బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ హెచ్చరిక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి :-బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే అటువంటి వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. బైండోవర్ కాలంలో నేరాలకు పాల్పడితే ఒప్పుకున్నటువంటి మొత్తాన్ని చెల్లించ లేకున్నా, అలా చెల్లించలేని పక్షంలో రిమాండ్ పంపడం జరుగుతుంది. లేపాక్షి మండలంలోని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఈరోజు బైండోవర్ అయిన ఓ వ్యక్తికి 15 రోజులు రిమాండుకు ఆదేశించారు. బైండోవర్ అయి కూడా నేరాలకు పాల్పడే వారికి జిల్లాలోనే ఒక హెచ్చరిక అని ఇకనుండి బైండోవర్ కాలంలో నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు. లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామానికి చెందిన అద్దాల నారాయణస్వామి అనే వ్యక్తి గతంలో గొడవలు, అల్లర్లు మరియు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుల్లో బైండోవర్ చేయబడి ఉండగా, బైండోవర్ కాలంలో మళ్లీ నేరానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు కోర్టులో చలాన్ చెల్లించాల్సి ఉండగా, అతను చెల్లించకపోవడంతో, BNSS 141 & 142 సెక్షన్ల కింద 15 రోజులు (03.03.2026 వరకు) జుడీషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. నేరాలకు పాల్పడే వారు, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబడరని, అవసరమైతే చట్టంలోని గరిష్ట శిక్షలు విధిస్తామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ప్రజలకు విజ్ఞప్తి : ప్రజాశాంతిని భంగం చేసే చర్యలు గానీ, చట్ట విరుద్ధ కార్యకలాపాలు గానీ ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ హెచ్చరిక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి :-బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి నేరాలకు పాల్పడితే అటువంటి వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. బైండోవర్ కాలంలో నేరాలకు పాల్పడితే ఒప్పుకున్నటువంటి మొత్తాన్ని చెల్లించ లేకున్నా, అలా చెల్లించలేని పక్షంలో రిమాండ్ పంపడం జరుగుతుంది. లేపాక్షి మండలంలోని గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు ఈరోజు బైండోవర్ అయిన ఓ వ్యక్తికి 15 రోజులు రిమాండుకు ఆదేశించారు. బైండోవర్ అయి కూడా నేరాలకు పాల్పడే వారికి జిల్లాలోనే ఒక హెచ్చరిక అని ఇకనుండి బైండోవర్ కాలంలో నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు. లేపాక్షి మండలం కంచి సముద్రం గ్రామానికి చెందిన అద్దాల నారాయణస్వామి అనే వ్యక్తి గతంలో గొడవలు, అల్లర్లు మరియు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుల్లో బైండోవర్ చేయబడి ఉండగా, బైండోవర్ కాలంలో మళ్లీ నేరానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఉత్తర్వుల మేరకు కోర్టులో చలాన్ చెల్లించాల్సి ఉండగా, అతను చెల్లించకపోవడంతో, BNSS 141 & 142 సెక్షన్ల కింద 15 రోజులు (03.03.2026 వరకు) జుడీషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. నేరాలకు పాల్పడే వారు, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబడరని, అవసరమైతే చట్టంలోని గరిష్ట శిక్షలు విధిస్తామని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. ప్రజలకు విజ్ఞప్తి : ప్రజాశాంతిని భంగం చేసే చర్యలు గానీ, చట్ట విరుద్ధ కార్యకలాపాలు గానీ ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ రామకృష్ణ పరిశీలించారు . అనంతరం పట్టణం లోని నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ పాలు రకాల సూచనలను తెలియజేశారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1