Shuru
Apke Nagar Ki App…
ఏడిద సీతానగరం లో... వైభవంగా అంకాలమ్మ జాతర.... విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.... మండపేట మండలం ఏడిద సీతానగరం లో అంకాలమ్మ వారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమ కార్యక్రమాల్లో రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయన కు స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, గ్రామ సర్పంచ్ వరదా చక్రవర్తి, గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు వేగిరాజు గోపాలకృష్ణ, ఆకుల పుల్లయ్య, చేకూరి వెంకట రాజు, అడ్డాల చిన్న, మేడిద దొరబ్బాయి, ఆకుల రామకృష్ణ, రావూరి చిన్న కాపు,గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Raju Nandikolla
ఏడిద సీతానగరం లో... వైభవంగా అంకాలమ్మ జాతర.... విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.... మండపేట మండలం ఏడిద సీతానగరం లో అంకాలమ్మ వారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమ కార్యక్రమాల్లో రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయన కు స్వాగతం పలికారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, గ్రామ సర్పంచ్ వరదా చక్రవర్తి, గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు వేగిరాజు గోపాలకృష్ణ, ఆకుల పుల్లయ్య, చేకూరి వెంకట రాజు, అడ్డాల చిన్న, మేడిద దొరబ్బాయి, ఆకుల రామకృష్ణ, రావూరి చిన్న కాపు,గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- Post by SS NEWS1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Post by Adimlamrambabu Adimlamrambabu1