Shuru
Apke Nagar Ki App…
Srinu Killo
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- వెలుగోడు పట్టణ శివారులో పిల్ల కాలువ వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.శనివారం సాయంత్రం ఎలుగుబంటి సంచారంతో ప్రజలు, ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.అటుగా వెళ్లే ప్రయాణికులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.1
- నాటు సారా వద్దు - అభివృద్ధి నాటు సారా వద్దు అభివృద్ధి వైపు నడవాలని షికారి పేటకు జిల్లా కలెక్టర్ షికారి పేట అభివృద్ధికి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందికొట్కూరులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుఅధికారుల సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు3
- Post by T. Raja simha2
- కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రంలో లారీల కొరత ఉందని రైతులు తెలపడంతో, పంట రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల బెడద లేకుండా, మెరుగైన మద్దతు ధర కోసం రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- జై కోటంరెడ్డి బ్రదర్స్ ✌️ జై టిడిపి ✌️✌️4
- Post by Bondhu Suresh1
- పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేద రోగులను దృష్టిలో పెట్టుకొని సీఎం రిలీఫ్ కు ఎంపీ గా తాను సిఫారసు చేయగానే అవసరమైన నిధులు విడుదల చేయడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల బొమ్మలసత్రం లోని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు.నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బోరెడ్డి వెంకట కృష్ణారెడ్డి కి రూ.1,51,616 లు, నంద్యాల ఎస్ బి ఐ కాలనీకి చెందిన శివశంకవ రెడ్డికి రూ.132,620 లు నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన ఎస్. మహబూబ్ బాషా కు రూ. 35,900 లు, గోస్పాడు మండలం దీబగుంట్ల కు చెందిన వై. ఓబులేసుకు రూ. 35914 లు, ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం, ఎరగుడిదిన్నె గ్రామానికి చెందిన ఎన్. తిక్క నవసమ్మ కు రూ. 42000 లు, కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన ఎం. ననాగ లింగమ్మ కు రూ. 32,324 లు, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన సయ్యద్ షాహిదాకు రూ. 30514 లు, దొర్నిపాడు గ్రామానికి చెందిన సి.ఈశ్వరమ్మ కు రూ.143490 లు, నంద్యాల నీలివీధికి చెందిన నాగ లక్ష్మమ్మ కు రూ.60,000 లు, కర్నూలు శారదా నగర్ కు చెందిన జి. నార్దిని కి రూ.40810 ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు. మా వినతిని మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేసినందుకు, నిధుల విడుదలకు కృషి చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి భాధితులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి తదితర టీడీపీ నాయకులు ఉన్నారు.2
- సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్న 25 మంది దంపతులు.. బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో వెలసిన శ్రీ అలర్మెల్ మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం శనివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 25 మంది కుటుంబాలు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గము పొందుటకు అతి తక్కువ ఖర్చులో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించవచ్చునని భక్తులకు తెలిపారు.కోరిన భక్తులకు ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. శ్రీబాలాజీ అన్నదాన సత్రంవారి ఆధ్వర్యంలో పాల్గొన్న భక్తులందరికీ అన్న ప్రసాద పంపిణీ చేసినట్లు డాక్టర్ పి.గోపాల్,శేఖర్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు జయంత్, ఆలయ సిబ్బంది బాబయ్య,భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.1