కరీంనగర్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాపువాడలోని ఒక ప్రైవేట్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట (త్రీ కార్డ్స్) స్థావరంపై కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేపట్టి, డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న 12 మంది వ్యక్తులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించి, భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుండి రూ. 37,670/- నగదును, 12 మొబైల్ ఫోన్లను, నిందితులకు సంబంధించిన ఒక రెనాల్ట్ కారును మరియు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు, మరియు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ వెల్లడించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
కరీంనగర్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కాపువాడలోని ఒక ప్రైవేట్ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట (త్రీ కార్డ్స్) స్థావరంపై కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేపట్టి, డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న 12 మంది వ్యక్తులను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించి, భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుండి రూ. 37,670/- నగదును, 12 మొబైల్ ఫోన్లను, నిందితులకు సంబంధించిన ఒక రెనాల్ట్ కారును మరియు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు, మరియు వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ వివరాలను టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ వెల్లడించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
- వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.1
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు వద్ద ఘనంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యువత, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు, అనంతరం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద అని మంత్రి ప్రభాకర్ అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా మన జీవన విధానంలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. ప్రజల్లో యోగా పట్ల మరింత అవగాహన, ప్రేరణ కల్పించే లక్ష్యంతో హుస్నాబాద్లో 12 సూర్య నమస్కార భంగిమలను ప్రతిబింబించే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విగ్రహాలు యోగా ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. యోగ సాధనకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రోజువారీ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘ఆరోగ్య హుస్నాబాద్ – ఆరోగ్య తెలంగాణ – ఆరోగ్య భారత్’ లక్ష్య సాధనలో యోగా కీలక సాధనంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక ధృక్పథాన్ని బోధిస్తుందని తెలిపారు. వివిధ దేశాల్లోని ప్రజలు యోగాలోని శక్తిని, ప్రాముఖ్యతను, రోగనిరోధక సామర్థ్యాన్ని గుర్తించి దానిని వినియోగంలోకి తెచ్చాయని ఆయన వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టు సాధించాలని సూచించారు. నిత్యం విధి నిర్వహణలో ఉండటం వలన ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని, అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించగలరని ఎస్పీ స్పష్టం చేశారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరు యోగాభ్యాసానికి తమ దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. అనంతరం, ఎస్పీ గారు యోగ గురువు గారిని, వారి శిష్యులను అభినందించి మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సి.ఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మొగిలి, నటేష్, మధుకర్, ఆర్.ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్.ఐలు కిరణ్ కుమార్, ఉపేందర్ ఛారరి, రంజిత్, ఆర్.ఎస్.ఐలు రాజు, శ్రావణ్ యాదవ్, శ్రీనివాస్, సాయి కిరణ్ సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.3
- వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన చేనేత సంఘం అధ్యక్షుడిగా అడిగొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలుగా అడిగొప్పుల నిర్మల, కోశాధికారిగా బొద్ధుల భావనఋషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు కొత్త డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారి పలుకల సురేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం, నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షుడు అడిగొప్పుల సత్యనారాయణ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్కల్ చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జక్కు అరుణ, దూడం సంజీవులు, మార్త అశోక్, సిరిపురం శంకరయ్య, సింగం కుమార స్వామి, సింగం రామస్వామిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.1
- జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.3
- తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన భాగస్వామ్యం ఎంతో గొప్పదని, వారి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడిగా జయశంకర్ సార్ను అభివర్ణించారు. స్వరాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులను, యువకులను, మేధావులను, ప్రజలను చైతన్యపరిచి, తెలంగాణ ఉద్యమకారులను సిద్ధం చేయడంలో జయశంకర్ సార్ తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. ఈ నివాళి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యకల తిరుపతి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, మహిళా విభాగం సీనియర్ నాయకురాలు జంగా అపర్ణ, సీనియర్ నాయకులు గాలిపెల్లి రత్నాకర్ చారి, జిల్లాయువజన విభాగం నాయకులు నూతి సాయిచరణ్, పూసాల పవన్, సంతు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన తరఫున జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, అలాగే ఆయన జీవిత చరిత్రను భావితరాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్ జలాశయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జలాశయం ఎండిపోయిన ప్రదేశంలో కబడ్డీ, క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గి, మునిగిపోయిన గ్రామాలు మళ్ళీ తేలుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితిని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మండే వేసవిలో సైతం నిండు కుండలా జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోవడం పాలకపక్షం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగినప్పటికీ, గత రెండున్నర ఏళ్లుగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో రైతులకు సాగునీరు అందించకుండా కుట్ర పడుతోందని కూడా ఆరోపించారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో త్రాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు.4
- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ కోర్టు ఆవరణలో శనివారం నాడు యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి లక్ష్మణ చారి స్వయంగా యోగా ఆసనాలు ప్రదర్శించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.2