విజయనగరంలో అంగరంగ వైభవంగా 5వ హనుమాన్ శోభాయాత్ర హిందూ ధర్మ రక్షానికి అన్ని ఏర్పాట్లు పూర్తి విజయనగరం, మే 11: మే 12న జరగనున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలో 5వ హనుమాన్ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు హిందూ ధర్మ రక్షా సమితి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు స్థానిక బాబమెత్తలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సమితి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వివరాలు వెల్లడించారు. మే 12న సాయంత్రం 4 గంటలకు విజయనగరం కోట నుంచి ఈ భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి టెంపుల్ మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో సుమారు పది వేల మంది హిందూ బంధువులు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ర్యాలీ అనంతరం పాత పెద్ద ఆసుపత్రి గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వీరితో పాటు హిందూ ధర్మ రక్షా సమితికి చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇంచార్జ్ రామ్ తరుణ్, జిల్లా సహ కార్యదర్శులు రామ్, రాజేష్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
విజయనగరంలో అంగరంగ వైభవంగా 5వ హనుమాన్ శోభాయాత్ర హిందూ ధర్మ రక్షానికి అన్ని ఏర్పాట్లు పూర్తి విజయనగరం, మే 11: మే 12న జరగనున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విజయనగరంలో 5వ హనుమాన్ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు హిందూ ధర్మ రక్షా సమితి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు స్థానిక బాబమెత్తలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సమితి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు వివరాలు వెల్లడించారు. మే 12న సాయంత్రం 4 గంటలకు విజయనగరం కోట నుంచి ఈ భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి టెంపుల్ మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో సుమారు పది వేల మంది హిందూ బంధువులు
పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ర్యాలీ అనంతరం పాత పెద్ద ఆసుపత్రి గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. వీరితో పాటు హిందూ ధర్మ రక్షా సమితికి చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇంచార్జ్ రామ్ తరుణ్, జిల్లా సహ కార్యదర్శులు రామ్, రాజేష్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
- శ్రీకాకుళం జిల్లాలోని బూరగం గ్రామంలో గ్రామ దేవత చిన్ని పోలమ్మ తల్లి మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు దేవరను ఇంటింటికీ ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంబరాల్లో సుదూర ప్రాంతాల బంధువులు కూడా భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ కలెక్టరేట్ ధర్నా జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, వాటిలో ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్న ను త్వరగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట రైతుల ధర్నా లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అరకొర సౌకర్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని, వెంటనే ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలలో దళారుల దందాను అరికట్టి మొక్కజొన్నకు 2400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు1
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- విజయనగరం జిల్లాలో 26 మంది విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు అన్ని వసతులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.1
- శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో ప్రగతిశీల మహిళా సంఘం (POW) తమ 9వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించింది. మహిళలపై పెరుగుతున్న హింస, వివక్ష, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఐక్య పోరాటం చేయడమే ఈ సభల ముఖ్య లక్ష్యం. మే 23, 24, 2026 తేదీల్లో గుంటూరులో జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం ప్రజలను కోరింది.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్కు చెందిన కుందన్ సింగ్ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1