మహాలక్ష్మి పథకం మహిళలకు భరోసా:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల:-మహాలక్ష్మి పథకం మహిళలకు స్వేచ్ఛ,భరోసా కల్పిస్తూ వారి ఆర్థిక భారం తగ్గించి సాధికారతను పెంపొందిస్తున్నదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం గద్వాల్ ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి ₹10,000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసిన తొలి పథకం మహాలక్ష్మి (ఉచిత బస్సు) పథకమని తెలిపారు.మహిళల సాధికారతకు ఈ పథకం ఒక కీలక అడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ,వారికి సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉద్యోగాలు,వైద్య సేవలు, విద్య కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు.జోగులాంబ గద్వాల్ బస్ స్టేషన్ పరిధిలో గత రెండు సంవత్సరాల్లో సుమారు ₹110 కోట్ల ప్రయాణ చార్జీని మహిళలు ఆదా చేసుకున్నారని,దాదాపు 28 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు. రోజుకు సగటున ₹13 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి,రవాణా శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.అలాగే ఉప ముఖ్యమంత్రి అవసరమైన బడ్జెట్ను సమకూర్చుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.వచ్చే ఏడాదికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు.ఇప్పటికే మండల సమాఖ్యల ద్వారా బస్సులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని బస్సులను ఆర్టీసీకి అద్దెకు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగంపరుచుకొని మహిళలను అభివృద్ధి చెందాలన్నారు. ఉచిత బస్సు పథకం – మహిళల అభిప్రాయాలు రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల తమ రోజువారీ జీవితంలో గణనీయమైన మార్పు వచ్చిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి నెల బస్సు ఖర్చు గణనీయంగా తగ్గిందని,ఇప్పుడు ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలు,తదితర అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.ఈ పథకం తమకు ఆర్థిక ఉపశమనం కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని కూడా అందించిందని వారు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ బస్ స్టాండ్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని,పార్కింగ్ను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి, ఆర్టిసి డిపో మేనేజర్ సునీత,ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం మహిళలకు భరోసా:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల:-మహాలక్ష్మి పథకం మహిళలకు స్వేచ్ఛ,భరోసా కల్పిస్తూ వారి ఆర్థిక భారం తగ్గించి సాధికారతను పెంపొందిస్తున్నదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం గద్వాల్ ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి ₹10,000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసిన తొలి పథకం మహాలక్ష్మి (ఉచిత బస్సు) పథకమని తెలిపారు.మహిళల సాధికారతకు ఈ పథకం ఒక కీలక అడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ,వారికి సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉద్యోగాలు,వైద్య సేవలు, విద్య కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు.జోగులాంబ గద్వాల్ బస్ స్టేషన్ పరిధిలో గత రెండు సంవత్సరాల్లో సుమారు ₹110 కోట్ల ప్రయాణ చార్జీని మహిళలు ఆదా చేసుకున్నారని,దాదాపు 28 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారని వెల్లడించారు. రోజుకు సగటున ₹13 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ పథకానికి
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి,రవాణా శాఖ మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.అలాగే ఉప ముఖ్యమంత్రి అవసరమైన బడ్జెట్ను సమకూర్చుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.వచ్చే ఏడాదికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు.ఇప్పటికే మండల సమాఖ్యల ద్వారా బస్సులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని బస్సులను ఆర్టీసీకి అద్దెకు అందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగంపరుచుకొని మహిళలను అభివృద్ధి చెందాలన్నారు. ఉచిత బస్సు పథకం – మహిళల అభిప్రాయాలు రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల తమ రోజువారీ జీవితంలో గణనీయమైన మార్పు వచ్చిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి నెల బస్సు ఖర్చు గణనీయంగా తగ్గిందని,ఇప్పుడు ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలు,తదితర అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు.ఈ పథకం తమకు ఆర్థిక ఉపశమనం కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని కూడా అందించిందని వారు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ బస్ స్టాండ్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని,పార్కింగ్ను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయలక్ష్మి, ఆర్టిసి డిపో మేనేజర్ సునీత,ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
- ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.1
- Post by T.Shiva Krishna1
- కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.1
- ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.1
- వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.1
- full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action1
- తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.2
- ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…1