ఏడుపాయల మహాశివరాత్రి జాతరలో ఘనంగా బండ్ల ఊరేంపు బోనాల సమర్పణ ఏడుపాయలలో వైభవంగా బండ్ల ప్రదర్శన ఏడుపాయల జాతర వైభవంగా సాగుతోంది. వన దుర్గా ప్రాంగణం భక్తజన సంద్రమైంది. మహా జాతరలో ప్రధాన ఘట్టం రెండవ రోజు ఎడ్ల బండ్ల ప్రదర్శన కనుల పండువగా, అత్యంత వైభవోపేతంగా సాగింది. సోమవారం ఉదయం నుంచి మహిళలు నెత్తిన బోనాలు... మరోవైపు శివసత్తుల పూనకాలు ... పోతరాజుల విన్యాసాలతో జాతర మార్మోగింది. మహా శివరాత్రి ఉపవాసాలు ఆచరించిన భక్తులు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని విరమించారు. మునుపెన్నడూ లేనివిధంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, కర్ణా టక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొద్దంతా బోనాల సందడి నెలకొంది. దప్పుల మోతలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. సమాచార శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఘనంగా బండ్ల ఊరేగింపు బండ్ల ఊరేగింపు సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. అనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు కొబ్బరికాయ కొట్టి బండ్ల ప్రదర్శన ప్రారంభించారు. పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల బండ్లు, గుమ్మటాల బండ్లు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బందోబస్త్ పర్యవేక్షించారు.
ఏడుపాయల మహాశివరాత్రి జాతరలో ఘనంగా బండ్ల ఊరేంపు బోనాల సమర్పణ ఏడుపాయలలో వైభవంగా బండ్ల ప్రదర్శన ఏడుపాయల జాతర వైభవంగా సాగుతోంది. వన దుర్గా ప్రాంగణం భక్తజన సంద్రమైంది. మహా జాతరలో ప్రధాన ఘట్టం రెండవ రోజు ఎడ్ల బండ్ల ప్రదర్శన కనుల పండువగా, అత్యంత వైభవోపేతంగా సాగింది. సోమవారం ఉదయం నుంచి మహిళలు నెత్తిన బోనాలు... మరోవైపు శివసత్తుల పూనకాలు ... పోతరాజుల విన్యాసాలతో జాతర మార్మోగింది. మహా శివరాత్రి ఉపవాసాలు ఆచరించిన భక్తులు ఉదయమే అమ్మవారిని దర్శించుకుని విరమించారు. మునుపెన్నడూ లేనివిధంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, కర్ణా టక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొద్దంతా బోనాల సందడి నెలకొంది. దప్పుల మోతలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. సమాచార శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఘనంగా బండ్ల ఊరేగింపు బండ్ల ఊరేగింపు సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. అనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు కొబ్బరికాయ కొట్టి బండ్ల ప్రదర్శన ప్రారంభించారు. పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల బండ్లు, గుమ్మటాల బండ్లు పెద్దసంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బందోబస్త్ పర్యవేక్షించారు.
- కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- Mattress Manufacturers Company in Hyderabad Call Now: 81066600221
- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- *బడంగ్ పేట్ సర్కిల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బడంగ్ పేట్ సర్కిల్* తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్ పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామీడి రామిరెడ్డి ఆధ్వర్యం లో మేగా రక్తదాన శిఖరాన్ని నిర్వహించి అంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలసి కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ....... తెలంగాణ లో మళ్ళీ కెసిఆర్ పాలన కావాలి అని ప్రజలు కోరుకుంటారు అని రామిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలన పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడ లో పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని,సంక్షేమ పథకాల తో ప్రజలు సుఖసంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామం లో కేసీఆర్ చేసిన అభివృద్ధి,సంక్షేమం ఇప్పటికే కనపడుతుందని అన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనైనని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా*17 ఫిబ్రవరి 2026 మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిఫిబ్రవరి 17 , 2026:ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ., ఏ.ఈ.ఆర్.ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందుగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు గాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను బూత్ స్థాయి అధికారులకు మ్యాపింగ్ లో సహాయకులుగా నియమించి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి పార్టీ నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని, బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, ఏ ఈ ఆర్ ఓ లు వారికి మ్యాపింగ్ చేయడంలో సహాయ సహకారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జరిగేలా పకడ్బందీగా ప్రక్రియ చేయాలని తెలిపారు.బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని తెలిపారు. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ రాహుల్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులతో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి , తాసిల్దార్ శ్రీనివాస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.1