logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అరకు పంచాయతీ కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు ఏది?- --ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు. డుంబ్రిగూడ:- మండలంలో అరకు పంచాయతీ కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు ఏవి అని ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి టి సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పి సురేష్ కుమార్ ప్రశ్నించారు. అరకు పంచాయతీ కేంద్రం నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా గిరిజనేతరులు, బినామీ దారులు అక్రమ కట్టడాలు నిర్మాణం చేసుకుంటున్నారనీ, 1/70చట్టాన్ని పూర్తిగా విస్మరించి ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు ఆక్రమణలు చేసుకొని దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేసుకుంటున్నారనీ చెప్పారు. తూతూ మంత్రంగా పంచాయతీ, రెవెన్యూ అధికారులు నోటిసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనీ విమర్శించారు. నేరేడు వలస ప్రభుత్వ పాఠశాలకు సంబందించిన స్థలం కబ్జా చేసి గిరిజనేతరుడు అయిన ఏరుబంటి. శ్రీను,కోరుకొండ. రమేష్ ఇద్దరు కలిసి బినామీ పేర్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటున్న కూడా ఎటువంటి చర్యలు తీసుకో కుండా అధికారులు నిద్ర పోతున్నారనీ మండిపడ్డారు.కొయ్యల నంధీశ్వరరావు వెల్డింగ్ షాపు యజమాని ఇప్పటికే అనేక భవనాలు నిర్మాణం చేసుకున్నారనీ, అతని పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ చెప్పారు. టి అప్పలనాయుడు అనే గిరిజనేతరుడు నేషనల్ హైవే, హనుమాన్ జంక్షన్ దగ్గర పెద్ద రెస్టారెంట్ నిర్మాణం చేసుకున్నారనీ, సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ ఎంక్వరీ చేసిన ఎటువంటి చర్యలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అరకు పంచాయితీలో పూర్తిగా 1/70చట్టం దురాక్రమణ జరుగుతుందనీ, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ, పీఓ, జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి గిరిజనేతరులు నిర్మాణం చేస్తున్న భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు కూల్చాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న గిరిజన నేతరులపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికీ ప్రభుత్వ అధికారులు భాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని హెచ్చరించారు.1/70చట్టం పటిష్టంగా అమలు చేయాలనీ పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజాసంఘాలు, ఆదివాసులు పోరాడుతుంటే, కూటమి ప్రభుత్వం కనీసం వాటి అమలు కోసం చర్యలు తీసుకోపోవడం శోచనీయం అన్నారు.

14 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago
dd18b648-171f-41f1-85f6-c41bfb2e29ed

అరకు పంచాయతీ కేంద్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు ఏది?- --ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు. డుంబ్రిగూడ:- మండలంలో అరకు పంచాయతీ కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు ఏవి అని ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి టి సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు పి సురేష్ కుమార్ ప్రశ్నించారు. అరకు పంచాయతీ కేంద్రం నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా గిరిజనేతరులు, బినామీ దారులు అక్రమ కట్టడాలు నిర్మాణం చేసుకుంటున్నారనీ, 1/70చట్టాన్ని పూర్తిగా విస్మరించి ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు ఆక్రమణలు చేసుకొని దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేసుకుంటున్నారనీ చెప్పారు. తూతూ మంత్రంగా పంచాయతీ, రెవెన్యూ అధికారులు నోటిసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనీ విమర్శించారు. నేరేడు వలస ప్రభుత్వ పాఠశాలకు సంబందించిన స్థలం కబ్జా చేసి గిరిజనేతరుడు అయిన ఏరుబంటి. శ్రీను,కోరుకొండ. రమేష్ ఇద్దరు కలిసి బినామీ పేర్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకుంటున్న కూడా ఎటువంటి చర్యలు తీసుకో కుండా అధికారులు నిద్ర పోతున్నారనీ మండిపడ్డారు.కొయ్యల నంధీశ్వరరావు వెల్డింగ్ షాపు యజమాని ఇప్పటికే అనేక భవనాలు నిర్మాణం చేసుకున్నారనీ, అతని పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ చెప్పారు. టి అప్పలనాయుడు అనే గిరిజనేతరుడు నేషనల్ హైవే, హనుమాన్ జంక్షన్ దగ్గర పెద్ద రెస్టారెంట్ నిర్మాణం చేసుకున్నారనీ, సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ ఎంక్వరీ చేసిన ఎటువంటి చర్యలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అరకు పంచాయితీలో పూర్తిగా 1/70చట్టం దురాక్రమణ జరుగుతుందనీ, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ, పీఓ, జాయింట్ కలెక్టర్ వెంటనే స్పందించి గిరిజనేతరులు నిర్మాణం చేస్తున్న భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు కూల్చాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న గిరిజన నేతరులపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికీ ప్రభుత్వ అధికారులు భాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని హెచ్చరించారు.1/70చట్టం పటిష్టంగా అమలు చేయాలనీ పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజాసంఘాలు, ఆదివాసులు పోరాడుతుంటే, కూటమి ప్రభుత్వం కనీసం వాటి అమలు కోసం చర్యలు తీసుకోపోవడం శోచనీయం అన్నారు.

  • user_सतरंगी जहानाबादी shuru repoter
    सतरंगी जहानाबादी shuru repoter
    Dhanarua, Patna
    namaste namaste namaste namaste namaste namaste namaste namaste namaste
    14 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    2
    రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం
సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Bevara Nagarjuna
    Bevara Nagarjuna
    సాలూరు, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో రక్తదానంతో ప్రాణాలను కాపాడుదాం: ఎస్ ఐ జి భాస్కరరావు..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నవజీవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈగల్ డిపార్ట్మెంట్, రెడ్‌క్రాస్ సంస్థల సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో రక్త నిల్వలు ఎంతో అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు.
ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావం యువతపై పెరుగుతోందని, తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
రక్తదానం చేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. భాస్కర్‌రావును నవజీవ ట్రస్ట్ బ్రాంచ్ మేనేజర్ చిన్నమ్మలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, రెడ్‌క్రాస్ సూపర్‌వైజర్ రాము, స్వాతిశ్రీ, రెడ్‌క్రాస్ సిబ్బంది, నవజీవ ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    1
    బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు
విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    1
    అన్నదానం మహాదానం
అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు 
వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు
    user_అభిమాని ఫౌండేషన్
    అభిమాని ఫౌండేషన్
    బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    1
    నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ
నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని  సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    1
    విజయవాడ గురించి వర్ణిస్తున్న  అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 min ago
  • సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    1
    సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్  మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్
రాజాం /సంతకవిటి, షురూ
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు  నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి  సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్  దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    2
    శ్రీకాకుళం చిన్మయ్ మిషన్ స్వామి పరాత్మనంద్ సరస్వతీ వారిచే బాల విహార్, ఉచితంగా భగవద్గీత, రామాయణం నేర్పిస్తున్న దృశ్యాలు
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.