుడే పార్టీకి క్షేత్రస్థాయిలో తిరుగులేని విజయం లభిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.మంగళవారం సంగారెడ్డి పట్టణం లోని రెడ్లాస్ హోటల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తూ టిక్కెట్ల పంపిణీ జరగాలని మంత్రికి దామోదర్ కు విజ్ఞప్తి చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని ఆయన కోరారు.

2 hrs ago
user_Yahia Ahmed
Yahia Ahmed
కొండపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
2 hrs ago
d96765aa-8ece-4b29-af43-41a59d077a22
2fed0d1e-8e64-4a41-9cd2-2f3ae3f10898

జనాభా ప్రకారం స్థానిక, పార్టీ పదవులలో అవకాశాలు కల్పించాలి.. నీలం మధు రాబోయే స్థానిక ఎన్నికల్లో , కాంగ్రెస్ పార్టీ పదవులలో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, సామాజిక న్యాయం పాటించినప్పుడే పార్టీకి క్షేత్రస్థాయిలో తిరుగులేని విజయం లభిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు అన్నారు.మంగళవారం సంగారెడ్డి పట్టణం లోని రెడ్లాస్ హోటల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తూ టిక్కెట్ల పంపిణీ జరగాలని మంత్రికి దామోదర్ కు విజ్ఞప్తి చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు దక్కాలని ఆయన కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రత్యేకంగా పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న డి లిమిటేషన్, మహిళా బిల్లు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. బిజెపి తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
    1
    కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రత్యేకంగా పార్లమెంటులో ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న డి లిమిటేషన్, మహిళా బిల్లు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. బిజెపి తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
    1
    వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    3 hrs ago
  • మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
    user_LOKESH DUVVURU
    LOKESH DUVVURU
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    1 hr ago
  • ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
  • जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    1
    जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।
    user_Kishor vaishnav
    Kishor vaishnav
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Secunderabad, Hyderabad•
    10 hrs ago
  • వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    1
    వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో  మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను  వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    1
    త్వరలో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి లోని హోటల్ లో కాంగ్రెస్ జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.